Jump to content

Recommended Posts

Posted

 

Jagan Mohan Reddy: పోలీసులకు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగన్ 

09-07-2025 Wed 18:39 | Andhra
Jagan Mohan Reddy Warns Police
 

 

  • రైతుల పట్ల పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జగన్
  • ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండని పోలీసులకు హెచ్చరిక
  • రాబోయేది జగన్ ప్రభుత్వమనేది గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
"ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదు. రేపు రాబోయేది జగన్ ప్రభుత్వం. ఈ విషయం గుర్తుంచుకోండి" అంటూ హెచ్చరికలు జారీ చేశారు. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"రైతుల తలలు పగలగొడతారా? 1,200 మందిని జైళ్లలో పెడతారా? అసలు రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?" అంటూ జగన్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. రైతులను రౌడీ షీటర్లలా పరిగణిస్తూ దురుసుగా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రలోభాలకు, ఇచ్చే లంచాలకు లొంగవద్దని పోలీసులకు హితవు పలికారు.

"రేపు ఇదే చంద్రబాబు మిమ్మల్ని కూడా మోసం చేయొచ్చు. అప్పుడు మీ తరఫున పోరాటం చేయాల్సి వచ్చేది కూడా నేనే" అని జగన్ అన్నారు. కనీస మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మామిడి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, వారి పక్షాన నిలబడతానని భరోసా ఇచ్చారు. జగన్ పర్యటనతో బంగారుపాళ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.  

 

 

 

Posted

Y. S. Jagan Mohan Reddy: పక్కా ప్రణాళికతోనే జగన్ పర్యటనలు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు 

09-07-2025 Wed 18:05 | Andhra
Jagans Tours are Planned to Disrupt Peace Alleges Acham Naidu
 

 

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తున్నారన్న అచ్చెన్నాయుడు
  • ఐదారు జిల్లాల నుంచి జనాలను తరలించడం ఎందుకని ప్రశ్న
  • పథకం ప్రకారమే రోడ్లపై మామాడి పండ్లు పోశారని విమర్శ
వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న పర్యటనలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన జగన్‌కు లేదని, కేవలం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే పక్కా ప్రణాళికతో యాత్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

జగన్ పర్యటనలు సినిమా సెట్టింగుల్లా ఉన్నాయని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. "పరామర్శకు వెళ్తే రైతులను కలిసి మాట్లాడాలి కానీ, ఐదారు జిల్లాల నుంచి జనాన్ని తరలించడం ఎందుకు? ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే రోడ్లపై మామిడి పండ్లను పోశారు. ఇది క్రిమినల్ మైండ్‌తో చేసే పని" అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

తోతాపురి మామిడి రైతుల సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈసారి 7 లక్షల మెట్రిక్ టన్నుల బంపర్ క్రాప్ రావడం, పల్ప్ పరిశ్రమల వద్ద గతేడాది నిల్వలు ఉండటంతో ధర పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో, పరిశ్రమలతో మాట్లాడి కిలో మామిడిని రూ.8కి కొనేలా ఒప్పించామని, ప్రభుత్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున సాయం అందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్న తర్వాత కూడా జగన్ పర్యటనలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...