Jump to content

Recommended Posts

Posted

Gone Prakash Rao: ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు 

08-04-2024 Mon 12:18 | Andhra
  • కూటమికి 130 నుంచి 145 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయన్న గోనె
  • 19 నుంచి 21 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని అంచనా
  • పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో గెలుపొందుతారని జోస్యం
 
Gone Prakash Rao predicts TDP led Kutami win in AP

ఏపీలో లోక్ సభ, శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచార పర్వంలో తలమునకలై ఉన్నారు. మరోసారి తమదే విజయమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా అంతే ధీమాను వ్యక్తపరుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఏపీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని గోనె ప్రకాశరావు జోస్యం చెప్పారు. బీజేపీతో పొత్తు వల్ల కొంచెం నష్టం ఉన్నప్పటికీ... కూటమిదే గెలుపని ఆయన అన్నారు. కూటమికి 130 నుంచి 145 ఎమ్మెల్యే స్థానాలు... 19 నుంచి 21 లోక్ సభ స్థానాలు వస్తాయని అంచనా వేశారు. 

పిఠాపురంలో జనసేన అధినేత 50 నుంచి 60 వేల భారీ మెజార్టీతో గెలుపొందుతారని గోనె చెప్పారు. చివరి నిమిషంలో పవన్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎంపీగా గెలుపొందితే పవన్ కేంద్రంలో కేబినెట్ మినిస్టర్ అవుతారని చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసం పవన్ తన సొంత పార్టీ టికెట్లను కూడా త్యాగం చేస్తున్నారని తెలిపారు. జగన్ మరోసారి సీఎం అయితే ఏపీలో అరాచకత్వం పెరుగుతుందని... అందుకే జగన్ ప్రభుత్వం పోవాలని పవన్ త్యాగం చేస్తున్నారని అన్నారు.

Posted

Gone Prakash Rao: స‌న్ స్ట్రోక్ చూశాం.. కానీ జ‌గ‌న్‌కు వైఫ్ స్ట్రోక్ ఉంది: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు 

08-04-2024 Mon 14:28 | Andhra
  • మూడు రాజ‌ధానుల‌ నిర్ణ‌యాన్ని అతిపెద్ద త‌ప్పుగా అభివ‌ర్ణించిన‌ గోనె 
  • ఐదేళ్ల‌లో ఏదైనా కేసులో జ‌గ‌న్‌ జైలుకు వెళ్తే.. భార్య భార‌తి సీఎం అయ్యేలా ప్లాన్ చేశారంటూ ఆరోప‌ణ‌
  • భార్య కోసం జ‌గ‌న్‌ సొంత బంధాల‌ను తెంచేశాడ‌ని ప్ర‌కాశ్ రావు ఫైర్ 
  • సీఎం హోదాలో జ‌గ‌న్‌ పూర్తిగా మ‌ద్యం వ్యాపారిలా మారిపోయాడ‌న్న కాంగ్రెస్ నేత‌   
 
Congress Ex MLA Gone Prakash Rao Criticizes CM Jagan

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజ‌ధానులు అనే నిర్ణ‌యం అతిపెద్ద త‌ప్పు అని అన్నారు. జైల్లో ఉన్న‌ప్పుడు ఆదుకున్న త‌ల్లి, చెల్లిని అవ‌స‌రం తీరాక జ‌గ‌న్ గెంటేశాడ‌ని ఆరోపించారు. ఐదేళ్ల‌లో ఏదైనా కేసులో జైలుకు వెళ్తే ఆయ‌న భార్య భార‌తి ముఖ్య‌మంత్రి అయ్యేలా ప్లాన్ చేశార‌న్నారు. 

భార్య కోసం జ‌గ‌న్‌ సొంత బంధాల‌ను తెంచేశాడ‌ని ప్ర‌కాశ్ రావు ఫైర్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్ స్ట్రోక్ చూశాం.. కానీ జ‌గ‌న్‌కు వైఫ్ స్ట్రోక్ ఉంద‌న్నారు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టానుసారంగా ప‌రిపాల‌న కొన‌సాగింద‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఆయ‌న పూర్తిగా మ‌ద్యం వ్యాపారిలా మారిపోయాడ‌ని ప్ర‌కాశ్ రావు విమర్శించారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నాసిర‌కం మ‌ద్యం తాగి 3,000 మంది ప్రాణాలు కోల్పోయార‌ని మండిప‌డ్డారు. ఐదేళ్ల‌పాటు యువ‌త‌కు ఉద్యోగం, ఉపాధి లేకుండా చేశాడ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు జోస్యం చెప్పారు.

Posted

Gone Prakash Rao Sharmila tho tiriginattunnadu kadha TG lo. No surprise. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...