Jump to content

Kanesam center ni funds adagochu ani teluso ledo ee psyco gadiki


Recommended Posts

Posted

Chandrababu: ఇలాంటి సమయాల్లో కేంద్రం సాయం కోరాలని కూడా ఈ సీఎంకు తెలియదేమో: చంద్రబాబు 

09-12-2023 Sat 17:42 | Andhra
  • బాపట్ల జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
  • పర్చూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటల పరిశీలన
  • తుపానుపై రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు
  • రైతుల తరఫున తాను పోరాటం చేస్తానని స్పష్టీకరణ
 
Chandrababu slams CM Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పర్చూరు నియోజకవర్గం చెరుకూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల కష్టాలు పట్టించుకోని ఈ ముఖ్యమంత్రిని దేవుడు కూడా క్షమించడని అన్నారు. ఒక వ్యక్తి అహంకారానికి రాష్ట్ర రైతులు బలైపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు అసమర్థ ముఖ్యమంత్రే కారణమని విమర్శించారు. రోడ్లు, సాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు కూడా చేయించలేకపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సీఎంకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై, సాగునీటిపై లేదని విమర్శలు చేశారు. 

మిగ్జామ్ తుపాను గురించి రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులకు సకాలంలో గోనె సంచులు ఇచ్చినా ధాన్యం తడవకుండా ఇంటికి తెచ్చుకునేవారని తెలిపారు. పట్టిసీమ నీరు ముందే వదిలినా అక్టోబరు నాటికి పంట చేతికొచ్చి ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తుపాన్లను ఆపలేం... కానీ ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించే వీలుంటుంది కదా అని వ్యాఖ్యానించారు. 

వచ్చే ఎన్నికల్లో రైతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. విపత్తు నష్టం నుంచి ఆదుకోవాలని కేంద్రాన్ని కూడా కోరలేదని మండిపడ్డారు. ఇలాంటి విపత్కర సమయాల్లో కేంద్రం సాయం అడగాలని కూడా ఈ సీఎంకు తెలియదేమో అంటూ చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

రైతుల తరఫున తాను పోరాటం చేస్తానని, వారికి అండగా నిలుస్తానని చంద్రబాబు ఉద్ఘాటించారు. రైతులు ధైర్యం కోల్పోయి అఘాయిత్యాలు చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు

  • psycopk changed the title to Kanesam center ni funds adagochu ani teluso ledo ee psyco gadiki
Posted

Chandrababu: మిర్చి రైతు శ్రీనివాసరావుకు రూ.2 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు 

09-12-2023 Sat 18:13 | Andhra
  • పర్చూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • 6 ఎకరాల్లో మిరప పంట వేసిన రైతు శ్రీనివాసరావు
  • తుపాను కారణంగా పొలంలో నిలిచిన నీరు... కుళ్లిన మిరప మొక్కలు
  • చేసేది లేక పంటను పీకేస్తున్నానని చంద్రబాబుకు చెప్పిన రైతు
  • రైతు బాధ పడడం చూసి చలించిపోయిన చంద్రబాబు
 
Chandrababu announces Rs 2 lakhs for a farmers who lost crop due to cyclone

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తుపాను కారణంగా దెబ్బతిన్న బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పర్యటించారు. చెరుకూరు గ్రామంలో పంటలపై తుపాను ఏ విధంగా ప్రభావం చూపిందే ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

చంద్రబాబు చెరుకూరు గ్రామం మీదుగా వెళుతుండగా... గడ్డం శ్రీనివాసరావు అనే రైతు మిరప పంటను పీకేస్తూ కనిపించాడు. వెంటనే ఆగిన చంద్రబాబు... ఆ రైతును పలకరించారు. 

తాను 6 ఎకరాల్లో మిరపపంట వేశానని, తుపాను రావడంతో పొలంలో నీరు నిలిచిపోయి మిరప మొక్కలు కుళ్లిపోయాయని రైతు శ్రీనివాసరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక చేసేది లేక పంటను పీకేస్తున్నానని వెల్లడించాడు. 

తన పెట్టుబడి, శ్రమ అంతా వృథా అయిందని ఆ రైతు బాధ పడడం చూసి చంద్రబాబు చలించిపోయారు. అప్పటికప్పుడు రైతు శ్రీనివాసరావుకు రూ.2 లక్షల సాయం ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని ఆ రైతును ఓదార్చారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, రైతులందరినీ ఆదుకుంటామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Posted

Chandrababu: తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు ఇవ్వాలి: చంద్రబాబు 

09-12-2023 Sat 14:50 | Andhra
  • బాపట్ల జిల్లాలో తుపాను విలయం
  • నేడు బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • చంద్రబాబు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్న గిరిజనులు
  • ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని వెల్లడి
  • బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పిన చంద్రబాబు
 
Chandrababu visits cyclone hit people in Bapatla district
Listen to the audio version of this article

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల జమ్ములపాలెంలోని ఎస్టీ కాలనీలో గిరిజనుల పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేశారు. 

తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని తెలిపారు. కాలనీలో రహదారి లేక రోజుల తరబడి బురదలోనే తిరిగామని వాపోయారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదని చంద్రబాబుకు వివరించారు. 

వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా విన్న చంద్రబాబు... తాము అధికారంలోకి వచ్చాక అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ ఎస్టీ కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాలతో కూడిన కిట్లు పంపిణీ చేశారు.

అంతేకాదు, టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Posted
4 hours ago, anna_gari_maata said:

Jail nundi vacchaka chala healthy ga kanipistunnadu

Apparently, Jail is good for his health!

He should frequent it... Free food, bed, A/C, mosquitoes, security and acco…

@3$%

  • Haha 2
Posted
1 hour ago, psycopk said:

Chandrababu: ఇలాంటి సమయాల్లో కేంద్రం సాయం కోరాలని కూడా ఈ సీఎంకు తెలియదేమో: చంద్రబాబు 

09-12-2023 Sat 17:42 | Andhra
  • బాపట్ల జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
  • పర్చూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటల పరిశీలన
  • తుపానుపై రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు
  • రైతుల తరఫున తాను పోరాటం చేస్తానని స్పష్టీకరణ
 
Chandrababu slams CM Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పర్చూరు నియోజకవర్గం చెరుకూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల కష్టాలు పట్టించుకోని ఈ ముఖ్యమంత్రిని దేవుడు కూడా క్షమించడని అన్నారు. ఒక వ్యక్తి అహంకారానికి రాష్ట్ర రైతులు బలైపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు అసమర్థ ముఖ్యమంత్రే కారణమని విమర్శించారు. రోడ్లు, సాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు కూడా చేయించలేకపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సీఎంకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై, సాగునీటిపై లేదని విమర్శలు చేశారు. 

మిగ్జామ్ తుపాను గురించి రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులకు సకాలంలో గోనె సంచులు ఇచ్చినా ధాన్యం తడవకుండా ఇంటికి తెచ్చుకునేవారని తెలిపారు. పట్టిసీమ నీరు ముందే వదిలినా అక్టోబరు నాటికి పంట చేతికొచ్చి ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తుపాన్లను ఆపలేం... కానీ ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించే వీలుంటుంది కదా అని వ్యాఖ్యానించారు. 

వచ్చే ఎన్నికల్లో రైతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. విపత్తు నష్టం నుంచి ఆదుకోవాలని కేంద్రాన్ని కూడా కోరలేదని మండిపడ్డారు. ఇలాంటి విపత్కర సమయాల్లో కేంద్రం సాయం అడగాలని కూడా ఈ సీఎంకు తెలియదేమో అంటూ చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

రైతుల తరఫున తాను పోరాటం చేస్తానని, వారికి అండగా నిలుస్తానని చంద్రబాబు ఉద్ఘాటించారు. రైతులు ధైర్యం కోల్పోయి అఘాయిత్యాలు చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు

ilanti time lo kuda intha digajarey sttements enduku istunnado...asaley arogyam bagoleka bail meeda bayatiki vachadu

  • Haha 1
Posted

సెంటర్ ఫండ్స్ దాకా ఎందుకు లే కానీ, స్టేట్ కంట్రోల్ లో ఉన్నవి చాలా ఫిక్స్ చేసుకోవచ్చు.

ఏడాది క్రితం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఒక గేట్ పోయింది .. ఇప్పుడు ఇంకో గేట్ పోయింది !
అంతకముందు ఏడాది పులిచింతల గేటు కొట్టకపోయింది , పించ కట్ట తెగిపోయింది , అన్నమయ్య డామ్ కొట్టకపోయింది , పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ! రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పూర్తిగా సర్వనాశనం చెయ్యాలని ఫిక్స్ అయి చేస్తన్నట్టున్నారు !
 
 
Posted

Noru lestundi malli…

bail cancel application ready ga vundi…

  • Haha 1
Posted
3 minutes ago, Android_Halwa said:

Noru lestundi malli…

bail cancel application ready ga vundi…

Gelichindi Congress party aithe Babu enduku recchipothunnadu?

Posted
44 minutes ago, rushmore said:

Gelichindi Congress party aithe Babu enduku recchipothunnadu?

Pothu kosam ayivuntadi….aina visionary epudu enduku emi chestado ayinake telvadu…evaritho epudu pothu avasaram padutundo ani…

Posted
20 minutes ago, Android_Halwa said:

Pothu kosam ayivuntadi….aina visionary epudu enduku emi chestado ayinake telvadu…evaritho epudu pothu avasaram padutundo ani…

Please Congress tho potthu pettukondi.... malli 2034 daaka bail raadu....!

Posted

Chandrababu: తుపానుతో నష్టపోయిన ప్రజలను ఆదుకోండి.. మోదీకి చంద్రబాబు లేఖ 

10-12-2023 Sun 12:19 | Telangana
  • తుపాను కారణంగా 15 జిల్లాలు ప్రభావితమయ్యాయన్న చంద్రబాబు
  • ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, రూ. 10 వేల కోట్ల పంటనష్టం వాటిల్లిందని ఆవేదన
  • జాతీయ విపత్తుగా ప్రకటిస్తే బాధితులకు మెరుగైన సాయం అందుతుందన్న టీడీపీ అధినేత
 
TDP chief Chandrababu writes letter to PM Modi

మిగ్జామ్ తుపానుతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రాణ ఆస్తినష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను తీవ్రత దృష్ట్యా మిగ్జామ్ ను జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. 

లేఖలోని ముఖ్యాంశాలు

  • తుపాను వల్ల జరిగిన నష్టాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నా.
  • తుపాను కారణంగా రాష్ట్రంలోని 15 జిల్లాలు ప్రభావితమయ్యాయి.
  • 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి.
  • తుపాను కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
  • ప్రాథమిక అంచనా ప్రకారం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
  • దీనివల్ల రూ. 10 వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందని అంచనా.
  • పంటలు దెబ్బతినడంతో పాటు పలు చోట్ల పశువులు చనిపోయాయి, చెట్లు విరిగిపడ్డాయి. దాదాపు 770 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
  • తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగింది. 
  • వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయింది.
  • తుపాను వల్ల పంట నష్టపోయి ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మత్స్యకార పడవలు, వలలకు కూడా నష్టం జరిగింది. వారు జీవనోపాధి కోల్పోయారు.
  • తుపాను ప్రభావం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న తమిళనాడుపై కూడా ప్రభావం చూపింది.
  • తుపాను తీవ్రత, నష్టం దృష్ట్యా మిగ్జామ్ తుపానును 'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని కోరుతున్నాను.
  • తుపాను నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందాన్ని పంపండి.
  • జాతీయ విపత్తుగా ప్రకటిస్తే తక్షణ, మెరుగైన సాయం బాధితులకు అందుతుంది. మీ ప్రకటన ద్వారా తుపాను బాధితులలో విశ్వాసాన్ని నింపే అవకాశం ఏర్పడుతుంది.
Posted

TDP chief urges PM to declare Cyclone Michaung a national disaster 

10-12-2023 Sun 14:58 | Local | IANS
 
TDP chief urges PM to declare Cyclone Michaung a national disaster
Listen to the audio version of this article

Amaravati, Dec 10: Former Andhra Pradesh Chief Minister and TDP supremo, Nara Chandrababu Naidu, on Sunday appealed to the Centre to declare Cyclone Michaung that caused huge damage in the state as a national calamity.

In a letter addressed to Prime Minister Narendra Modi, Naidu said that the cyclone caused widespread devastation in the state claiming six lives and bringing the lives of several lakhs of people to a standstill in at least 15 districts. Preliminary assessment indicated extensive damage with crop loss in 22 lakh acres amounting to a staggering Rs 10,000 crore, Chandrababu mentioned in the letter.

Significant loss of cattle, livestock and trees also reported while the impact on infrastructure is alarming with almost 770 km long of roads damaged, said Chandrababu. Critical facilities like drinking water, irrigation and electricity suffered heavy impact, he said. Major sectors like agriculture and fishing suffered heavily, Chandrababu said and mentioned in the letter that four farmers have taken their lives due to crop loss. The fishing communities lost boats, nets and their means of livelihood.

"In light of these circumstances and recognising that the impact of the cyclone was not confined to Andhra Pradesh alone but has also affected neighbouring Tamil Nadu, I earnestly request the declaration of the Michaung cyclone as a national disaster," Chandrababu Naidu said in the letter to the Prime Minister. The TDP supremo also requested that the Government of India dispatch a team to assess and estimate the extent of the damage caused by the cyclone.

Naidu wrote that declaring a national disaster will provide the necessary impetus for both immediate relief efforts and the establishment of resilient long-term infrastructure. “Moreover, such a declaration will instill confidence among the victims, signalling a united front against the challenges posed by this calamity,” he added.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...