Jump to content

Ivala media meda dadi chestunaru.. repu bharathi sakshi sangati enti??


Recommended Posts

Posted

Bandaru Satyanarayana: సాక్షిలో పని చేసే వారికి రేపు ఎవరు భద్రత కల్పిస్తారు?: బండారు సత్యనారాయణ 

21-02-2024 Wed 15:00 | Andhra
  • ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడిని ఖండించిన బండారు
  • సాక్షి నుంచి ఉద్యోగులు బయటకు రావాలని సూచన
  • జగన్ విశాఖకు వస్తే కర్ఫ్యూ వంటి పరిస్థితి ఉండటం ఏమిటని ప్రశ్న
  • గుడివాడ అమర్ నాథ్ కు టికెట్ కూడా రాలేదని ఎద్దేవా
 
Who will save Sakshi tomorrow asks Bandaru Satyanarayana

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ, ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. రెండు నెలల తర్వాత తాము అధికారంలోకి వస్తామని... అప్పుడు సాక్షిలో పని చేస్తున్న సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. టీడీపీ - జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. రేపు సాక్షికి కూడా ఇదే గతి పడుతుందని చెప్పారు. అవినీతి సొమ్ముతో సాక్షిని స్థాపించారని... ఆ సంస్థ నుంచి ఉద్యోగులు బయటకు రావాలని సూచించారు. 

శారదాపీఠంకు వస్తే విశాఖలో ఇన్ని ఆంక్షలు పెట్టడం ఏమిటని బండారు ప్రశ్నించారు. ఈవెంట్ మేనేజర్ ను పెట్టి రోడ్డు మీద ప్రజలను ఎండలో నిలబెట్టారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు నుంచి శారదాపీఠం వరకు రోడ్డుపై ఉన్న టీడీపీ జెండాలను పోలీసులు పీకేశారని... కేవలం వైసీపీ జెండాలను మాత్రమే ఉంచారని విమర్శించారు. ముఖ్యమంత్రి వస్తే కర్ఫ్యూ వంటి పరిస్థితిని తీసుకొస్తున్నారని అన్నారు. టీవీ ఛానల్స్, పత్రికల ప్రతినిధులపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. గుడివాడ అమర్ నాథ్ కు టికెట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. 

Posted

Devineni Uma: ఓటమి భయంతో పత్రికలపై పగబట్టిన జగన్ దాడులకు ఉసిగొల్పుతున్నాడు: దేవినేని ఉమా 

21-02-2024 Wed 11:55 | Andhra
  • అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మీడియా ప్రతినిధులపై వైసీపీ దాడులు
  • అక్రమాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారన్న దేవినేని ఉమా
  • జీ హుజార్ అనకపోతే హత్యలకు కూడా వెనుకాడటం లేదని ఆగ్రహం
 
Jagan encouraging to attack on media personal says Devineni Uma

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మీడియా ప్రతినిధులపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ఓటమి భయంతో పత్రికలపై పగబట్టిన జగన్ రెడ్డి దాడులకు ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. అక్రమాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని.. పత్రికా యాజమాన్యాలపై రోత పత్రికలో విషపు రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. విలేకరులపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని... పత్రికా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని అన్నారు. జీ హుజూర్ అనకపోతే అధికార పార్టీ నేతలు హత్యలకు కూడా వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిరంకుశ వైఖరి ప్రజాస్వామ్యం మనుగడకే ప్రశ్నార్థకమని అన్నారు. 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...