JANASENA Posted January 25, 2017 Report Share Posted January 25, 2017 దుబాయ్:ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని భారత దేశ పతాక రంగులు గల విద్యుద్దీపాలతో అలంకరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ భవనం భారత త్రివర్ణ పతాకం రంగులతో మెరిసిపోనుంది. ‘ఈ రోజు రాత్రి భారత 68వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకం తరహాలోనే బుర్జ్ ఖలీఫా భవనం మొత్తాన్ని ఎల్ఈడీ దీపాలతో అలంకరించి మెరిసేలా ఏర్పాట్లు చేసినట్లు’ బుర్జ్ఖలీఫా అధికారిక ట్విట్టర్లో నిర్వాహకులు తెలిపారు. దుబాయ్లో ఉన్న ఈ భవనం 823 మీటర్ల ఎత్తుంది. అబుదాబి పాలకుడు, యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ గౌరవార్థం ఈ భవనాన్ని నిర్మించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ హాజరుకానుండటం తెలిసిందే. ఈ సందర్భంగా యూఏఈ సైనికులు భారత సైనికులతో పాటు పరేడ్లో పాల్గొనున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted January 25, 2017 Author Report Share Posted January 25, 2017 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.