Jump to content

RRR simple question to kukka sai


Recommended Posts

Posted
2 hours ago, psycopk said:

 

Yetakaram mundu putti, aa tarvata eedu puttintaadu. 

Posted
15 minutes ago, psycopk said:

enti mana paytm batch mugaboinda... rrr debaki

Emaindi Anna .. 

Ante e lekkana Mi pulkas baga esukubtunnaud , Miku Gu… kalindi ante baga vesukuntybnadu mimmalani

Posted
5 minutes ago, JaiBalayyaaa said:

Yetakaram mundu putti, aa tarvata eedu puttintaadu. 

raise chesina point valid ee kada.. it exposes lot of dark secrets of ycp government

Posted
7 minutes ago, jaathiratnalu2 said:

Emaindi Anna .. 

Ante e lekkana Mi pulkas baga esukubtunnaud , Miku Gu… kalindi ante baga vesukuntybnadu mimmalani

nee speech ila undi..

 

Posted

Raghu Rama Krishna Raju: 2022 అక్టోబర్ 31న ఆ ట్వీట్ ఎందుకు చేశారో విజయసాయిరెడ్డి చెప్పాలి: రఘురామకృష్ణరాజు 

23-03-2024 Sat 10:04 | Andhra
  • విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయన్న రఘురాజు
  • 2022లో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తికి విజయసాయి శుభాకాంక్షలు తెలిపారని వెల్లడి
  • జగన్, విజయసాయిలకు బ్రిజిల్ లో వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయని ఆరోపణ
  • టన్నుల్లో డగ్ర్ దిగుమతి చేసుకున్న వీరిని ఏం చేయాలని ప్రశ్న
  • జగన్ మళ్లీ కోలుకోని విధంగా కూటమిని గెలిపించుకుందాని పిలుపు 
 
Vijayasai Reddy has to give explanation on why he tweeted wishing Brazil President demands Raghu Rama Krishna Raju

విశాఖ పోర్టులో 25 వేల కిలోల మత్తు పదార్థాలు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చినట్టు తేలిందని ఆయన చెప్పారు. 2022 అక్టోబర్ 31న బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని అభినందిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని... సీఎం జగన్, విజయసాయిరెడ్డిలకు బ్రెజిల్ లో వ్యాపార కార్యకలాపాలు లేకపోతే శుభాకాంక్షలు ఎందుకు తెలుపుతారని ప్రశ్నించారు. బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరో ఇక్కడి నాయకుల్లో ఒక్క శాతం మంది చెప్పినా తాను ముక్కున వేలు వేసుకుంటానని... అలాంటిది బ్రెజిల్ అధ్యక్షుడి గురించి విజయసాయి ఎందుకు ట్వీట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

బ్రెజిల్ లో కార్యకలాపాలు నడుపుతున్నారు కాబట్టే... బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరో విజయసాయికి తెలుసని రఘురాజు అన్నారు. డ్రగ్స్ కంటెయినర్ దొరుకుతుందని అప్పుడు వారు అంచనా వేసి ఉండరని... అందుకే తొందరపాటులో ట్వీట్ చేసి తప్పులో కాలు వేశారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ ప్రభుత్వ పెద్దలతోనే సాధ్యమవుతుందని చెప్పారు. మలేషియా, సింగపూర్ దేశాల్లో ఒక్క గ్రాము మాదకద్రవ్యం దొరికినా ఉరిశిక్ష విధిస్తారని... అలాంటిది టన్నుల్లో డ్రగ్స్ దిగుమతి చేసుకున్న వీరిని ఏం చేయాలని ప్రశ్నించారు. 

డ్రగ్స్ దిగుమతి అయిన కంపెనీ పురందేశ్వరి బంధువులదని సాక్షిలో రాయండం దారుణమని చెప్పారు. అప్పట్లో నారాసుర రక్తచరిత్ర అని రాసినట్టుగానే ఇప్పుడు పురందేశ్వరిని అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేనలకు కేటాయించిన పార్లమెంటు స్థానాల్లో నరసాపురం లేదని... ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్టు దీంతో అర్థమవుతోందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా నరసాపురం నుంచి తాను కూటమి తరపునే పోటీ చేస్తానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన తనను ఏదోలా ఇబ్బంది పెట్టాలని జగన్ కనుసన్నల్లో పని చేసే నాయకులు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ మళ్లీ కోలుకోని విధంగా కూటమిని గెలిపించుకుందామని చెప్పారు.

Posted

Oka sametha vuntadi….Ayya ki gathi leka barre ni…ani

RRR ke dikku ledu…pulkeyulu RRR gari analysis ni follow ayitunaru ante Abba Abba…entha karuvu la vunnaru ra ayya…

Lokesham ae oka dynamic leader ayi vunte isonti kastalu vachi vundeva ?

Posted

Somireddy Chandra Mohan Reddy: బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం విజయసాయికి ఏమొచ్చింది?: సోమిరెడ్డి 

23-03-2024 Sat 20:18 | Andhra
  • విశాఖలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
  • బ్రెజిల్ నుంచి ఏపీ తీరానికి 25 వేల కిలోల డ్రగ్స్
  • రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న సోమిరెడ్డి
  • దీని వెనుక జగన్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణలు
 
Somireddy slams Vijayasai Reddy on Visakha drugs issue

విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. బ్రెజిల్ దేశం నుంచి విశాఖ తీరానికి డ్రగ్స్ రవాణా జరగడం పట్ల సోమిరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నిలదీశారు. 

గతంలో బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వా ఎన్నికల్లో గెలిచినప్పుడు, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను తాజాగా సోమిరెడ్డి ప్రస్తావించారు. 

"అనధికారిక డ్రగ్ సరఫరాలో ప్రపంచాన్ని నాశనం చేస్తున్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. అలాంటి దేశాధ్యక్షునితో విజయసాయిరెడ్డికి ఏం పని? బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నికైనపుడు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు అదే దేశం నుండి 25 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ వచ్చిందంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది?" అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 

డ్రగ్స్ ఫ్రీ దేశం కోసం ప్రజలంతా తాపత్రయపడుతుంటే... జగన్ రెడ్డి ఏపీని డ్రగ్ క్యాపిటల్ చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. 

"ఈ డ్రగ్స్ వ్యవహారం మొత్తం వెనుక జగన్ రెడ్డి ఉన్నారు. సీబీఐ అధికారుల్ని రాష్ట్ర పోలీసులు నిలువరించడం వెనుక ముఖ్యమంత్రి హస్తం తప్పకుండా ఉంది. నెల్లూరు జిల్లా వాసినని చెప్పుకునే విజయసాయిరెడ్డి 2016 నుండి ఎంపీగా ఉండి జిల్లాకు ఏం చేశాడో సమాధానం చెప్పాలి.  నెల్లూరు జిల్లాలో పుట్టిన నులిపురుగు విజయసాయిరెడ్డి. వేల కోట్ల ప్రజల సొమ్ము దిగమింగి 16 నెలలు చిప్పకూడు తిన్న విజయసాయిరెడ్డి నీతులు చెప్పడం హాస్యాస్పదం. నెల్లూరులో ఒక్క సీటు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు. 

మంత్రి రోజా ఇప్పటి వరకు తన శాఖకు సంబంధించి ఒక్కసారి కూడా రివ్యూ పెట్టింది లేదు. శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలియదు. కానీ, నోరేసుకుని పడిపోవడంలో మాత్రం ముందున్నారు.

జగన్ రెడ్డి హీరో కాదు జీరో అని మరో 40 రోజుల్లో ప్రజలు నిరూపించబోతున్నారు. కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ తో సమాజాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సన్నాసుల్ని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు ప్రజలంతా ఫిక్స్ అయిపోయారు" అని సోమిరెడ్డి వివరించారు.

Posted

YS Sharmila: డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా?: విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై షర్మిల వ్యాఖ్యలు 

23-03-2024 Sat 20:02 | Andhra
  • విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
  • పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న టీడీపీ, వైసీపీ
  • నిఘా వ్యవస్థకు తెలియకుండా డ్రగ్స్ ఎలా వచ్చాయన్న షర్మిల
  • సీబీఐ నిగ్గు తేల్చాలని, కేంద్రం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని డిమాండ్
 
Sharmila comments on Visakha drugs issue

బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ లో విశాఖ పోర్టుకు చేరిన 25 వేల కిలోల డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్ వెనుక ఉన్నది మీరంటే మీరని టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 

విశాఖలో చిక్కిన డ్రగ్స్ పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. నిఘా వ్యవస్థకు తెలియకుండా వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వస్తాయని ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? అని షర్మిల నిలదీశారు. 

విశాఖ డ్రగ్స్ ఘటనలో నిజం నిగ్గు తేల్చాలని సీబీఐని కోరుతున్నామని, సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నం పెట్టే అన్నపూర్ణ అని, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి డ్రగ్స్ రాజధానిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఏది కావాలన్నా ఏపీనే చిరునామాగా మారిందని పేర్కొన్నారు. 

దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని అన్నారు. డ్రగ్స్ రవాణా, వినియోగంలో ఏపీకి నెంబర్ వన్ ముద్ర వేశారని షర్మిల విచారం వ్యక్తం చేశారు.

"మొదటి ఐదేళ్లు టీడీపీ, ఆ తర్వాత ఐదేళ్లు వైసీపీ... ఈ పదేళ్లలో ఏపీని డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. 25 వేల కిలోల మాదకద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే... మా తప్పేమీ లేదంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపీ, వైసీపీ, బీజేపీ వారికి సిగ్గుండాలి. కేంద్ర, రాష్ట్ర నిఘా వ్యవస్థల సపోర్ట్ లేకుండా వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా తీరానికి చేరతాయి? ఇది ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...