Jump to content

EVM tampering ane Nakka CBN, itu rara


reality

Recommended Posts

‘ఈవీఎంలతో మాయ’

 

2014 ఎన్నికల్లో భాజపా ఓటు యంత్రాలను హ్యాక్‌ చేయించింది
ఈ విషయం తెలిసిన గోపీనాథ్‌ ముండే హత్యకు గురయ్యారు
ఆ కేసు దర్యాప్తు చేసిన అధికారీ మరణించారు
ఈవీఎంలను హ్యాక్‌ చేయొచ్చని మేము రుజువు చేశాం
మా బృందంలో కొంత మందిని హైదరాబాద్‌లో చంపేశారు
భాజపా నేతను కలవడానికి వెళ్లినప్పుడు మాపై కాల్పులు
నేను తప్పించుకుని విదేశాలకు పారిపోయా
స్కైప్‌ ద్వారా లండన్‌లో ఆరోపించిన ‘సైబర్‌ నిపుణుడు’ 
ఖండించిన ఎన్నికల సంఘం, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి

21hyd-main2a_4.jpg

లండన్‌: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం)ల ద్వారా గత సార్వత్రిక ఎన్నికల్లో ‘రిగ్గింగ్‌’  జరిగిందంటూ సైబర్‌ నిపుణుడిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. వీటిని హ్యాక్‌ చేయవచ్చని ఆయన చెప్పారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. సయ్యద్‌ షుజా అనే ఈ నిపుణుడు సోమవారం లండన్‌లో భారత పాత్రికేయ సంఘం (ఐరోపా) నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కైప్‌ ద్వారా మాట్లాడారు. అయితే ముఖం కనిపించకుండా మాస్క్‌ ధరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను అభివృద్ధి చేసిన ఈసీఐఎల్‌ బృందంలో తాను కూడా సభ్యుడినని చెప్పారు. 2009 నుంచి 2014 వరకూ తాను ఆ సంస్థలో పనిచేశానని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చా అన్నది పరిశీలించాలని ఈసీఐఎల్‌ తన బృందాన్ని కోరిందన్నారు. వాటిని హ్యాక్‌ చేయవచ్చని తాము నిరూపించామని తెలిపారు. తన బృందంలోని కొందరు సభ్యులు హత్యకు గురికావడంతో 2014లో తాను భారత్‌ నుంచి పరారయ్యాయని చెప్పారు. అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరారన్నారు. అయితే తన వాదనకు మద్దతుగా ఆయన ఆధారాలను ఇవ్వలేదు. షుజా వాదన ప్రకారం.. 
* ఈవీఎంలను హ్యాక్‌ చేయడం కోసం తక్కువ పౌనఃపున్యమున్న సంకేతాలను పొందేలా భాజపాకు టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో సాయం చేసింది. డేటాను ట్రాన్స్‌మిట్‌ చేయడానికి జియోకు నెట్‌వర్క్‌ ఉంది. దీనివల్ల భాజపా లబ్ధి పొందింది. ఇలాంటి సౌకర్యాలు దేశవ్యాప్తంగా 9 చోట్ల ఉన్నాయి. అయితే తాము ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడుతున్నామన్న సంగతి జియో ఉద్యోగులకు తెలియదు. డేటా ఎంట్రీ మాత్రమే చేస్తున్నామని వారు అనుకున్నారు. (అయితే 2014లో జియో సేవలు ప్రారంభం కాలేదు. 2016 సెప్టెంబర్‌ నుంచే అవి ప్రారంభమయ్యాయి.)

21hyd-main2d.jpg

* మిలటరీస్థాయి పౌనఃపున్యాలను ట్రాన్స్‌మిట్‌ చేసే మాడ్యులేటర్‌ ద్వారా ఈవీఎంలను భాజపా హ్యాక్‌ చేసింది.

 

* గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీకి సంబంధించి ఈవీఎంలలో రిగ్గింగ్‌ జరిగింది.

 

* 2014 ఏప్రిల్‌లో ఈవీఎంల నుంచి సంకేతాలు వెలువడుతున్నట్లు గుర్తించాం. మాకు తెలిసిన ఈ సమాచారంతో భాజపాను బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకున్నాం. హైదరాబాద్‌ శివార్లలో భాజపా నేత ఒకరిని కలుసుకునేందుకు మా బృందం వెళ్లింది. అక్కడ మా బృందంపై కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు చనిపోయారు. నేను తప్పించుకున్నా. ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూడటానికి హైదరాబాద్‌లోని కిషన్‌గఢ్‌లో మతకలహాలు జరిగినట్లు చిత్రీకరించారు.

 

* గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్‌ చేసినట్లు తెలుసుకున్నందువల్లే భాజపా నేత, కేంద్ర మంత్రి గోపీనాథ్‌ ముండే హత్యకు గురయ్యారు. (నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దివారాలకే దిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే చనిపోయారు.)

 

* ముండే మరణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలనుకున్నారు. ఆలోగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

* 2015లో దిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈ సంకేత ప్రసారాలను మేం అడ్డుకున్నాం. ఫలితంగా మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ గెల్చుకుంది. లేకుంటే భాజపా స్వీప్‌ చేసి ఉండేది.

 

* రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ సంకేత ప్రసారాలను మాబృందం అడ్డుకుంది. లేకుంటే ఆ రాష్ట్రాల్లోనూ భాజపా విజయం సాధించి ఉండేది. 

 

* ఈవీఎంలతో రిగ్గింగ్‌ చేయవచ్చా అన్నది తెలుసుకునేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ  నన్ను సంప్రదించాయి. సాయం చేసే ఉద్దేశంతో కాంగ్రెస్‌ను మేమే సంప్రదించాం.  


* నా ఆరోపణలకు ఆధారాలిస్తా. ఇటీవలి ఎన్నికల్లో వాడిన ఈవీఎంల ద్వారానే మీకు హ్యాకింగ్‌ తీరును వివరిస్తా. ఏయే ఎన్నికల్లో ట్యాంపరింగ్‌ జరిగిందో చెబుతా.

 

* ఈ విలేకరుల సమావేశానికిఎన్నికల సంఘాన్ని కూడా ఆహ్వానించాం. కానీ రాలేదు. రాజకీయ పార్టీలను ఆహ్వానించాం. అయితే కాంగ్రెస్‌ తరఫున కపిల్‌ సిబల్‌ ఒక్కరే వచ్చారు.


గౌరీ లంకేశ్‌కు చెప్పా
ఈవీఎంల హ్యాకింగ్‌పై కథనం రాయడానికి పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ అంగీకరించారు.  ఆలోగానే ఆమె హత్యకు గురయ్యారు. ఈవీఎంలలో వాడిన వైర్లను ఎవరు తయారుచేశారన్నది తెలుసుకునేందుకు సహ చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. ఆ తర్వాతే ఆమె హత్య జరిగింది.


ఎలాంటి లోపాలు లేవు: ఈసీ
షుజా ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఖండించింది. ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవన్న తమ వాదనకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. తాజా ఆరోపణలకు సంబంధించి ఎలాంటి న్యాయ చర్యలు తీసుకోవాలన్న అంశంపై పరిశీలన జరుపుతున్నట్లు వివరించింది. దురుద్దేశంతో ఈ యంత్రాలపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ఈవీఎంలను ప్రభుత్వ రంగంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), ఈసీఐఎల్‌ తయారుచేస్తున్నాయని వివరించింది. కఠిన పర్యవేక్షణ, భద్రతా స్థితిగతుల నడుమ వీటి రూపకల్పన జరుగుతోందని తెలిపింది. తయారీలోని అన్ని దశల్లోనూ సాంకేతిక నిపుణుల కమిటీ పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది.

ఈవీఎంల హ్యాకింగ్‌ అతి పెద్ద అబద్ధం: జైట్లీ

21hyd-main2b.jpg

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంల)తో రిగ్గింగ్‌ చేయవచ్చన్న ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తోసిపుచ్చారు. కాంగ్రెస్‌ అవివేకం ఓ అంటురోగంలా ప్రబలిపోతోందని, ఈవీఎంల విషయంలో ఆ పార్టీ వాదన అతిపెద్ద అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తల రుణమాఫీ, రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు అంటూ చేసిన ఆరోపణలు ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ మరో అతిపెద్ద అబద్ధానికి దిగిందని ఆరోపించారు. అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ప్రజలకు ఏ చెత్త చెప్పినా నమ్మేస్తారని కాంగ్రెస్‌ భావిస్తోందా అని ప్రశ్నించారు.


సిబల్‌ హాజరు కావడం కాకతాళీయం కాదు: నఖ్వీ
మరో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పందిస్తూ- లండన్‌లో జరిగిన విలేకరుల సమావేశానికి కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ హాజరుకావడం కాకతాళీయమేమీ కాదన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలైన సోనియా, రాహుల్‌గాంధీలే  వారి తరఫున సిబల్‌ను పంపించి ఉంటారని ఆరోపించారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయడం సాధ్యం కాదన్నారు.


21hyd-main2c_1.jpgఈసీ దృష్టికి హ్యాకింగ్‌ అంశం: మమతా
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం)లను హ్యాక్‌ చేయవచ్చంటూ ఒక సైబర్‌ నిపుణుడు తాజాగా చేసిన వాదనను విపక్షం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళుతుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రతి ఓటూ విలువైందేనని, అందువల్ల ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామన్నారు.


ఈవీఎంల పనితీరును పరీక్షించాల్సిందే: కాంగ్రెస్‌
ఈవీఎంల హ్యాకింగ్‌ చాలా తీవ్రమైన విషయమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి అన్నారు. ఈ యంత్రాల పనితీరుపై ఇప్పటికే కాంగ్రెస్‌, ఇతర పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయన్నారు. ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం కలిగించాల్సి ఉందనీ, ఎన్నికలకు ముందే సగం వీవీప్యాట్‌లను పరీక్షించి, వాటి కచ్చితత్వాన్ని నిరూపించాలన్నారు. ఎన్నికల సంఘం విశాల దృక్పథంతో దీని గురించి ఆలోచించాలని కోరారు.

Link to comment
Share on other sites

Quote

హైదరాబాద్‌ శివార్లలో భాజపా నేత ఒకరిని కలుసుకునేందుకు మా బృందం వెళ్లింది. అక్కడ మా బృందంపై కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు చనిపోయారు. నేను తప్పించుకున్నా. ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూడటానికి హైదరాబాద్‌లోని కిషన్‌గఢ్‌లో మతకలహాలు జరిగినట్లు చిత్రీకరించారు.

ivi eppudu ayyayi assalu

Link to comment
Share on other sites

రెండో విడత ఎన్నికలు జరిగిన పంచాయతీలు : 4130)

మద్దతు పార్టీ తెరాస కాంగ్రెస్‌ తెదేపా భాజపా సీపీఐ సీపీఎం ఇతరులు
గెలుపు 2591 825 37 37 12 24 557
తొలిదశతో కలిపి 5220 1745 68 104 31 56 1315
Link to comment
Share on other sites

so are you saying trs tampered and won ? anduke na lafangi gadu gelavagane... election commisioner kalla meda padi asirvadam tesukundi?? i dont understand your intention here..

 

enta ki beram kudrchukunnadu??

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

so are you saying trs tampered and won ? anduke na lafangi gadu gelavagane... election commisioner kalla meda padi asirvadam tesukundi?? i dont understand your intention here..

show the proofs vayya? orrike aneyadam kadu..

Link to comment
Share on other sites

Just now, psycopk said:

so are you saying trs tampered and won ? anduke na lafangi gadu gelavagane... election commisioner kalla meda padi asirvadam tesukundi?? i dont understand your intention here..

Panchayat elections ballot paper tho ayyayi... no EVM used, still TRS got stupendous majority. 

Ippudu kuda artham kakapothe ... I defer it to Lokesh Pappu.

Link to comment
Share on other sites

3 minutes ago, reality said:

Panchayat elections ballot paper tho ayyayi... no EVM used, still TRS got stupendous majority. 

Ippudu kuda artham kakapothe ... I defer it to Lokesh Pappu.

MLA ga gelichina vadu.. panchyat members ni gelipinchukovatam enta sepu...

mundu panchayt elections jarigi tarwata assembly vi aaite secneario mari undedi..

Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

MLA ga gelichina vadu.. panchyat members ni gelipinchukovatam enta sepu...

mundu panchayt elections jarigi tarwata assembly vi aaite secneario mari undedi..

vuntadi vuntadi

 

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

MLA ga gelichina vadu.. panchyat members ni gelipinchukovatam enta sepu...

mundu panchayt elections jarigi tarwata assembly vi aaite secneario mari undedi..

Covering lo meeku meere satira Babuu 

a visionary leaders n visionary k bakthuluu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...