Jump to content

Recommended Posts

Posted

 

YS Jagan: దత్తపుత్రుడు కార్లు మార్చినట్టు భార్యలను మార్చుతాడు: సీఎం జగన్ 

07-03-2024 Thu 14:31 | Andhra
  • అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద చేయూత నిధుల విడుదల సభ
  • హాజరైన సీఎం జగన్
  • చంద్రబాబు పేరు చెబితే మోసాలు గుర్తొస్తాయని వెల్లడి
  • దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం అని వ్యాఖ్యలు 
 
CM Jagan comments on opposition leaders

నాలుగో విడత వైఎస్సార్ చేయూత నిధుల విడుదల కార్యక్రమం నేడు అనకాపల్లి జిల్లా పిసినికాడ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెబితే ఏం గుర్తొస్తుంది? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు గుర్తొస్తాయని విమర్శించారు. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది, చంద్రబాబు విశ్వసనీయత లేని వాడన్న విషయం గుర్తొస్తుంది అని అన్నారు. 

ఇక, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వివాహ వ్యవస్థకే మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఈ విలువలు పాటించని దత్తపుత్రుడు కార్లు మార్చినట్టు భార్యలను మార్చుతాడని వ్యంగ్యం ప్రదర్శించారు. 

చంద్రబాబు, దత్తపుత్రుడు ఇద్దరూ తమ ఫొటోలు, సంతకాలతో 2014లో విడుదల చేసిన మేనిఫెస్టో ఏమైంది... ఓసారి గుర్తుచేసుకుందామా? అని అన్నారు. వీళ్లను నమ్మిన అక్కచెల్లెమ్మలను నాడు నట్టేట ముంచారని, ఇప్పుడు మళ్లీ ఓ పథకానికి మహాశక్తి అంటూ అమ్మవారి పేరు పెట్టి తీసుకువస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. 

 

Posted

YS Sharmila: తల్లి వంటి ఏపీకి జగన్ వెన్నుపోటు పొడిచారు... ఆయన వైఎస్ వారసుడా?: షర్మిల 

07-03-2024 Thu 15:23 | Andhra
  • మంగళగిరిలో కాంగ్రెస్ సమావేశం
  • ప్రత్యేక హోదా అంశంపై కంటతడి పెట్టుకున్న షర్మిల
  • ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని విమర్శలు
  • రాహుల్ మాట వల్లే తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టీకరణ
 
Sharmila slams YS Jagan

మంగళగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్ వారసుడు అవుతాడా? అని ప్రశ్నించారు. 

ఇక, తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది వ్యక్తిగత కారణాలతో కాదని స్పష్టం చేశారు. అలాగైతే తాను 2019లోనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఉండేదాన్నని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ... ఆయన మాట వల్లే తాను ఏపీ రాజకీయాల్లో ప్రవేశించానని షర్మిల పేర్కొన్నారు. 

ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని షర్మిల వ్యాఖ్యానించారు. ఏపీకి మోదీ ఏం చేశారని, మోదీ అంటే తనకు గౌరవం అని పవన్ అంటున్నారు? అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు లేరు కాబట్టే తాను రాష్ట్ర ప్రజల కోసం వచ్చానని వివరించారు. 

ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి భవిష్యత్తు ఉంటుందని ఉద్ఘాటించారు. ఓవైపు బీజేపీ.... మరోవైపు అధికారపక్షం, విపక్షం ప్రత్యేక హోదా పేరిట ప్రజలను మోసం చేస్తుంటే బాధగా ఉందని షర్మిల కంటతడి పెట్టుకున్నారు.

Posted

Salaries kuda ivaledu kada ra daridruda

Sajjala Ramakrishna Reddy: ఆర్థిక ఒత్తిళ్లతో ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్నంత చేయలేకపోయాం: సజ్జల రామకృష్ణారెడ్డి 

07-03-2024 Thu 08:06 | Andhra
  • ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనే చేస్తోందన్న సజ్జల
  • ఉద్యోగులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన వైసీపీ అగ్రనేత
  • జులైలో పీఆర్సీ అమలు చేస్తామన్న మంత్రి బొత్స  
  • ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు
 
Due to financial pressures could not do as much as government employees wanted says Sajjala Ramakrishna Reddy

ఎన్‌జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పదవీ విరమణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్నంత చేయలేకపోయామని అన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనే చేస్తోందని చెప్పారు. మున్ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. 

జులైలో పీఆర్సీ అమలు చేస్తాం: మంత్రి బొత్స సత్యనారాయణ
ఉద్యోగులకు హామీగా ఇచ్చిన పీఆర్సీని జులైలో అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులకు మంత్రుల బృందం ఇచ్చిన ఇతర హామీలు అన్నింటినీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో బండి శ్రీనివాసరావు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. బండి శ్రీనివాసరావు దంపతులకు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, సంఘం నాయకులు సన్మానం చేశారు. 43 ఏళ్లపాటు ప్రభుత్వ సర్వీసులో ఉన్నానని బండి శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని ప్రస్తావించారు.

Posted

Babu sajjala? Govt ki eppudu pressures untunae untai.idoka pedha reason aaa.?

emi meet GIF

  • Haha 1
Posted
1 hour ago, mustang302 said:

Babu sajjala? Govt ki eppudu pressures untunae untai.idoka pedha reason aaa.?

emi meet GIF

Secretariat takatu petaru.. salraies ivaleru.. mee mohalaki avasarama ruling ani adagali

Posted
1 minute ago, psycopk said:

Secretariat takatu petaru.. salraies ivaleru.. mee mohalaki avasarama ruling ani adagali

“U come to my bathroom “antadu anna malli..avasarama ani evaru adagaru.

  • Haha 2
Posted
1 hour ago, mustang302 said:

Babu sajjala? Govt ki eppudu pressures untunae untai.idoka pedha reason aaa.?

emi meet GIF

Ycp Vallu emi sesina reason untadhi…

navvakandi-idhi.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...