Jump to content

Recommended Posts

Posted

Brother Anil: వైఎస్సార్, చంద్రబాబు పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు: బ్రదర్ అనిల్ 

10-03-2024 Sun 10:36 | Andhra
  • అమలాపురంలోని ఇందుపల్లిలో పాస్టర్ల సదస్సులో పాల్గొన్న బ్రదర్ అనిల్
  • రాష్ట్రం అంతకంతకూ అప్పులపాలవుతోందని ఆవేదన
  • రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని ధ్వజం
  • శత్రువులందరూ నశించిపోవాలన్న అనిల్
 
Bro Anil Husband Of YS Sharmila Criticise YS Jagan

వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని అంతర్జాతీయ సువార్తీకుడు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో నిన్న నిర్వహించిన పాస్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అంతకంతకూ అప్పుల పాలవుతోందని, రేపు పుట్టబోయే బిడ్డలపైనా అప్పులు భారం పడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. శత్రువులందరూ నశించిపోవాలని పేర్కొన్న ఆయన..రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అనిల్ పేర్కొన్నారు.

Posted

YS Sharmila: భారతీరెడ్డితో కలిసే నా భర్త అనిల్ సోనియాగాంధీ వద్దకు వెళ్లారు: వైఎస్ షర్మిల 

29-01-2024 Mon 14:57 | Andhra
  • అనునిత్యం ప్రజల్లో ఉండటం వైఎస్సార్ మార్క్ అన్న షర్మిల
  • కడపకు జగన్ చేసిందేమీ లేదని విమర్శ
  • షర్మిలను సీఎం కావాలనుందని తన భర్త చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
 
YS Sharmila comments on YS Bharathi

నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లడం వైఎస్సార్ వ్యక్తిత్వమని... అనునిత్యం ప్రజల్లో ఉండటం ఆయన మార్క్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇప్పుడున్న పాలకులు పెద్దపెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నాని విమర్శించారు. వైఎస్ బతికుంటే కడప ఎంతో అభివృద్ధి చెందేదని చెప్పారు. బీజేపీకి స్నేహితుడిగా ఉన్న జగన్... కడపకు చేసిందేమీ లేదని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేసిన జగన్... ప్లాంట్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. విభజన హామీల్లో కడప స్టీల్ ప్లాంట్ ఒకటని గుర్తు చేశారు.  కడప - బెంగళూరు రైల్వే లైన్ ను ఎందుకు సాధించలేకపోయారని దుయ్యబట్టారు. 

ఇదే సమయంలో తన వదిన వైఎస్ భారతి అంశాన్ని కూడా ఆమె తీసుకొచ్చారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా తన భర్త అనిల్ కుట్రలు చేశారనే ఆరోపణలపై మండిపడ్డారు. జగన్ ను బయటకు రానివ్వొద్దని, షర్మిలను సీఎం చేయాలని లాబీయింగ్ చేసినట్టు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

షర్మిలకు సీఎం కావాలనుందని, ప్రణబ్ ముఖర్జీతో, సోనియాతో తన భర్త చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారతీరెడ్డితో కలిసే సోనియాగాంధీ వద్దకు అనిల్ వెళ్లారని తెలిపారు. మరి సోనియాతో తన భర్త ఈ విషయం గురించి భారతీరెడ్డి ముందు మాట్లాడారా? లేక వెనుక మాట్లాడారా? అని ప్రశ్నించారు. తనకు పదవులే కావాలనుకుంటే తన తండ్రి సీఎం అయినప్పుడే తీసుకునేదాన్నని చెప్పారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...