Jump to content

Recommended Posts

Posted

Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

01-04-2024 Mon 11:58 | Andhra
  • జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్
  • కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐకీ సుప్రీం ప్రశ్న
  • విచారణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
 
Hearing in Supreme Court on Jagan bail cancellation petition

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘరామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన మరో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించింది. 

విచారణ సందర్భంగా... అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా విచారణ ఆలస్యం అవుతోందని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఎం, రాజకీయ నేత అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. జగన్ బెయిల్ రద్దు, కేసుల విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్లను కలిపే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఆగస్ట్ 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.

Posted

Why move from tg to different state? Its congi revantham in power who is known to be against jagga.

Posted

CJI Chandrachud: సీబీఐ సహా దర్యాఫ్తు సంస్థలపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

01-04-2024 Mon 21:22 | National
  • దర్యాఫ్తు సంస్థలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై మాత్రమే దృష్టి సారించాలన్న చంద్రచూడ్
  • సీబీఐపై కేసుల భారం రోజురోజుకూ పెరుగుతోందన్న సీజేఐ
  • సీబీఐ అసలు ఉద్దేశ్యం నెరవేరడం లేదని వ్యాఖ్య
  • జాతీయ భద్రత, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచన
premier probe agencies should focus only on issues of national importance cji dy chandrachud

సీబీఐ వంటి దర్యాఫ్తు సంస్థలపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ రైజింగ్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని ప్రధాన దర్యాఫ్తు సంస్థలు జాతీయ భద్రత, దేశ వ్యతిరేక నేరాలకు సంబంధించిన కేసులపై మాత్రమే దృష్టి సారించాలన్నారు. కానీ అవి ఇతర నేరాలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు వదిలి కొసరుపై దృష్టి పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. సీబీఐపై కేసుల భారం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. సీబీఐ అసలు ఉద్దేశ్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాఫ్తు సంస్థలు సెర్చ్, సీజ్ చేసే అధికారాలు, గోప్యతా హక్కుల మధ్య సున్నితమైన సమతౌల్యతను కలిగి ఉండాలన్నారు.

పెరుగుతున్న సాంకేతికతతో పాటు పెరుగుతున్న నేరాలు సీబీఐ వంటి విచారణ ఏజెన్సీలకు సవాళ్లుగా మారాయన్నారు. లెక్కకు మించి క్రిమినల్ కేసులతో సీబీఐపై భారం పెరుగుతోందన్నారు. 'జాతీయ భద్రత, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులపై మాత్రమే దృష్టి పెట్టాల'ని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇందులో ఎక్కువమంది డిప్యుటేషన్‌లో ఉన్న అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. కేసుల విషయంలో విచారణ సంస్థలు సొంతంగా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

విచారణ ప్రక్రియను డిజిటలైజ్ చేయాలని, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నుంచే ఇది ప్రారంభమవుతుందన్నారు. అధిక కేసుల కారణంగా విచారణ సంస్థలపై ఒత్తిడి పెరుగుతున్నందున.. కేసుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవడం చాలా కీలకమని పేర్కొన్నారు. నిర్మాణాత్మక సంస్కరణలను విచారణ సంస్థలు అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలన్నారు.

Posted

Raghu Rama Krishna Raju: నాకు ఏ పార్టీ మద్దతు లేదు... మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది: రఘురామ

01-04-2024 Mon 22:05 | Andhra
  • రఘురామకు నో టికెట్
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రఘురామ
  • ఏ పార్టీలో సభ్యుడ్ని కాకపోవడం వల్లే మద్దతు ఇవ్వడంలేదేమోనని వ్యాఖ్యలు
Raghu Rama Krishna Raju disappoints with alliance

ఎన్నికల్లో తనకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడం పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విచారం వ్యక్తం చేశారు. తాను చేస్తున్నది ఒంటరిపోరాటం అని, న్యాయానికి ఎప్పుడూ బలం ఉంటుందని అన్నారు. 

నాకు ఏ పార్టీ మద్దతు లేదు... మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది... ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడ్ని కాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో సభ్యుడ్ని కాకపోవడం వల్లే మద్దతు ఇవ్వడంలేదని అంటున్నారని రఘురామ పేర్కొన్నారు. తన పోరాటం రాష్ట్ర ప్రజల కోసం అని, చంద్రబాబు వంటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతో, ఉబలాటంతో పోరాటం చేశానని అన్నారు. 

"నా గొప్పల కోసం నేను పోరాటం చేయలేదు. ఐదేళ్ల పాటు నా పదవిని హాయిగా అనుభవించవచ్చు... ఎవరైనా పదవి అనుభవించాలనే చూస్తారు. ఇటీవల కొందరు టీడీపీలో చేరారు, కొందరు బీజేపీలో చేరారు. వారు పోరాటాలు చేయడం తర్వాత... వారిలో ఎవరైనా, ఏనాడైనా పెదవి విప్పి ఒక్క మాట అడిగిన వాళ్లు ఉన్నారా? అలాంటి ఒక్కరిని చూపించినా నేను ఇక ఈ కూటమిని సీటు అడగను. ఈ పది రోజుల్లో ఆయా పార్టీల్లో చేరిన వారిలో ఏ ఒక్కరైనా... మూడు నెలల ముందు జగన్ ను ఈ విధంగా ప్రశ్నించారు అని చెబితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను. 

బీజేపీ కావొచ్చు, జనసేన కావొచ్చు, టీడీపీ కావొచ్చు...  ఈ కూటమిలో ఎంతోమందికి సీట్లు ఇచ్చారు. నేను చేసిన పోరాటమే నాకు శాపంగా మారిందా? నేను రాజకీయ స్వార్థం లేని వాడ్ని. స్వార్థపరుడ్నే అయివుంటే నేను కూడా పార్టీ పెట్టేవాడ్నేమో. శ్రామికుడు అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మనసా వాచా కర్మణా కోరుకున్నాను" అని రఘురామ వివరించారు.

Posted

Supreme Court dagga manchi comedy undi... Case late avutundi ane hearing ra ante.... Inko 5 months  August 5th ki postpone chesindi...tenor.gif?itemid=8412189

Posted

Comedy kakapothey already chargesheet file chesi, case hearing la vunte ipudu vachi bail cancel anta…

Jaggadu as an under trail spent 16 months in Jail, ide adiki lifeline. 
 

Papam Raju garu…next bail hearing vache varaku RRR ki MP lrivelages paaye…Modi close, Nadda close ani sepukunte evadu namamdu, Mere peeche CBN hain ani chepundam ante bandaram bayata padindi…

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...