AP News: న్యాయవాదికి రూ.96 లక్షల ఫీజా?
జీవో 239ను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం
ఈనాడు, అమరావతి: సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డికి రూ.96 లక్షలు ఫీజుగా చెల్లించేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ ఈ ఏడాది మే 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో 239ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఏపీ న్యాయవాదుల రుసుముల నిబంధన-43 ఉల్లంఘించేదిగా ఆ జీవో ఉందని హైకోర్టు న్యాయవాది చింతల విజయ్కుమార్ తరఫున న్యాయవాది వై.కమలారాణి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, కొట్టేయాలన