Jump to content

Recommended Posts

Posted

Jogi Ramesh: జోగి రమేశ్ కు షాకిచ్చిన సొంత బామ్మర్దులు, బంధువులు 

19-04-2024 Fri 15:11 | Andhra
  • జోగి రమేశ్ ఇంటి ముందు వేదిక ఏర్పాటు చేసి టీడీపీలో చేరిక
  • ముగ్గురు బామ్మర్దులు, 40 మంది బంధువులు చేరిక
  • వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరికలు
 
Jogi Ramesh reletives joins TDP

ఏపీలో అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. తాజాగా మంత్రి జోగి రమేశ్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. సాక్షాత్తు సొంత బామ్మర్దులు, బంధువులు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ ఉదయం జోగి రమేశ్ బామ్మర్దులు పామర్తి దుర్గాప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావు టీడీపీలో చేరారు. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు జోగి రమేశ్ కు చెందిన 40 మంది బంధువర్గం టీడీపీలో చేరింది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ ఇంటి ముందు సభా వేదికను ఏర్పాటు చేసి మరీ వీళ్లంతా టీడీపీలో చేరారు. ఈ చేరికలపై జోగి రమేశ్ ఇంకా స్పందించాల్సి ఉంది.

Posted

Duvvada Vani: నా భర్తపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: టెక్కలి వైసీపీ అభ్యర్థి భార్య 

19-04-2024 Fri 06:31 | Andhra
  • టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి సంచలన ప్రకటన
  • స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 22న నామినేషన్ వేస్తానని కార్యకర్తలతో అన్న వాణి
  • శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న దువ్వాడ శ్రీనివాస్
 
Tekkali YCP MLA candidate Duvvada Srinivas wife Vani to contest in elections as independent

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి సంచలన ప్రకటన చేశారు. టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని జడ్పీటీసీ సభ్యురాలైన వాణి తన అనుచరుల వద్ద ప్రకటించారు. గురువారం ఆమె జన్మదినం కావడంతో కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నట్టు వారితో చెప్పారు. మరోవైపు, దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్టు సమాచారం.

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వాణిని టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా వైసీపీ నియమించింది. అయితే, శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచీ ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ముఖ్యనాయకులు ఆమెను నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారని సమాచారం.

Posted

Last ki Husband n wife madyalo kuda Chucchhulu petitioners kada vayya e politics ki

Fact is : They fooling the public 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...