JANASENA Posted December 1, 2016 Report Posted December 1, 2016 దిల్లీ : మీ ఆధార్ కార్డు మీద 12 అంకెల సంఖ్య త్వరలో నగదు రహిత వ్యవస్థలో కీలకంగా మారనుంది. ఆధార్తో జరిగే లావాదేవీలు కార్డ్లెస్, పిన్ లెస్గా వుంటాయని యూఐడీఏఐ డైరెక్టర్ జనరల్ అజయ్పాండే తెలిపారు. ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోనువాడకం దారులు ఫింగర్ ప్రింట్, ఐరిస్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలు జరిగే విధంగా రూపకల్పన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారత్లో తయారుచేసే మొబైల్ కంపెనీలు ఐరిస్, ఫింగర్ ప్రింట్ను గుర్తించే విధంగా తయారుచేయమని సూచించినట్టు నీతిఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ చెప్పారు. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా వ్యాపార,వాణిజ్య సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా వున్న చిన్న వ్యాపారస్థులకు కూడా పలు రాయితీలు ఇస్తున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి అరుణాసుందరరాజన్ వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు పలు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.