Jump to content

YSRCP will form government once again in AP, say Jagan


Recommended Posts

Posted
YSRCP will form government once again in AP, say Jagan

Chief Minister YS Jagan Mohan Reddy confidently announced on Thursday that the YSRCP would form the government in Andhra Pradesh once again after the completion of vote counting on June 4.

During an interaction with members of the I-PAC team at their office in Benz Circle, Vijayawada, he recalled how no one believed the YSRCP would win 151 Assembly seats in the 2019 elections and asserted that this time, the party would surpass that number.

He also expressed confidence that the party would secure 22 MP seats.

“We are going to break our 2019 record, and the whole country will be watching AP during the election results on June 4,” he stated.

He attributed the anticipated success to the able administration provided by the YSRCP government and the sustained efforts of the I-PAC team over the past 18 months, which have helped the party create a record during the elections.

“Your (I-PAC team) services cannot be measured,” he said, receiving loud applause from the team members.

He interacted with the team in a similar manner after the completion of the 2019 elections.

Posted

Ambati Rambabu: జగన్ అన్నదే విజయం: అంబటి రాంబాబు 

16-05-2024 Thu 11:48 | Andhra
  • కూటమిలో నాలుగో పార్ట్ నర్ గా పోలీసులు చేరారన్న అంబటి
  • పోలీసులు చేరి ఫైట్ చేసినా జగన్ దే విజయమని వ్యాఖ్య
  • పోలింగ్ రోజు నుంచీ పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్న అంబటి
 
Jagan is going to win says Ambati Rambabu

ఏపీలో ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష కూటమి తమదే విజయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. రకరకాల ఎగ్జిట్ పోల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూన్ 4న ఏ పార్టీ భవితవ్యం ఏమిటో తేలిపోబోతోంది. 

మరోవైపు ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ... కూటమిలో నాలుగవ పార్ట్ నర్ గా పోలింగ్ రోజున పోలీసులు చేరి ఫైట్ చేసినా... జగన్ అన్నదే విజయం అని చెప్పారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా పోలీసుల తీరుపై అంబటి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి తొత్తులుగా కొందరు పోలీసు అధికారులు వ్యవహరించారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థులను కూడా హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి రావాలంటూ ఈసీ ఆదేశించడం పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. పోలింగ్ రోజున టీడీపీ అక్రమాలకు పాల్పడిందని, తన నియోజకవర్గంలో రీపోలింగ్ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Posted

Gudivada Amarnath: మళ్లీ జగనే సీఎం.. కేంద్రంలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకూడదని కోరుకుంటున్నాం: గుడివాడ అమర్ నాథ్ 

16-05-2024 Thu 14:12 | Andhra
  • 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందన్న అమర్ నాథ్
  • జగన్ కోసం వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని కితాబు
  • ఏపీలో కేఏ పాల్, కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఒకటేనని ఎద్దేవా
 
Next CM also Jagan says Gudivada Amarnath

ఏపీ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విక్టరీని సాధించబోతోందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలని... కేంద్రంలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని కోరుకుంటున్నామని అన్నారు. ఈ ఎన్నికలను మూడు రాజధానులపై రిఫరెండంగా తీసుకుంటామని చెప్పారు. విశాఖలోనే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 

జగన్ మళ్లీ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని అమర్ నాథ్ కితాబునిచ్చారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందని ప్రచారం చేసుకుంటున్నారని... ఇందులో వాస్తవం లేదని అన్నారు. ఓటమిని తట్టుకోలేక టీడీపీ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. జగన్ హయాంలో 85 శాతం మంది లబ్ధి పొందారని... అందుకే తాము విజయంపై ధీమాగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో కేఏ పాల్ ప్రభావం ఎంతో... కాంగ్రెస్ ప్రభావం కూడా అంతేనని ఎద్దేవా చేశారు.

Posted
1 hour ago, psycopk said:

 

Gudivada Amarnath: మళ్లీ జగనే సీఎం.. కేంద్రంలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకూడదని కోరుకుంటున్నాం: గుడివాడ అమర్ నాథ్ 

16-05-2024 Thu 14:12 | Andhra
  • 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందన్న అమర్ నాథ్
  • జగన్ కోసం వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని కితాబు
  • ఏపీలో కేఏ పాల్, కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఒకటేనని ఎద్దేవా
 
Next CM also Jagan says Gudivada Amarnath

ఏపీ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విక్టరీని సాధించబోతోందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలని... కేంద్రంలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని కోరుకుంటున్నామని అన్నారు. ఈ ఎన్నికలను మూడు రాజధానులపై రిఫరెండంగా తీసుకుంటామని చెప్పారు. విశాఖలోనే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 

జగన్ మళ్లీ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని అమర్ నాథ్ కితాబునిచ్చారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందని ప్రచారం చేసుకుంటున్నారని... ఇందులో వాస్తవం లేదని అన్నారు. ఓటమిని తట్టుకోలేక టీడీపీ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. జగన్ హయాంలో 85 శాతం మంది లబ్ధి పొందారని... అందుకే తాము విజయంపై ధీమాగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో కేఏ పాల్ ప్రభావం ఎంతో... కాంగ్రెస్ ప్రభావం కూడా అంతేనని ఎద్దేవా చేశారు.

veediki gajuwaka lo deposits ayna vastaya

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...