Jump to content

Party musukunatava ani saval cheste .. tuppas format lo fake rajenama chesindi kaka .. ee edvaa over action avasarama lafangi


Recommended Posts

Posted

 

KCR: హరీశ్ రావు సవాల్‌కు రేవంత్ రెడ్డి తోక ముడిచారు: కేసీఆర్ 

29-04-2024 Mon 22:13 | Telangana
  • ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్డు షో 
  • బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ చూసినా వరికోతలు కనిపిస్తే ఇప్పుడు కరెంట్ కోతలు ఉన్నాయన్న కేసీఆర్
  • చాయ్ హోటల్ వద్ద ఆగి... స్థానికుల సమస్యలు విన్న కేసీఆర్
 
KCR blames revanth reddy over harish rao challenge

హరీశ్ రావు రాజీనామా లేఖతో వచ్చి సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోకముడిచారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి మన గోదావరి నీళ్లను తరలించుకుపోయే కుట్ర చేస్తుంటే ముఖ్యమంత్రి నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం పట్టణంలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఆశ ఎక్కువ అని, నా రాష్ట్రం... నా జిల్లా బాగుండాలని ఆరాటపడుతుంటారన్నారు. ఇంత ఎండను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారన్నారు.

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఎక్కడ చూసినా వరికోతలు కనిపించేవని... ఇప్పుడు కరెంట్ కోతలు కనిపిస్తున్నాయని విమర్శించారు. మన పాలనలో ఓ దశలో తెలంగాణలో పంటలు పంజాబ్‌ను తలదన్నేస్థాయికి పోయాయని... ఆ సమయంలో కేంద్రం మన వడ్లను కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ వారికి తెలంగాణ ఓట్లు కావాలి కానీ వారికి రైతు సమస్యలు పట్టవని ఆరోపించారు.

చాయ్ హోటల్ వద్ద ఆగిన కేసీఆర్

కేసీఆర్ ఖమ్మం రోడ్డు షోకు వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో ఎల్లంపేట స్టేజ్ తండా వద్ద చిన్న హోటల్ వద్ద ఆగారు. అక్కడున్న వారు కేసీఆర్‌కు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. స్థానిక యువత కేసీఆర్‌తో సెల్ఫీలు దిగింది. 

 

Posted

Power lo unnapduu toka tesi… ipudu ou vallani malli leputnava nee milage kosam lafangi yedva

Revanth Reddy: ఓయు విద్యార్థిని వీడియోను ట్వీట్ చేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేసీఆర్ 

29-04-2024 Mon 17:12 | Telangana
  • విద్యుత్, తాగు, సాగునీటిపై సీఎం, ఉపముఖ్యమంత్రి నాలుగు నెలలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
  • యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగు, సాగునీటి కొరతకు నిదర్శనమని వెల్లడి
  • తెలంగాణలో విద్యుత్, తాగు, సాగునీటి ఎద్దడి ఉన్నమాట వాస్తవమన్న కేసీఆర్
 
KCR questions CM Revanth Reddy with OU student video

తెలంగాణలో విద్యుత్ కోత, తాగునీరు కొరత, సాగునీటి ఎద్దడి వున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నీటి సమస్య ఉందని చెబుతున్న వీడియోను బీఆర్ఎస్ అధినేత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 

రాష్ట్రంలో విద్యుత్, తాగు, సాగునీటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత నాలుగు నెలలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగు, సాగునీటి కొరతకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్, తాగు, సాగునీటి ఎద్దడి ఉన్నమాట వాస్తవమని తెలిపారు.

కేసీఆర్ ట్వీట్ చేసిన వీడియోలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థినులు నీటి కోసం ఆందోళన చేస్తున్నారు. ఓ విద్యార్థిని మాట్లాడుతూ 'తాగడానికి కూడా నీళ్లు లేవు. అమ్మాయిలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మినిమం తాగడానికి లేదా వాడటానికి నీళ్లు అవసరం. ఇంతమంది అమ్మాయిలకు ఒక ట్యాంకర్ పంపించారు ఇప్పుడు. దానిని ఏం చేసుకోవాలి. పూజ చేసుకోవాలా? ఆ వాటర్ని చూసి మురిసిపోవాలా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Posted

Revanth Reddy: కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు దిక్కుమాలిన ప్రచారం: పాత నోటీసును ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి 

30-04-2024 Tue 14:17 | Telangana
  • కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ఎద్దేవా
  • మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్‌లో, ఈరోజు ఓయూ విషయంలో తప్పుడు ప్రచారమని ఆగ్రహం
  • 2023 మే నెలలోనూ విద్యుత్, నీటి కొరత గురించి ప్రస్తావించారని పేర్కొన్న రేవంత్ రెడ్డి
 
CM Revanth Reddy tweets about OU closing

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉస్మానియా యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిక్కుమాలిన దివాలాకోరు ప్రచారం చేస్తున్నారని, ఇది ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి సమస్య కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై కేసీఆర్ నిన్న ట్వీట్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోత, తాగు, సాగునీటి కొరత ఉందనడానికి యూనివర్సిటీలోని నీటి సమస్యనే కారణమని పేర్కొన్నారు.

కేసీఆర్ ట్వీట్‌పై సీఎం రేవంత్ రెడ్డి అదే ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. 'కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని... మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్‌లో, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు కూడా అలాంటి నోటీసునే జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గత ఏడాది యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు సెలవులు జారీ చేస్తూ ఇచ్చిన నోటీసును అటాచ్ చేశారు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...