Jump to content

KCR @ Tirupathi


JANASENA

Recommended Posts

తిరుమలలో కేసీఆర్‌ 
ఆయన వెంట తరలివచ్చిన మంత్రులు, ఉన్నతాధికారులు 
విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రికి ఘన స్వాగతం 
నేడు శ్రీవారి దర్శనం, కానుకగా స్వర్ణాభరణాలు 
21hyd-general1a.jpg

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సమేతంగా మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు తరలివచ్చారు. శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకుని తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామివారికి స్వర్ణాభరణాలు బహూకరిస్తారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి సముదాయానికి రాత్రి 7.10 గంటలకు చేరుకున్నారు. ఇక్కడ కేసీఆర్‌కు తితిదే ఈవో సాంబశివరావు, తిరుమల జేఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛాలు అందచేసి ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కంటే రెండు గంటలు ముందుగా శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ రాగా.. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, శోభ దంపతులతో పాటు వారి కుమార్తె, నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు.

నేడు శ్రీవారికి మొక్కు చెల్లింపు 
శ్రీవారిని బుధవారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు, మంత్రులు, ఉన్నతాధికారులు దర్శించుకోనున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం.. శ్రీవారి ఆలయానికి మహద్వారం గుండా చంద్రశేఖరరావు దంపతులకు ప్రవేశించే అర్హత ఉంది. ఈ విషయాన్ని తితిదే ఈవో, జేఈవో సీఎంకు వివరించారు. శ్రీవారి దర్శనానంతరం స్వామివారికి సాలిగ్రామ హారం, ఐదు పేటల మకర కంఠెను తెలంగాణ ప్రభుత్వం తరఫున అందజేస్తారు. ముఖ్యమంత్రి కోరిన సమయానికి అందించడానికి సిద్ధంగా ఆభరణాలను పరకామణిలో భద్రపర్చారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమలలోని పుష్పగిరి మఠంలో జరిగే తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అధ్యక్షుడు పెద్దిసుదర్శనరెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం తిరిగి శ్రీకృష్ణ విశ్రాంతి భవనానికి చేరుకుంటారు. అక్కడే అల్పాహారం అనంతరం ఉదయం 10.30 గంటలకు తిరుచానూరుకు బయలుదేరుతారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ముక్కుపుడకను కానుకగా సమర్పిస్తారు.

21hyd-general1b.jpg

రంగనాయకుల మండపంలో ఆభరణాల ప్రదర్శన 
తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లతో తయారు చేయించిన ఆభరణాలను తితిదే బుధవారం ఉదయం 7 గంటల నుంచి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రదర్శించనుంది. శ్రీవారిని దర్శించుకునే సమయంలో వాటిని తితిదే ఈవో, తిరుమల జేఈవోకు కేసీఆర్‌ అందజేస్తారు.

ఉద్యమం సమయంలో మొక్కు: కవిత 
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొక్కుకున్నారని ఎంపీ కవిత తెలిపారు. తిరుమలలో ఆమె విలేకరులతో మాట్లాడారు. స్వరాష్ట్రం ఆవిర్భావం అనంతరం కొత్త రాష్ట్రం కుదుటపడుతున్న తరుణంలో మొక్కు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చామన్నారు. తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉందని, తెలుగు రాష్ట్రాలకు మంచి భవిష్యత్తు ఉండాలని, ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచాలని భగవంతుణ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కేసీఆర్‌ను కలిసిన వైకాపా నేతలు 
తిరుమలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వైకాపా నేతలు మంగళవారం రాత్రి కలుసుకున్నారు. రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పుంగనూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి శ్రీకృష్ణ విశ్రాంతి భవనంలోని ముఖ్యమంత్రి బస చేసిన గదికి చేరుకుని పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం వైకాపా నేతలు మాట్లాడుతూ కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారని ప్రశంసించారు. కేసీఆర్‌లా చంద్రబాబు ప్రతిపక్షానికి తగిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

21hyd-general1c.jpg

విమానాశ్రయం వద్ద సందడి 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఏపీ ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. మంత్రి బొజ్జల కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు సుగుణమ్మ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేశారు. విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కేసీఆర్‌ను చూసేలా ఏర్పాట్లు చేశారు. తలసాని యువసేన పేరుతో అభిమానులు విమానాశ్రయం వద్ద కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆయన స్థానికులకు అభివాదం చేసి తిరుమలకు బయలుదేరారు. తూర్పు గేటు దాటిన వెంటనే అక్కడ వేచి ఉన్న తుడా మాజీ ఛైర్మన్‌ శంకర్‌రెడ్డిని కేసీఆర్‌ గమనించారు. వాహన శ్రేణిని రెండు నిమిషాలు నిలిపి, వాహనం నుంచి వెలుపలికి వచ్చారు. కేసీఆర్‌కు శంకర్‌రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ‘కేసీఆర్‌.. జిందాబాద్‌’ అంటూ నినాదాలు మారుమోగాయి.

అందరూ బాగుండాలి 
అంతకుముందు విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయాక రెండు ప్రాంతాల్లోని ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకి తాము వ్యతిరేకం కాదని, రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

21hyd-general1d.jpg

21hyd-general1e.jpg

21hyd-general1f.jpg

21hyd-general1g.jpg

21hyd-general1h.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...