Jump to content

Recommended Posts

Posted

Rushikonda: ఒక్కో కమోడ్‌ ఖర్చుతో ఆరుగురు పేదలకు ఇళ్లు!

విశాఖలోని రుషికొండపై జగన్‌ కట్టుకున్న ప్యాలెస్‌లో అమర్చిన టాయ్‌లెట్‌ కమోడ్‌కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు!

 

ఒక్కోదాని ధర కనీసం రూ.12 లక్షలు
రుషికొండ ప్యాలెస్‌లో మాయదారి సోకులు

180624brk124113694a.jpg

ఈనాడు, అమరావతి: విశాఖలోని రుషికొండపై జగన్‌ కట్టుకున్న ప్యాలెస్‌లో అమర్చిన టాయ్‌లెట్‌ కమోడ్‌కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు! రూ. 450 కోట్ల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి నిర్మించిన విలాసవంతమైన భవనాల్లో అత్యంత ఖరీదైన టోటో బ్రాండ్‌ కమోడ్‌లు అమర్చారు. వాటి ధర మోడల్‌ను బట్టి రూ.9 లక్షల నుంచి రూ. 15.95 లక్షల వరకు ఉంది. రుషికొండ ప్యాలెస్‌లలో అత్యంత ఖరీదైన మోడల్‌ టాయిలెట్‌లనే అమర్చారు. వాటి ధర తక్కువలో తక్కువ రూ.12 లక్షలు ఉంటుందని అంచనా..! రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్కో ఇంటికి వెచ్చించిన మొత్తం రూ.1.80 లక్షలు. అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. అంటే రుషికొండ ప్యాలెస్‌లలో అమర్చిన ఒక్కో కమోడ్‌ ధరతో పేదలకు కనీసం ఆరు ఇళ్లు కట్టొచ్చన్న మాట! ఇక్కడి ఒక్కో స్నానపు గదిని 480 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించారు. జగన్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సెంటు స్థలంలో కట్టుకునే ఇల్లు విస్తీర్ణం 340 చదరపు అడుగులు మాత్రమే. ఈ ప్యాలెస్‌లలో అమర్చిన టాయిలెట్‌ కమోడ్‌లకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. చలికాలంలో టాయిలెట్‌ షీట్‌ని వేడిగా ఉంచుకునే వెసులుబాటు, ఆటోమేటిక్‌ ఎయిర్‌ ఫ్యూరిఫైయింగ్‌ సిస్టమ్‌ వంటివి దీని ప్రత్యేకతలు. కమోడ్‌ మూత తెరుచుకోవడం, మూతపడటం, ఫ్లష్‌ చేయడం వంటివి ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. జగన్‌ ప్రభుత్వం పేదలకు కేటాయించిన సెంటు స్థలంలో కట్టే ఇల్లు కంటే.. విశాలంగా కట్టుకున్న స్నానపు గదుల ఫొటోలు, వీడియోలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు! వాటిలో అమర్చిన వస్తువుల ధరలు గురించి తెలిసేకొద్దీ సామాన్యుల కళ్లు మరింత బైర్లు కమ్ముతున్నాయి.

Posted

వీళ్ళకి ప్రజలు పిచ్చోళ్ళు లా కనిపిస్తున్నారా ?😏💦 ఒక్కోసారి.. ఒక్కో మాట చెప్పారు🙄😏 అందరికి తెలుసు... అది జగన్ రిడ్డి, భారతి రెడ్డి ఉండటం కోసం కట్టారని

వీళ్ళకి ప్రజలు పిచ్చోళ్ళు లా కనిపిస్తున్నారా ?😏💦
ఒక్కోసారి.. ఒక్కో మాట చెప్పారు🙄😏
అందరికి తెలుసు... అది జగన్ రిడ్డి, భారతి రెడ్డి ఉండటం కోసం కట్టారని.
వీడియో SHARE చేయండి... బులుగు కుక్కలు అన్ని చూసే లా..ఈ వీడియో ని షేర్ చేయండి.✊
✍️ఇపుడు ఓడిపోయారు కాబట్టి, వేరే దారి లేక... ప్రెసిడెంట్, గవర్నర్, ప్రధాన మంత్రి కోసం కట్టాం అని కట్టు కథలు చెప్తున్నారు.
✍️5 ఏళ్ళకి ఒకసారి వచ్చే వాళ్ళ కోసం... 500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి, కొండ ని తవ్వేసి..జగన్ రెడ్డి కట్టాడంట !
.
✍️నలుగురు మాత్రమే ఉండే లా బెడ్ రూమ్లు ఉన్నాయి. ఎక్కువ మంది ఉండటానికి అవకాశం లేదు.
✍️కాబట్టి, ఇది కచ్చితం గా... జగన్ రెడ్డి, భారతి రెడ్డి ఉండటానికి...ప్రజల డబ్బుతో కట్టుకున్న ప్యాలస్.
✍️30 సంవత్సరాలు తానే సీఎం గా ఉంటానని భ్రమల్లో బ్రతికాడు.
.
✍️ప్రభుత్వ భవనాలు అయితే... అక్కడ ఉన్న హరిత రిసార్ట్స్ ని కూల్చి మరి... ఎందుకు ప్యాలస్ కట్టారు ?
అసలు హరిత రిసార్ట్స్ ని కూల్చాల్సిన పని ఏంటి ? ఆ రిసార్ట్స్ నుండి 8 కోట్లు వరకూ ఆదాయాం వచ్చేది. వాటిని కూల్చి..ఆ స్థలానికి తోడు...ఇంకా ఎక్కువ కొండ ని తవ్వేసి...దాని మీద ప్యాలస్ కట్టాల్సిన పనేంటి ?
👉5 ఏళ్లకో, 10 ఏళ్లకో వచ్చే రాష్ట్రపతి కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి...జగన్ రెడ్డి ప్యాలస్ కట్టాడు అంటారా ? కామెడీ చేస్తున్నారా వైసీపీ బ్యాచ్ ?
మీరు కవర్ చేద్దాం అనుకోని...అడ్డం గా దొరిపోతున్నారు రా వైసీపీ పకోడీ బ్యాచ్ !
👉 వైజాగ్ లో ఉన్న ప్రభుత్వ భవనాలు, కలెక్టర్ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఐటిఐ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, రైతు బజార్, డైరీ ఫార్మ్, పోలీస్ క్వార్టర్స్, పీడబ్ల్యూడీ ఆఫీస్...ఇలా అన్ని తాక్కట్టు పెట్టిన మీ జగన్ రెడ్డి గాడు.....అదే వైజాగ్ లో ప్రభుత్వ అవసరాల కోసం ఆ ప్యాలస్ కట్టాడు అంటే...ప్రజలు ఎలా నమ్ముతారు రా ? ఎలా నమ్మిద్ధం అనుకున్నారు ?
 
 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...