Navyandhra Posted March 22, 2018 Report Share Posted March 22, 2018 సమయం మించిపోతోంది ఆదరవుగా నిలుస్తున్నా అందుకోని విద్యార్థులు చంద్రన్న బీమా కింద ఉపకార వేతనానికి తక్కువగా దరఖాస్తులు అర్హత ఉన్నా చేయని వారు 45,949 మంది ఈ నెల 24 వరకు అవకాశం చంద్రన్న బీమా కింద ప్రభుత్వం అందించే ఉపకార వేతనానికి దరఖాస్తు దూరంలో ఆగిపోతున్నారు విద్యార్థులు. ఆన్లైన్లో తమ వివరాలను పొందుపరచాలన్న విషయంపై అవగాహన లేకపోవడమో.. రూ. 1200 ఇస్తారా అన్న సంశయమో తెలియదు కానీ రెండు జిల్లాల్లో సగానికి సగం మంది ఆన్లైన్లో తమ వివరాలను పొందుపరచలేకపోతున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సుమారు 45949 మంది అర్హత ఉన్నా ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేయలేదు. మరో మూడు రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా విద్యార్థులు దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం కింద నమోదైన అసంఘటితరంగ కార్మికుల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అయితే వాటిని అందుకోవటంలో వేలాది మంది విద్యార్థులు విఫలమవుతున్నారు. * కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉపకార వేతనాలు పొందేందుకు అసంఘటిత రంగ కార్మికుల పిల్లలు 1,06140 మంది అర్హత సాధించారు. కేవలం 60,191 మంది మాత్రమే అన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకా 45, 949 మంది తమ వివరాలను అన్లైన్లో నమోదు చేసుకోలేదు. రెండు రోజుల్లో వివరాలు నమోదు చేసుకోకపోతే ఉపకార వేతనాలు కోల్పోయే ప్రమాదం ఉంది. * రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన ప్రజా సాధికార సర్వేలో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరిగి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అసంఘటిత రంగ కార్మికులను గుర్తించి వారిని చంద్రన్న బీమా పథకం కింద నమోదు చేశారు. * ఈ సందర్భంగా వారి కుటుంబాల్లో 9, 10 తరగతులు, ఇంటర్, సీనియర్ ఇంటర్ ఐటీఐ తదితర కోర్సులు చదువుతున్న వారి వివరాలు నమోదు చేసి ఉపకార వేతనాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. * ప్రజా సాధికార సర్వే ప్రకారం కృష్ణా జిల్లా పరిధిలో మొత్తం 1,15,147 మంది లబ్ధిదారులు ఉండగా అందులో అన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు 1,03,479 మంది ఉన్నారు. దరఖాస్తు చేసుకోని వారు 11,668 మంది ఉన్నారు. * గుంటూరు జిల్లాలోని 57 మండలాల పరిధిలో 1,27,235 మంది లబ్ధిదారులు ఉండగా అందులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు 1,19742 మంది ఉండగా దరఖాస్తు చేసుకోనివారు 7,493 మంది మాత్రమే ఉన్నారు. 24లోగా దరఖాస్తు చేసుకోవాలి అర్హత ఉండి ప్రజాసాధికార సర్వేలో నమోదైన వారు ఈ నెల 24వ తేదీ లోగా ఆయా పురపాలకాల పరిధిలోని పేదరిక నిర్మూలన విభాగాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మెప్మా పీడీ సత్యనారాయణ తెలిపారు. చంద్రన్న బీమా కింద నమోదైన తల్లిదండ్రుల ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్ నంబర్లను వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా ప్రభుత్వం అందిస్తున్న Rs 1200 చొప్పున ఉపకార వేతనాలను పొందవచ్చన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
WHAT Posted March 22, 2018 Report Share Posted March 22, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.