రాష్ట్రంలో కొరియా పారిశ్రామికవాడ
ఈనాడు - అమరావతి
నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి దక్షిణ కొరియా కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశంలోని బూసాన్లో ఉన్న పారిశ్రామికనగరం తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ భారీ పారిశ్రామికవాడను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. దక్షిణ కొరియాకు చెందిన 30 మంది పారిశ్రామికవేత్తల బృందం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. కొరియాలోని బూసాన్లో ఒకేచోట 3వేల పరిశ్రమలతో పారిశ్రామికవాడ ఉందని, అలాంటిదే ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నామ