Jump to content

Nara Lokesh: మీ మామ డైలాగ్ గుర్తొస్తోంది అని జేసీ అన్నారు: నారా లోకేశ్


psycopk

Recommended Posts

Nara Lokesh: మీ మామ డైలాగ్ గుర్తొస్తోంది అని జేసీ అన్నారు: నారా లోకేశ్ 

11-02-2024 Sun 19:24 | Andhra
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శంఖారావం సభ
  • హాజరైన నారా లోకేశ్
  • కేసులకు భయపడవద్దని టీడీపీ శ్రేణులకు పిలుపు
  • ఏ తప్పు చేయని చంద్రబాబును 53 రోజులు జైల్లో బంధించారని ఆగ్రహం
  • జేసీ ప్రభాకర్ రెడ్డిపై 100 కేసులు పెట్టారని వెల్లడి 
 
Nara Lokesh reveals what JC said

లక్షలాది మంది నిత్యం ap7am.com ను సందర్శిస్తారు. మరి మీరు? 👍

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో ప్రసంగించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారని, తనపైనా 22 కేసులు పెట్టారని వెల్లడించారు. అయినా తాము తగ్గేదే లేదు అని పుష్ప స్టయిల్లో స్పష్టం చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబునాయుడిని 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో బంధించారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ముందు రూ.3 వేల కోట్ల కుంభకోణం అన్నారు... తర్వాత రూ.230 కోట్ల కుంభకోణం అన్నారు... ఇప్పుడు రూ.27 కోట్ల కుంభకోణం అంటున్నారు. వైసీపీ వాళ్లకు సవాల్ విసురుతున్నా... ఆరోపణలపై చర్చకు నేను సిద్ధం... మరి మీ జగన్ సిద్ధమా? మేం ఏనాడూ తప్పు చేయలేదు... నీతి నిజాయతీకి మారుపేరు తెలుగుదేశం పార్టీ. అందుకే మేం ఎక్కడా తగ్గలేదు. 

ఒక అవినీతిపరుడైన నేత జైలుకు వెళితే రోజుకొక కుంభకోణం బయటపడుతుంది... కానీ చంద్రబాబు జైలుకు వెళితే ఆయన చేసిన మంచిపనులు బయటికి వచ్చాయి. దాదాపు 100 దేశాల్లో ఆయనకు అనుకూలంగా ధర్నాలు చేశారు. మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబుకు ప్రజలు సంఘీభావం తెలిపారు" అంటూ  లోకేశ్ ప్రసంగించారు. 

అంతేకాదు, రాష్ట్రంలో ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడవద్దని టీడీపీ శ్రేణులకు లోకేశ్ సూచించారు. తనపైనా కేసులు ఉన్నాయని, అయితే రాష్ట్రంలో తనతో కేసుల విషయంలో పోటీ పడుతోంది ఎవరో తెలుసా? అంటూ సభికులను ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పలేకపోయేసరికి... జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ లోకేశ్ బదులిచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే... ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారని వెల్లడించారు. ఆయనపై కేసులు సెంచరీ దాటాయని వివరించారు. 

"ఓసారి జేసీని కలిసినప్పుడు ఏంటన్నా పరిస్థితి ఎలా ఉంది అని అడిగాను. అందుకాయన మీ మామ గారి డైలాగ్ గుర్తొస్తోంది అన్నారు. భయం అసలు మన బయోడేటాలోనే లేదు అని పలికారు. తెల్లకాగితం మీద సంతకం పెట్టి ఇచ్చాను... ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పానన్నారు. ఇప్పటికే ఓసారి జైలుకు వెళ్లాను... మళ్లీ వెళ్లడానికి నాకేం భయంలేదు అని జేసీ చెప్పారు. మనం అందిపుచ్చుకోవాల్సిన స్పిరిట్ అదే. ఇక పోరాడదామా!" అంటూ లోకేశ్ పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

Nara Lokesh: మోసం.. దగా.. కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్: నారా లోకేశ్ 

11-02-2024 Sun 13:33 | Andhra
  • ఎన్నికల ముందు 6 వేల పోస్టులతో డీఎస్సీ వేశారని ప్రభుత్వంపై మండిపాటు
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడి
  • శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్ర ప్రారంభించిన యువనేత
 
Nara Lokesh Speech At Shankaravam Sabha In Ichapuram

లక్షలాది మంది నిత్యం ap7am.com ను సందర్శిస్తారు. మరి మీరు? 👍

తెలుగుదేశం పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక గంజాయి క్యాపిటల్ గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. మోసం, దగా, కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్ లా ఉంటుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రను లోకేశ్ ఆదివారం ప్రారంభించారు.

అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని, అమ్మప్రేమకు ఎలా కండిషన్స్‌ ఉండవో.. ఇక్కడి ప్రజలు కూడా అంతేనని చెప్పారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని అన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది.. ఇలాంటి ప్రాంతంలో ‘శంఖారావం’ యాత్ర ప్రారంభిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక 23 వేల పోస్టులు కాస్తా 18 వేల పోస్టులయ్యాయని, ఆపై స్కూలు రేషనలైజేషన్ పేరుతో మరిన్ని పోస్టులు తగ్గించారని చెప్పారు. నాలుగున్నరేళ్లపాటు డీఎస్సీ ఊసే ఎత్తకుండా ప్రస్తుతం ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటన విడుదల చేశారని విమర్శించారు. అదికూడా కేవలం 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు.

జగన్ సిద్ధం సభపై లోకేశ్ విసుర్లు..
జగన్ సభను చూస్తే తనకు నవ్వొచ్చిందని నారా లోకేశ్ శంఖారావం సభలో చెప్పారు. ‘సిద్ధం.. సిద్ధం.. సిద్ధం.. అంటున్నారు దేనికయ్యా మీరు సిద్ధం? జైలుకు పోవడానికి సిద్ధమా..’ అని అడిగారు. జగన్ ను జైలుకు పంపించేందుకు మీరు సిద్ధమా అని సభకు వచ్చిన ప్రజలను లోకేశ్ అడిగారు. సొంత బాబాయినే లేపేశాడు.. ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేయడానికి సిద్ధమని జనం అడుగుతున్నారని లోకేశ్ విమర్శించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...