అమెరికాలో పెట్టుబడుల అన్వేషణ సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి మరో విజయం దక్కింది. నెట్వర్కింగ్ సిస్టమ్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పేరున్న సిస్కో అమరావతికి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు, ఇతర దేశాల ప్రతినిధులను కలిసేందుకు ఇష్టపడని సిస్కో చీఫ్ జాన్ చాంబర్స్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందాన్ని ఆయన నివాసానికి ఆహ్వానించారు. అంతేకాక ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 30 కంపెనీల సీఈవోలు పాల్గొనేలా చూడడం ఏపీకి ఆయనిచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనమని చెబుతున్నారు. అమరా