Jump to content

Recommended Posts

Posted

Nara Lokesh: అధికారంలోకి రాగానే ఉద్యోగుల‌కు బ‌కాయిల‌ను విడ‌త‌ల వారీగా చెల్లిస్తాం: నారా లోకేశ్‌ 

06-04-2024 Sat 15:44 | Andhra
  • సీఎం జ‌గ‌న్ ఆఫ్రికాను ఆద‌ర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని న‌ట్టేట ముంచారన్న టీడీపీ నేత‌
  • వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జీతాలు ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌క ఉద్యోగులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని మండిపాటు
  • మంగ‌ళ‌గిరిని అభివృద్ధి చేయాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌న్న లోకేశ్‌ 
 
Nara Lokesh Criticizes CM Jagana

శ‌నివారం తాడేప‌ల్లిలో ప‌ర్య‌టించిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అక్క‌డి పూజిత అపార్టుమెంట్ వాసుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ ఆఫ్రికాను ఆద‌ర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని న‌ట్టేట ముంచార‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ-జ‌న‌సేన కూట‌మి అధికారంలోకి రాగానే ఉద్యోగుల‌కు బ‌కాయిల‌ను విడ‌త‌ల వారీగా చెల్లిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 

త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు ఉద్యోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాలేద‌ని, నెలాఖ‌రునే జీతాలు చెల్లించార‌ని గుర్తు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జీతాలు ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌క ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. మంగ‌ళ‌గిరిని అభివృద్ధి చేయాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. 2019లో ఎక్క‌డైతే అభివృద్ధి ఆగిపోయిందో.. తిరిగి అక్క‌డి నుంచి ప్రారంభిస్తామ‌ని లోకేశ్‌ చెప్పుకొచ్చారు. 

Posted

Nara Lokesh: నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది సీఎం జగన్ యవ్వారం: నారా లోకేశ్ 

06-04-2024 Sat 14:51 | Andhra
  • నందికొట్కూరులో ముస్లిం మహిళ పట్ల అసభ్యప్రవర్తన
  • వైసీపీ నేతపై మీడియాలో కథనం
  • ఘాటుగా స్పందించిన నారా లోకేశ్ 
 
Nara Lokesh slams CM Jagan again

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఓ ముస్లిం మహిళ పట్ల వైసీపీ నేత ఒకరు అసభ్యంగా ప్రవర్తించినట్టు మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. నా... నా... అంటూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై వరుస దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది సీఎం జగన్ గారి యవ్వారం అంటూ లోకేశ్ విమర్శించారు. 

"నా ఎస్సీలు,  నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ  జగన్ బహిరంగ సభల్లో ప్రేమ కురిపిస్తుంటే... క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ మూకలు ప్రతి రోజూ ఆయా వర్గాలపై దాడులకు తెగబడుతూ, అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. 

పెండ్లిమర్రులో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు శ్రీనివాసులు అనే బీసీ యువకుడ్ని హత్య చేసి 24 గంటలు కూడా గడవకముందే... తాజాగా నందికొట్కూరు పట్టణంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డి నమాజ్ కు వెళ్లివస్తున్న ముస్లిం మహిళను బురఖా తొలగించి తీవ్రంగా అవమానించాడు. అదేమని ప్రశ్నించిన ఆమె భర్త, కుమారుడిపై శ్రీనివాసరెడ్డి చెప్పుతో దాడికి తెగబడ్డాడు.

అధికారమదంతో విర్రవీగుతున్న జగన్ అండ్ కో కు మరో 37 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కలిసి ఘోరీ కట్టడం ఖాయం" అని నారా లోకేశ్ హెచ్చరించారు.

Posted

Eedu evadu seppanika ? After all oka MLA…

sepithe CBN chepali…lekapothey PL or BJP chepali…kani poll promises ivadaniki eedu evadu vayya ?

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...