Jump to content

Recommended Posts

Posted

Ramana Deekshitulu: రమణ దీక్షితులుపై వేటు.. టీటీడీ నుంచి తొలగించిన పాలకమండలి 

26-02-2024 Mon 13:31 | Both States
  • టీటీడీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి
  • ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రమణ దీక్షితులు వీడియో
  • తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అందులో ఆరోపణ
 
Ramana Deekshitulu Sacked From TTD for controversial remarks

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై పాలకమండలి వేటువేసింది. టీటీడీ నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సోమవారం టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేశారని చైర్మన్ చెప్పారు. రమణ దీక్షితులు వ్యాఖ్యలపై సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు. టీటీడీపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యల తీవ్రతపై చర్చించిన సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు. పాలకమండలి నిర్ణయం మేరకు దీక్షితులను టీటీడీ నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. 

తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమలలో క్రిస్టియానిటీ వేగంగా వ్యాప్తి చెందిందని, సీఎం జగన్ క్రిస్టియన్ కావడంతో ఆలయంలోనూ ఆ మతం వ్యాపిస్తోందని రమణ దీక్షితులు ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డి సహా ఆలయ సిబ్బందిలో చాలామంది క్రిస్టియన్లు ఉన్నారని విమర్శించారు. ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయకుండా ఖననం చేశారని విమర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ క్రమంలోనే రమణ దీక్షితులుపై తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.

Posted

Ramana Dikshitulu: తిరుమల కొండపై జరుగుతున్న దారుణాలను రమణ దీక్షితులు అందరికీ తెలిసేలా చేశారు: నారా లోకేశ్ 

26-02-2024 Mon 16:04 | Andhra
  • తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి రమణ దీక్షితులును తొలగించిన టీటీడీ  
  • తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న లోకేశ్
  • రమణ దీక్షితులుపై వేటు వేయడం బాధాకరమని వ్యాఖ్య
 
Ramana Dikshitulu made everyone aware of the atrocities happening on Tirumala says Nara Lokesh

రమణ దీక్షితులును తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి టీటీడీ పాలకమండలి తొలగించిన సంగతి తెలిసిందే. టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతినేలా రమణ దీక్షితులు కామెంట్ చేశారనే కారణంతో ఆయనను తొలగించారు. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందిస్తూ... తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినేలా వైసీపీ నేతల అకృత్యాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. 

టీటీడీలో జరుగుతున్న అకృత్యాలను బయటపెట్టిన రమణ దీక్షితులుపై వేటు వేయడం బాధాకరమని లోకేశ్ అన్నారు. జరుగుతున్న దారుణాలను భక్తులకు తెలిసేలా రమణ దీక్షితులు చేశారని చెప్పారు. తిరుమల కొండపై టీటీడీ అధికారులు, వైసీపీ నేతలు కలిసి దారుణాలకు ఒడిగడుతున్నారని దుయ్యబట్టారు. రమణ దీక్షితులును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం సీఎం జగన్ అహంకారానికి నిదర్శనమని చెప్పారు.

Posted

Why is TTD coming into the news every time we have elections? ee Ramana Deekshitulu ki PM post ichina complain chestadu. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...