psycopk Posted April 27 Report Share Posted April 27 YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ 27-04-2024 Sat 15:24 | Andhra మీ పాలనలో బడుడు వర్గాల జీవన ప్రమాణాలు అధ్వానం అంటూ విమర్శలు రాజ్యాంగ హక్కులకు దిక్కులేని పరిస్థితి ఎదురవుతోందని వెల్లడి సబ్ ప్లాన్ ను మంటగలిపారని వ్యాఖ్యలు ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు సీఎం జగన్ కు లేఖ రాశారు. మీ పాలనలో బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు అధ్వానం అంటూ విమర్శించారు. రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి అని పేర్కొన్నారు. నిధులు దారి మళ్లించి, బడ్జెట్ పరంగా సబ్ ప్లాన్ ను మంటగలిపారని మండిపడ్డారు. మీరు అధికారంలోకి వచ్చేంతవరకు కొనసాగిన 28 పథకాలను, మీరు అధికారంలోకి రాగానే నిర్లక్ష్యంగా నిలిపివేశారని షర్మిల ఆరోపించారు. దళితులపై దాడులు, దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్టే ఉన్నారని, దాడులు నివారించి దళితులను కాపాడే నిర్దిష్ట చర్యలు లేవని సీఎం జగన్ ను విమర్శించారు. దాడులు చేసేవారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లేనని, ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయాలకు వారిని క్షమాపణ కోరండి అని డిమాండ్ చేశారు. ఇకపై ఏ వివక్ష లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి... బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా కాంగ్రెస్ తరఫున ఇదే మా డిమాండ్ అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 27 Author Report Share Posted April 27 YS Sharmila: టూరిజం మంత్రి ఎవరు... రోజా అట కదా!: అరకులో షర్మిల వ్యాఖ్యలు 27-04-2024 Sat 17:27 | Andhra అరకులో కాంగ్రెస్ న్యాయ యాత్ర ఆదివాసీల కోసం వైఎస్సార్ ఎన్నో పనులు చేశారన్న షర్మిల ఇప్పుడు వారిని పట్టించుకునే వారే లేరని ఆరోపణ రోజా మాత్రం జబర్దస్త్ గా ఉన్నారని వ్యంగ్యం ఏపీ న్యాయ యాత్రలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు 19వ రోజు ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అరకులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ, నాడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదివాసీల అభివృద్ధికి ఎన్నో పనులు చేపట్టారని, కార్పొరేషన్ లోన్లు ఇచ్చారని, స్వయం ఉపాధి కల్పించారని, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఉండేవని వివరించారు. కానీ ఇప్పుడు ఆదివాసీల గురించి పట్టించుకునే నాయకుడే లేడని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు జగన్ ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, వీళ్లిద్దరి పాలనలో అరకులో ఏం కొంచెమైనా అభివృద్ధి జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. "జగన్ రూ.600 కోట్లలో టూరిజం డెవలప్ మెంట్ చేస్తానన్నారట కదా! రూ.600 కోట్లలో ఒక కోటి అయినా వచ్చిందా? టూరిజం డెవలప్ మెంట్ మినిస్టర్ ఎవరు?... రోజా అట కదా...! జబర్దస్త్ రోజా... ఆమె మాత్రం జబర్దస్త్ గా ఉండాలి... అరకు ఏమైనా ఫర్వాలేదు... ఆమె ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదట కదా! ఒక్క రూపాయి ఇచ్చిందీ లేదట... మరి ఎందుకన్నా వీళ్లకు ఓటేయాలి? అరకులో పర్యాటకం అభివృద్ధి జరిగుంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి, ఎన్ని అవకాశాలు ఏర్పడేవి! బీజేపీ వాళ్లు ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ తెస్తాం అన్నారు... తెచ్చారా? ఇక్కడ మెడికల్ కాలేజీ అన్నారు... అదీ రాలేదు, ఇంజినీరింగ్ కాలేజీ కూడా రాలేదు... ఏ ఒక్కటీ రాలేదు" అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 27 Author Report Share Posted April 27 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted April 27 Report Share Posted April 27 1 minute ago, psycopk said: Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 27 Author Report Share Posted April 27 https://www.instagram.com/reel/C6Q8f-dJ_ow/?igsh=MXg0NHlnaDQyM25vZQ== Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.