Jump to content

Recommended Posts

Posted

Narendra Modi: వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి: ప్రధాని మోదీ 

06-05-2024 Mon 17:58 | Andhra
  • రాజమండ్రి సభలో ప్రధాని మోదీ ప్రసంగం
  • తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
  • మే 13 తర్వాత ఏపీ అభివృద్ధి యాత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వెల్లడి
  • చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు తీసిందన్న ప్రధాని
  • వైసీపీ హయాంలో అభివృద్ధిని పట్టాలు తప్పించారని విమర్శలు
 
PM Modi slams YCP govt

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాజమండ్రి రూరల్ వేమగిరిలో కూటమి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. 

నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు, గోదావరి నదీ తల్లికి ప్రణామం చేస్తున్నాను అని తెలిపారు. ఆదికవి నన్నయ నడయాడిన నేల ఇది... ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గడ్డ నుంచి కొత్త చరిత్ర ప్రారంభం కానుందని నాకు స్పష్టంగా తెలుస్తోందని మోదీ వివరించారు. 

"మే 13న మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యం. దాంతోపాటే ఏపీ అసెంబ్లీలో రానున్న ఐదేళ్లు ఎన్డీయే ప్రభుత్వం ఉండబోతోంది. నేను ఇవాళ ఒడిశా నుంచి వచ్చాను... అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో ఎక్కడెక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో, ప్రతి చోటా ఎన్డీయే ప్రభుత్వమే రాబోతోంది. 

ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, మరొకటి వైసీపీ. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించారు. ఏపీలో ఉన్న ప్రజానీకం వైసీపీని పూర్తిగా తిరస్కరించింది. ఏపీలో వైసీపీకి ఐదేళ్లు అవకాశం లభించింది. కానీ ఈ ఐదేళ్లలో వారు పూర్తిగా వృథా చేశారు. ఏపీ అభివృద్థిని తిరోగమనంలో తీసుకెళ్లారు. 

గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లింది. అన్నింట్లోనూ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ అభివృద్ధి బండిని పట్టాలు తప్పించింది. ఈ ప్రభుత్వం ప్రజల మేలు కోసం పనిచేయడానికి బదులు, రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. అందుకే ఇవాళ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధిని సాధించడానికి ఉన్న ఏకైక గ్యారెంటీ ఎన్డీయే. 

ఏపీలో యువత ప్రతిభావంతమైనది. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏపీ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధిని ఆశించడం పూర్తిగా వృథా. ఏపీలో అభివృద్ధి జీరో... అవినీతి మాత్రం 100 శాతం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆలస్యం చేశారు. అందుకే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలని చెబుతున్నాం. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండాలి. 

ప్రజలు కాంగ్రెస్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. పదేళ్లకు ముందు కాంగ్రెస్ దేశాన్ని ఏ విధంగా అధోగతి పాల్జేసిందో అందరూ గమనించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్కాముల గురించి తప్ప మరొక చర్చ ఉండేది కాదు. కాంగ్రెస్ నేతలు, ఈ ఇండియా కూటమి నేతలు ప్రతి రోజూ ఈడీపై గగ్గోలు పెడుతుంటారు. ఎందుకు వాళ్లు అంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారో అందరికీ తెలుసు. 

ఝార్ఖండ్ లో ఈడీ ఒక డబ్బు కట్టల కొండను వెలికితీసింది. మంత్రి కార్యదర్శి ఇంట్లో కట్టలుకట్టలుగా డబ్బు బయటపడింది. కాంగ్రెస్ నేతలు వారి ఇళ్లలో నల్ల డబ్బును దాచేందుకు గోడౌన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో దొరికిన డబ్బు కట్లను లెక్కబెట్టలేక మెషీన్లు కూడా అలసిపోతున్నాయి. ఇలా జరగడం మొదటిసారి కాదు. 

ఎందుకు కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే ఇలా డబ్బులు పట్టుబడుతున్నాయి? వీటిని దేనికి ఉపయోగించడానికి దాచిపెడుతున్నారో? మేం ఈ డబ్బును పట్టుకుంటే నాకు శాపనార్థాలు పెడుతుంటారు... మోదీ ఇలాంటి తిట్లకు భయపడే వ్యక్తి కాదు. ఇలాంటివాటిని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. 

ఏపీలో వైసీపీ ప్రతికూలతను దూరం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ఇతర పార్టీలు బీజేపీ, ఎన్డీయే కూటమితో జతకట్టి రావాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలుచేస్తామని అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరుపుతోంది, అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ  మద్యానికి సంబంధించి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది. ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియాలు నడుస్తున్నాయి. 

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడింది. ప్రజలారా... మీకు గుర్తుండే ఉంటుంది... వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పింది. మరి ఇన్నేళ్లలో ఒక్క రాజధాని అయినా కట్టారా? మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేసే ప్రయత్నంలో ఉండగా, ఈ ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. 

వీళ్లు అవినీతిని మాత్రమే చేయగలరు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియనే తెలియదు. ప్రజలకు సేవ చేయాలన్న కోరిక లేని ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. 

పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి బ్రేక్ వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. నేడు ఏపీ రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. రైతులకు మద్దతు ధర లభించడంలేదు. జూన్ 4 తర్వాత ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక, ఇటువంటి సమస్యలన్నీ దూరం చేస్తుంది. 

వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది వికసిత భారత్ అనే స్వప్నంలో భాగం. గత పదేళ్లలో ఏపీలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఎన్టీఆర్... రాముడు, తదితర అనేక పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారు" అంటూ మోదీ వివరించారు.

Posted

 

Narendra Modi: వైసీపీ ప్రభుత్వ పనితీరుకు ఇదే పెద్ద ఉదాహరణ: అనకాపల్లిలో ప్రధాని మోదీ 

06-05-2024 Mon 18:35 | Andhra
  • అనకాపల్లిలో ప్రజాగళం సభ
  • హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు
  • నూకాలమ్మ తల్లికి ప్రణామాలు అర్పించిన ప్రధాని మోదీ
  • అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభం
  • వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రధాని
 
Modi speech in Anakapalle

అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ, స్థానిక నూకాలమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటున్నట్టు పేర్కొన్నారు. 

తాను సాయంత్రం 5.45 గంటలకు  వెళ్లిపోవాల్సి ఉందని, అందుకే ముందుగా ప్రసంగిస్తున్నాని, తాను వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రజలు సభలో ఉండాలని, చంద్రబాబు ప్రసంగం వినాలని సూచించారు. 

"అనకాపల్లి బెల్లం, తెలుగు భాష రెండు కూడా మధురమైనవి, అద్భుతమైనవి. జూన్ 4న ఈ తియ్యదనం మరింత పెరగబోతోంది, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎన్డీయే గెలవబోతోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే గెలవడం వల్ల డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది. తద్వారా అభివృద్ధి కొత్త ఎత్తులకు చేరుతుంది.

భారత్ ఇవాళ ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. చందమామ దక్షిణ భాగాన జెండా రెపరెపలాడించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఏపీ నుంచి అనేకమంది ప్రవాసులు  విదేశాల్లో నివసిస్తున్నారు. భారత్ సాధించిన ఘనతతో ఇప్పుడు వారందరూ భారతీయులుగా ఎంతో గుర్తింపు పొందుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ, వైసీపీ రెండూ ఒకటే. కర్ణాటకలో ట్యాంకర్, భూ మాఫియా ప్రభుత్వం నడుస్తోంది... ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలకు రక్షణ కల్పిస్తాం. 

ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది... కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడంలేదు. పైగా కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగనివ్వలేదు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం అందుకు అవసరమైన భూమిని కూడా ఇవ్వలేదు. కేంద్రం భారీగా ఇళ్లు కేటాయించినా, ఈ ప్రభుత్వం నిర్మించలేదు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వ పనితీరుకు పెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్టును నాడు జగన్ రెడ్డి తండ్రి ప్రారంభించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న జగన్, ఈ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు. 

ఎన్డీయే మంత్రం అభివృద్ధి... అభివృద్ధి... అభివృద్ధి. వైసీపీ మంత్రం అవినీతి... అవినీతి... అవినీతి! ఈ రోజున ఏపీలో అనేక పంచదార పరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. 

మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశాం. విశాఖలో ఐఐఎం స్థాపించాం, ఈ ప్రాంతానికి పెట్రోలియం యూనివర్సిటీని తీసుకువచ్చాం, పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ పార్క్ కు ఆమోదం లభించింది. 

నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రారంభించేందుకు రూ.1000 కోట్ల సాయం అందించాం. దీనివల్ల పెట్టుబడులు వస్తాయి, ఫార్మారంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. ఏపీలో అదే పరిస్థితి నెలకొని ఉంది. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి" అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 

 

Posted

Nara Lokesh: మోదీ గారూ... మా స్వీట్స్ రుచి చూడండి: నారా లోకేశ్ 

06-05-2024 Mon 16:43 | Andhra
  • రాజమండ్రి వద్ద కూటమి సభ
  • హాజరైన ప్రధాని మోదీ, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, పురందేశ్వరి
  • ఇవాళ  యావత్ ప్రపంచం భారత్ వైపు, మోదీ వైపు చూస్తోందన్న లోకేశ్
  • ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా మోదీ రుచిచూడాలన్న యువనేత
 
Nara Lokesh asks Modi to taste AP special sweets

రాజమండ్రి కూటమి సభలో టీడీపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. విశ్వ జీత్ (విశ్వ విజేత) నరేంద్ర మోదీకి హృదయపూర్వక నమస్కారాలు అంటూ లోకేశ్ ప్రసంగం ప్రారంభించారు. ఆయనను విశ్వ జీత్ అని ఎందుకంటున్నానంటే... ఇవాళ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం మోదీనే అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మనసు చాలా పెద్దదని, మీ మమకారం, మీ వెటకారం రెండూ సూపర్ అని కొనియాడారు. నరేంద్ర మోదీ గారికి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలని అన్నారు. 

"దేశానికి నరేంద్ర మోదీ గారి అవసరం ఎంతో ఉంది. నాలుగు అక్షరాలు దేశం దశ  దిశ మార్చాయి. అది నమో నమో నమో (NaMo). తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అయితే, ఇవాళ భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. మోదీ భారతదేశానికి గర్వకారణం... మోదీ నవభారత నిర్మాత. 

మోదీ ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి. అందుకే ఆయన ప్రజల సమస్యలు అర్థం చేసుకోగలుగుతున్నారు. మన దేశానికి ఏం కావాలో మోదీకి తెలుసు... పేదరికం లేని దేశం మోదీ కల. 

ఒక వ్యక్తికి చేపలు ఇస్తే అది ఒక రోజు కడుపు నింపుతుంది... కానీ ఆ వ్యక్తికి చేపలు పట్టడం ఎలాగో నేర్పిస్తే అతడికి జీవితాంతం కడుపు నింపుతుంది అనే ఒక సామెత ఉంది. మోదీ తొలి రోజు నుంచే దేశ ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు అవసరమైన కార్యక్రమాలను తీసుకువచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని రెండింటినీ సమతుల్యం చేసి భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దారు. 

ఉజ్వల్ యోజన, జల్ జీవన్ మిషన్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మలిచేందుకు మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, భారత్ మాలా వంటి అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారు. 

వికసిత్ భారత్ మోదీ కల... వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, పవనన్న కల. 2014లో రాష్ట్ర విభజన జరిగింది... ఏది ఎక్కడుందో వెతుక్కునేందుకు ఆర్నెల్లు పట్టింది. కానీ చంద్రబాబుకు ఉన్న అనుభవం, విజన్ తో లోటు బడ్జెట్ ను అధిగమించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకున్నాం. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించుకున్నాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం. 

విశాఖను ఒక ఐటీ హబ్ గా, రాయలసీమను ఎలక్ట్రానిక్, ఆటోమోటివ్ హబ్ గా చేశాం. ఉభయ గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా మలిచాం. పోలవరం పనులు పరిగెత్తించాం. మోదీ సహకారంతో ఐఐఎం, ఐఐటీ, ఐసర్, ఎయిమ్స్ వంటి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగాం. చంద్రబాబు అనునిత్యం యువత గురించి ఆలోచిస్తారు. యువతకు మెరుగైన అవశాలు ఇస్తే కుటుంబాలు బాగుపడతాయని భావించారు.

కానీ, 2019లో ఒక్క చాన్స్ అనే నినాదానికి ప్రజలు మోసపోయారు. యావత్ ప్రపంచం మోదీ వైపు, భారత్ వైపు చూస్తుంటే... మన ముఖ్యమంత్రి గారు దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నారు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువత. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలను తరిమేశారు. 

మోదీ విశాఖకు రైల్వే జోన్ ఇస్తే, ఆ జోన్ కు అవసరమైన భూమిని ఈ ప్రభుత్వం కేటాయించలేదు. నా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి ఈ ప్రభుత్వం నీరు కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు మాట తప్పం, మడమ తిప్పం అన్నారు... ఇప్పుడు మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే అచ్చం మన ముఖ్యమంత్రిలాగానే ఉంటుంది. ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే ప్రజాగళం ఏర్పడింది. పొత్తు దిశగా మొదటి అడుగు వేసింది మన పవనన్న. సంక్షేమం-అభివృద్ధి జోడెద్దుల బండి... దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళతాం" అని నారా లోకేశ్ వివరించారు.

Posted

Pawan Kalyan: ఏపీ ప్రజల తరఫున మోదీకి చేతులెత్తి నమస్కరిస్తున్నా: పవన్ కల్యాణ్ 

06-05-2024 Mon 17:10 | Andhra
  • రాజమండ్రి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం
  • ప్రధాని మోదీని వేనోళ్ల కొనియాడిన జనసేనాని
  • ప్రధాని గొంతెత్తితే ప్రతి పౌరుడి అణువణువు కదిలిపోతుందనివ్యాఖ్యలు
  • ప్రధాని ఎంతో పెద్దమనసుతో కూటమికి ఆశీస్సులు తెలిపారని వెల్లడి
 
Pawan Kalyan speech in Vemagiri rally

రాజమండ్రి వద్ద వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని వేనోళ్ల కీర్తించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. 

భారతదేశానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం కూడా కావాలి... శత్రుదేశాల మీద పోరాడగలిగే శక్తి, శత్రుసేనలు ముందుకొస్తే  నిలువరించగలిగే శక్తి, కశ్మీర్ మనది కాదు అంటే, కాదు ఇది మనది అంటూ ఆర్టికల్ 370 రద్దు చేసిన బలమైన శక్తి... మన ప్రియతమ నాయకుడు మోదీ అని అభివర్ణించారు. ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేసిన నేత మోదీ అని కీర్తించారు. 

"శేషేంద్ర కవిత చదివినప్పుడల్లా నాకు మోదీ గారు గుర్తొస్తారు. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు, పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు, తుపాను గొంతు చిత్తం మరణం ఎరుగదు, నేను ఇంతా కలిపి పిడికెడు మట్టి కావొచ్చు... కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వన్నెల జెండాకు ఉన్నంత పొగరుంది. ప్రధాని గొంతెత్తితే ప్రతి పౌరుడి అణువణువు కదిలిపోతుంది.

కేవలం సంక్షేమమే కాకుండా, అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు ఇవన్నీ అందిస్తున్న వ్యక్తి మన ప్రధాని మోదీ. కానీ కేంద్రం అందిస్తున్న ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పథకాలుగా చేసుకుంటోంది. కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటూ కూడా ఈ ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయడంలేదు. 

ప్రధాని మోదీ పాలనలో దేశమంతా అమృత ఘడియలు నడుస్తుంటే, ఏపీలో మాత్రం జగన్ పాలనలో విషపు ఘడియలు నడుస్తున్నాయి. ఏపీలో ఎటు చూసినా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఎటు చూసినా స్కాములు... ఇవన్నీ ఆగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ఏపీని నడిపిస్తే తప్ప దీన్ని ముందుకు తీసుకెళ్లలేం. అందుకే ఆయన ఆశీస్సులు కోరుకున్నాం. 

మేం ఎలాంటి స్వార్థానికి పోకుండా, వికసిత భారత్ కలలో ఐదు కోట్ల ఏపీ ప్రజలందరం కూడా మీ వెంట నడుస్తాం అని ఒక్క మాట అన్నందుకు, ఎంతో పెద్ద మనసుతో ప్రధాని మోదీ ఈ కూటమికి ఆశీస్సులు తెలిపారు. అందుకే ఏపీ ప్రజల తరఫున చేతులెత్తి మోదీ గారికి నమస్కరిస్తున్నాను. 

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కళాకారులకు విలువ పెరిగింది. మోదీ పద్మ అవార్డులకు గౌరవం తీసుకువచ్చి నిజమైన మేధావులు, కళాకారులకు అవార్డులు వచ్చేలా చేశారు. తద్వారా ఆ అవార్డులకు గౌరవం తీసుకొచ్చారు. 

ఈసారి 400 ఎంపీ సీట్లు సాధించాలన్నది మోదీ లక్ష్యం. అందుకు మా వంతుగా ఏపీ నుంచి పార్లమెంటు సభ్యులనే కాదు, మోదీ కల కోసం మా ప్రాణాలను కూడా అర్పిస్తాం" అంటూ పవన్ ప్రసంగించారు.

Posted

Daggubati Purandeswari: మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి కలయిక అపూర్వం: పురందేశ్వరి 

06-05-2024 Mon 16:01 | Andhra
  • రాజమండ్రి వద్ద వేమగిరిలో కూటమి సభ
  • హాజరైన ప్రధాని మోదీ, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, నారా లోకేశ్
  • పేదలకు న్యాయం చేయాలనేదే మూడు పార్టీల సిద్ధాంతం అని పురందేశ్వరి వెల్లడి
 
Purandeswari speech in Rajahmundry rally

రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పురందేశ్వరి ప్రసంగిస్తూ... రాజమండ్రి అనేక చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిందని అన్నారు. ఇవాళ మరో ఘట్టానికి సాక్షిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఒక ప్రజా కంటకుడైన పాలకుడిని గద్దె దించడానికి ఇవాళ మూడు పార్టీల కలయిక చారిత్రక అవవసరంగా మారిందని పురందేశ్వరి స్పష్టం చేశారు. 

ఈ మూడు  పార్టీల కలయికలో మనకు స్పష్టంగా కనిపించేది నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కల్యాణ్ శక్తి అని వివరించారు. గత ఐదేళ్లుగా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, అందుకే మూడు పార్టీలు కలిసి ముందుకు వచ్చాయని అన్నారు. 

'సబ్ కే సాత్ సబ్ కా వికాస్' అనేది బీజేపీ నినాదం అని, సమాజంలో అందరూ సర్వతోముఖాభివృద్ధి  సాధించాలనేది బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఇక టీడీపీ ఆలోచనా విధానం విషయానికొస్తే... సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అనేది ఆ పార్టీ నినాదం అని వెల్లడించారు. సమాజంలోని పేదలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేది టీడీపీ ఆలోచన అని వివరించారు. 

జనసేన పార్టీని చూస్తే... సమాజంలో ఎవరైనా అన్యాయానికి గురైనట్లయితే వారి తరఫున నిలబడి ప్రశ్నిస్తాను అని సోదరుడు పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని పురందేశ్వరి పేర్కొన్నారు. కనుక ఈ మూడు పార్టీలు ఒకే విధమైన ఆలోచనా విధానంతో ముందుకు వెళుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు ప్రజలు అనుభవించిన కష్టాలను దూరం చేస్తూ, ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఈ కలయిక దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారని పురందేశ్వరి స్పష్టం చేశారు. 

ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని, విసిగి వేసారిపోయిన వారందరూ కూటమిని ఆశీర్వదించాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్న వాతావరణాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నామని అన్నారు. 

సుపరిపాలన కావాలని, అవినీతిరహిత పాలన కావాలని, మన బిడ్డలకు, మహిళలకు, యువతకు, అన్ని వర్గాల వారికి న్యాయం చేసే పరిపాలన మన రాష్ట్రం చూడాలని కోరుకుంటే అందరూ కూటమిని ఆశీర్వదించాలి అని పురందేశ్వరి పిలుపునిచ్చారు.

Posted
19 minutes ago, psycopk said:

 

Narendra Modi: వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి: ప్రధాని మోదీ 

06-05-2024 Mon 17:58 | Andhra
  • రాజమండ్రి సభలో ప్రధాని మోదీ ప్రసంగం
  • తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
  • మే 13 తర్వాత ఏపీ అభివృద్ధి యాత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వెల్లడి
  • చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు తీసిందన్న ప్రధాని
  • వైసీపీ హయాంలో అభివృద్ధిని పట్టాలు తప్పించారని విమర్శలు
 
PM Modi slams YCP govt

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాజమండ్రి రూరల్ వేమగిరిలో కూటమి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. 

నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు, గోదావరి నదీ తల్లికి ప్రణామం చేస్తున్నాను అని తెలిపారు. ఆదికవి నన్నయ నడయాడిన నేల ఇది... ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గడ్డ నుంచి కొత్త చరిత్ర ప్రారంభం కానుందని నాకు స్పష్టంగా తెలుస్తోందని మోదీ వివరించారు. 

"మే 13న మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యం. దాంతోపాటే ఏపీ అసెంబ్లీలో రానున్న ఐదేళ్లు ఎన్డీయే ప్రభుత్వం ఉండబోతోంది. నేను ఇవాళ ఒడిశా నుంచి వచ్చాను... అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో ఎక్కడెక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో, ప్రతి చోటా ఎన్డీయే ప్రభుత్వమే రాబోతోంది. 

ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, మరొకటి వైసీపీ. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించారు. ఏపీలో ఉన్న ప్రజానీకం వైసీపీని పూర్తిగా తిరస్కరించింది. ఏపీలో వైసీపీకి ఐదేళ్లు అవకాశం లభించింది. కానీ ఈ ఐదేళ్లలో వారు పూర్తిగా వృథా చేశారు. ఏపీ అభివృద్థిని తిరోగమనంలో తీసుకెళ్లారు. 

గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లింది. అన్నింట్లోనూ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ అభివృద్ధి బండిని పట్టాలు తప్పించింది. ఈ ప్రభుత్వం ప్రజల మేలు కోసం పనిచేయడానికి బదులు, రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. అందుకే ఇవాళ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధిని సాధించడానికి ఉన్న ఏకైక గ్యారెంటీ ఎన్డీయే. 

ఏపీలో యువత ప్రతిభావంతమైనది. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏపీ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధిని ఆశించడం పూర్తిగా వృథా. ఏపీలో అభివృద్ధి జీరో... అవినీతి మాత్రం 100 శాతం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆలస్యం చేశారు. అందుకే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలని చెబుతున్నాం. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండాలి. 

ప్రజలు కాంగ్రెస్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. పదేళ్లకు ముందు కాంగ్రెస్ దేశాన్ని ఏ విధంగా అధోగతి పాల్జేసిందో అందరూ గమనించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్కాముల గురించి తప్ప మరొక చర్చ ఉండేది కాదు. కాంగ్రెస్ నేతలు, ఈ ఇండియా కూటమి నేతలు ప్రతి రోజూ ఈడీపై గగ్గోలు పెడుతుంటారు. ఎందుకు వాళ్లు అంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారో అందరికీ తెలుసు. 

ఝార్ఖండ్ లో ఈడీ ఒక డబ్బు కట్టల కొండను వెలికితీసింది. మంత్రి కార్యదర్శి ఇంట్లో కట్టలుకట్టలుగా డబ్బు బయటపడింది. కాంగ్రెస్ నేతలు వారి ఇళ్లలో నల్ల డబ్బును దాచేందుకు గోడౌన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో దొరికిన డబ్బు కట్లను లెక్కబెట్టలేక మెషీన్లు కూడా అలసిపోతున్నాయి. ఇలా జరగడం మొదటిసారి కాదు. 

ఎందుకు కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే ఇలా డబ్బులు పట్టుబడుతున్నాయి? వీటిని దేనికి ఉపయోగించడానికి దాచిపెడుతున్నారో? మేం ఈ డబ్బును పట్టుకుంటే నాకు శాపనార్థాలు పెడుతుంటారు... మోదీ ఇలాంటి తిట్లకు భయపడే వ్యక్తి కాదు. ఇలాంటివాటిని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. 

ఏపీలో వైసీపీ ప్రతికూలతను దూరం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ఇతర పార్టీలు బీజేపీ, ఎన్డీయే కూటమితో జతకట్టి రావాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలుచేస్తామని అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరుపుతోంది, అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ  మద్యానికి సంబంధించి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది. ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియాలు నడుస్తున్నాయి. 

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడింది. ప్రజలారా... మీకు గుర్తుండే ఉంటుంది... వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పింది. మరి ఇన్నేళ్లలో ఒక్క రాజధాని అయినా కట్టారా? మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేసే ప్రయత్నంలో ఉండగా, ఈ ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. 

వీళ్లు అవినీతిని మాత్రమే చేయగలరు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియనే తెలియదు. ప్రజలకు సేవ చేయాలన్న కోరిక లేని ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. 

పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి బ్రేక్ వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. నేడు ఏపీ రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. రైతులకు మద్దతు ధర లభించడంలేదు. జూన్ 4 తర్వాత ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక, ఇటువంటి సమస్యలన్నీ దూరం చేస్తుంది. 

వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది వికసిత భారత్ అనే స్వప్నంలో భాగం. గత పదేళ్లలో ఏపీలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఎన్టీఆర్... రాముడు, తదితర అనేక పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారు" అంటూ మోదీ వివరించారు.

Video shorts post chey thata

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...