Jump to content

Jagan anna development


psycopk

Recommended Posts

ఇంటింటికీ వెళ్లిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన 

11-05-2022 Wed 14:29
  • గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన
  • రోడ్డు ఎప్పుడు వేస్తారంటూ మంత్రి గుమ్మనూరు జయరాం ఘెరావ్
  • ఉపాధి కూలీ రావడంలేదంటూ బుగ్గనను నిలదీసిన మహిళలు
  • సమస్యలు చెప్పినా పట్టించుకోలేదంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఆగ్రహం
AP Mins and MPs Face Backlash By Public

గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగిలాయి. ఇవాళ కర్నూలు జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాంను హత్తిబెళగల్ లో పలు అంశాలపై ప్రజలు ఘెరావ్ చేశారు. ఆలూరు–హత్తిబెళగల్ మెయిన్ రోడ్డు ఎప్పుడు వేస్తారంటూ ప్రశ్నించారు. తమకు అమ్మ ఒడి ఎందుకు ఇవ్వడం లేదంటూ కొందరు మహిళలు మంత్రిని నిలదీశారు. 

ఇటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూ నిరసన తప్పలేదు. రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీ పనులకు డబ్బులు రావడం లేదంటూ హెచ్. కొట్టాలకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు పడడం లేదని అధికారిని అడిగిన మంత్రి.. వారంలో డబ్బులు పడతాయని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ పై ప్రజలు మండిపడ్డారు. సమస్యలు చెప్పినా పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్నా వినలేదని చెప్పారు. 

కర్నూలు జిల్లా పత్తికొండ పరిధిలోని మద్దికెరలో డ్రైనేజీ సమస్య ఉందంటూ ఎమ్మెల్యే శ్రీదేవికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎన్నోరోజుల కిందటనో డ్రైనేజీ పాడైందని, అయినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

Link to comment
Share on other sites

జగన్ రెడ్డి కుటుంభం ఛైర్మన్లగా వున్న సాక్షిలో అబద్దపు రాతలకి & ఆర్ధిక అవకతవకలకి కూడా జగన్ కి  సంభందం లేదు 

కానీ.. పేపర్ ఐదుగురి వాట్సప్ లో తిరిగిన తర్వాత .. ఆరో వ్యక్తి వాట్సప్ లోకి వచ్చింది .. ఆ ఆరో వ్యక్తి నారాయణ స్కూల్ లో పని చేసే అతను కాబట్టి  .. నారాయణ రెస్పాన్సిబుల్ & కనీసం ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్.. అది కూడా మేనేజ్మెంట్ బోర్డ్ నుండి కొన్నేళ్ల క్రితమే నారాయణ తప్పుకున్నా కూడా 

దీనికి మళ్లా సజ్జల వచ్చి .. వైఎస్ టైంలో మాత్రమే వెలిగిన వీరి పార్టీ కేశవ రెడ్డి స్కూల్స్ కథ మరిచి .. నీతి నిజాయితీ అని గురువింద నీతులు.. వైఎస్ టికెట్ ఇచ్చిన ఆదిత్య శేషారెడ్డి విషయం మరచి విద్యాసంస్తల వారు రాజకీయాలు అంటూ కబుర్లు చెప్తున్నాడు 

జగన్ రెడ్డి అధికారంలో వున్నప్పుడు మాత్రమే అతని ఆస్తులు పెరుగుతాయి అయినా కూడా అతను విజయవంతమైన వ్యాపారవేత్త .. కానీ 30 ఏళ్లకు పైగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న నారాయణది మాత్రం తెలుగుదేశం ఆశీస్సులతో నడుస్తున్నట్టు.. జనాలు ఓ మాదిరిగా కూడా కనిపిచ్చట్లేదనుకుంటా వీరికి

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...