Jump to content

Recommended Posts

Posted

YS Sharmila: గతంలో ప్రత్యేక హోదా డిమాండ్ తో ఎన్నికలకు వెళ్లిన జగన్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు: షర్మిల 

16-03-2024 Sat 19:16 | Andhra
  • విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరిట విశాఖలో కాంగ్రెస్ బహిరంగ సభ
  • హాజరైన పీసీసీ చీఫ్ షర్మిల
  • హోదాపై ఏనాడైనా మోదీని జగన్ నిలదీశారా అన్న షర్మిల 
  • విభజన హామీలు సాధించేవరకు విశ్రమించబోనని ప్రతిన 
 
Sharmila fires on CM Jagan

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో కాంగ్రెస్ పార్టీ నేడు విశాఖలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

ప్రత్యేక హోదా డిమాండ్ 2019 ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లిన జగన్, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ఏ నాయకుడు రాష్ట్రాన్ని పట్టించుకోలేదని, ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మోసం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై మోదీని ఏనాడైనా జగన్ గట్టిగా నిలదీశారా? అని షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్నను చంపినవారిని రక్షించాలని అడిగేందుకు మాత్రం ఢిల్లీ వెళుతున్నారని ఆరోపించారు. 

"నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయతీ ఉంది. నా పుట్టింట్లో అన్యాయం జరుగుతోంది కాబట్టి ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చేంతవరకు, పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంతరకు, విశాఖ ఉక్కును కాపాడుకునేంత వరకు, మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ్నించి కదలదు" అని షర్మిల ఉద్ఘాటించారు.

Posted

YS Sharmila: ఒకే వేదికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల 

16-03-2024 Sat 19:22 | Both States
  • 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' పేరుతో విశాఖలో కాంగ్రెస్ సభ
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
  • షర్మిలతో కలిసి కార్యకర్తలకు అభివాదం చేసిన రేవంత్ రెడ్డి
 
Revanth Reddy and Sharmil on one state

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఒకే వేదికపై కనిపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆనందాన్ని రెట్టింపు చేసింది. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' పేరుతో కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు ఏపీ నాయకులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సభకు రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సభావేదిక మీదికి వచ్చిన సమయంలో ఏపీ కాంగ్రెస్ కేడర్ కేరింతలు కొట్టింది. వేదిక మీదకు వచ్చిన రేవంత్ రెడ్డి... తనతో పాటు షర్మిల చేయిని కూడా పైకెత్తి సభకు వచ్చిన వారికి అభివాదం చేశారు.

Posted

pasunoori dayakar: కేసీఆర్‌కు షాక్... కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ దయాకర్ 

16-03-2024 Sat 19:03 | Telangana
  • శనివారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిన దయాకర్
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ
  • శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన పసునూరి దయాకర్
 
Pasunoori Dayakar joins congress

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ అధినేత కేసీఆర్‌కు షాకిచ్చారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పసునూరి దయాకర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. దానం నాగేందర్ కూడా నిన్న సీఎంను కలిశారు. అరగంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...