Jump to content

Adigindi Revant.. ichindi center… budda lafangi gadu madhyalo comedy 🤣🤣


Recommended Posts

Posted

Telangana: 175 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసిన కేంద్రం.. తొలగిపోనున్న పలు సమస్యలు 

02-03-2024 Sat 14:38 | Telangana
  • ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు భూములు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రేవంత్
  • సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం
  • మోదీ, రాజ్ నాథ్ సింగ్ లకు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి
 
Center tranferred 175 acres land to TS govt

తెలంగాణ ప్రభుత్వానికి 175 ఎకరాల భూమిని కేంద్ర రక్షణ శాఖ బదిలీ చేసింది. ఈ భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ... భూముల బదిలీకి అనుకూలంగా అనుమతులను ఇచ్చింది. 

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కార్యాలయం స్పందిస్తూ... జనవరి 5న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తర్వాత... ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రక్షణ శాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రేవంత్ కోరగా... కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని అన్నారు. తమ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. 

మరోవైపు, ఈ భూములను తెలంగాణకు కేటాయించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారు. మోదీకి, రాజ్ నాథ్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల కామారెడ్డి మార్గం (ఎన్ హెచ్ 44), రాష్ట్ర రహదారి నెంబర్ 1లో సొరంగాల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్లు సులభతరం అవుతాయని చెప్పారు. దేశ ప్రజలకు మోదీ ఇస్తున్న హామీలకు ఇది మరో నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండంలను కలుపుతూ నిర్మించే రాజీవ్ రహదారి కోసం 11.3 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. ఇందులో కొంత భూమి రక్షణ శాఖ పరిధిలో ఉందని... కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని అన్నారు. 

 

Posted

KTR: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరఫున కేటీఆర్ కృతజ్ఞతలు 

02-03-2024 Sat 20:38 | Telangana
  • రక్షణ శాఖ భూముల్లో ఎలివేటర్ కారిడార్లకు అనుమతి ఇవ్వడంతో థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
  • ఎలివేటెడ్ కారిడార్లు బీఆర్ఎస్ పదేళ్ల కష్టానికి ఫలితమన బీఆర్ఎస్ నేత
  • కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి
 
KTR thanks to central government

కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఎలివేటెడ్ కారిడార్లు బీఆర్ఎస్ పదేళ్ల కష్టానికి ఫలితమన్నారు. రక్షణ శాఖ భూముల కోసం తాము అలుపెరగని పోరాటం చేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులకు పదుల సంఖ్యలో వినతులు ఇచ్చామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

  • Haha 2
Posted

G. Kishan Reddy: కేసీఆర్ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు... రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నాం: కిషన్ రెడ్డి 

02-03-2024 Sat 15:32 | Telangana
  • బీఆర్ఎస్ హయాంలో ప్రధాని వచ్చినప్పుడు స్వాగతం పలికే సంప్రదాయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శ
  • ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపిస్తామన్న కిషన్ రెడ్డి
  • మేడిగడ్డకు అందరికంటే ముందు వెళ్లింది బీజేపీయే అన్న కేంద్రమంత్రి
 
Kishan reddy hopes Revanth Reddy will welcomes pm modi in his telangana tour

ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భాల్లో స్వాగతం పలికే సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో తుంగలో తొక్కారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారని భావిస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని తెలిపారు. ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపిస్తామన్నారు.

రాష్ట్రానికి ప్రధాని వచ్చిన సందర్భంలో గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయమని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ అంశంపై మాట్లాడుతూ... అందరికంటే ముందుగా తామే అక్కడకు వెళ్లామని గుర్తు చేశారు. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సరైనదే అన్నారు.

Posted
4 minutes ago, sarfaroshi2 said:

@psycopk enti brother manam manam chuttalu ipoyama…. ?

TDP - BJP ?


official confirmation vachey  varaku Chuttaaley 😃😃

 

Posted

It's wholesome to see all parties caring for the state more than self. This is how politics should be, not like aatma gouravam sh!t

Posted
13 minutes ago, sarfaroshi2 said:

@psycopk enti brother manam manam chuttalu ipoyama…. ?

TDP - BJP ?

 

8 minutes ago, Raisins_72 said:


official confirmation vachey  varaku Chuttaaley 😃😃

 

Repu potu unna naa flow nade…

BJP: ఏపీలో ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించని బీజేపీ... అందుకేనా...? 

02-03-2024 Sat 20:55 | Andhra
  • ఎన్నికల సమరశంఖం మోగించిన బీజేపీ
  • 195 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితా
  • తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • ఏపీలో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్న బీజేపీ హైకమాండ్
  • టీడీపీ-జనసేన కూటమితో పొత్తు కుదిరే అవకాశం!
 
BJP yet to announce AP candidates for Lok Sabha elections

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాల పేర్లతో కూడిన లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ నేడు ప్రకటించింది. ఈ జాబితాలో 195 మందికి స్థానం కల్పించారు. 34 మంది కేంద్ర మంత్రులు మరోసారి టికెట్ దక్కించుకున్నారు. 

ఈ తొలి జాబితాలో వివిధ రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఏపీలో ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించలేదు. ఏపీలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొని ఉండడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. 

జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. అదే సమయంలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులోకి బీజేపీ వస్తుందా, రాదా? అనే అంశం ఇప్పటిదాకా అనిశ్చితి సృష్టించింది. ఇప్పుడు తొలి జాబితాలో ఏపీ అభ్యర్థులను ప్రకటించకపోవడం చూస్తుంటే... టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం ఖాయమనిపిస్తోంది. 

టీడీపీ, జనసేనలతో చర్చించి సీట్ల సర్దుబాటు చేసుకుని, ఆ తర్వాతే ఏపీ అభ్యర్థుల జాబితా ప్రకటించాలన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. 

ఇప్పటికే టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై ఓ ప్రకటన చేశాయి. పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉండగా, ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే... టీడీపీ ఎన్ని స్థానాలు  తీసుకుంటుంది? బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో, రెండో జాబితాలో జనసేనకు మరికొన్ని ఎంపీ స్థానాలు ఇస్తారా? అనే దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ పొత్తు కుదిరితే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

Posted

@psycopk. Revantam mi vaade kada .. pert ke teddy … ippudu ikkada nadichedi  mi valla domination … Anduke Nuvvu supporting revantam ani telusu .. e DB lo andariki 

Posted

Idi last 20 years nundi adugutunaru and KTR kuda bagane try chesindu….

Posted
31 minutes ago, Android_Halwa said:

Idi last 20 years nundi adugutunaru and KTR kuda bagane try chesindu….

Inky pinky ponky 

  • Haha 2
Posted
1 hour ago, kittaya said:

Inky pinky ponky 

CBN has a donkey

Posted
3 hours ago, sarfaroshi2 said:

@psycopk enti brother manam manam chuttalu ipoyama…. ?

TDP - BJP ?

Demo compulsion + election code 

Posted

that is the way you work woth Center

ask them and you show gratitude

ichinaka 10gi tini... em iyyaledu ante ne g mida tantaru

Posted

Ktr kcr has been asking center to transfer lands to them especially it’s a big problem in cantonment so many time military will close roads. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...