Jump to content

Recommended Posts

Posted

Polavaram project: పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం

జగన్‌ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు అంచనాలకు మించి దెబ్బతింది 
ఆ నిర్మాణాలను చూస్తే ఏడుపొచ్చింది 
జగన్‌ వల్లే పోలవరం సర్వనాశనమైంది
కేంద్ర జలసంఘమూ చేతులెత్తేసింది
కేంద్ర సాయం, అంతర్జాతీయ నిపుణుల సూచనలతో ముందుకెళతాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి 
పోలవరంపై శ్వేతపత్రం విడుదల 
ఈనాడు - అమరావతి 

ap280624main1a_1.jpg

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడుతున్న చంద్రబాబు

గన్‌ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఇప్పుడు చూస్తే ఏడుపు వచ్చిందని.. బాధ, ఆవేదన కలిగిందని వాపోయారు. ఇంత విధ్వంసానికి బాధ్యులను ఏం చేయాలి? కేంద్ర ప్రాజెక్టును వారు చెప్పినట్లు వినకుండా రివర్స్‌ టెండర్లు నిర్వహించి గోదాట్లో ముంచెయ్యడం జగన్‌ చేసిన ద్రోహం కాదా? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అడిగేవారు ఉండరనుకుంటున్నారా అని నిలదీశారు. ఈ విధ్వంసంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఈ ద్రోహానికి బాధ్యులు రాజకీయాలకు అనర్హులని మండిపడ్డారు. కేంద్ర జలసంఘం కూడా ఏం చేయలేమని చేతులెత్తేయడంతో అంతర్జాతీయ నిపుణులను పిలిచారని, వారు అధ్యయనం చేసి డిసెంబరు నాటికి నివేదిక ఇస్తారని చెప్పారు. అన్ని సవాళ్లనూ అధిగమించి కేంద్ర సాయంతో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళతామని చంద్రబాబు చెప్పారు. అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐఐటీ నిపుణులు, కేంద్ర జలసంఘం, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో సవాళ్లను అధిగమిస్తామని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో డయాఫ్రం వాల్‌ నిర్మాణానికే మూడు, నాలుగు సీజన్లు పడుతుందన్నారు. ఆ తర్వాత ప్రధాన డ్యాం నిర్మించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న గుత్తేదారు ఏజెన్సీని మార్చడం పరిష్కారం కాదని, అన్ని కోణాల్లోనూ సమస్యను విశ్లేషించి ముందుకెళతామని చెప్పారు. జగన్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసంపై  వెలగపూడి సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

ap280624main1b.jpg

పోలవరం ప్రాజెక్టు గురించి వివిధ సందర్భాల్లో జగన్‌ ఏమన్నారో వీడియో క్లిప్పింగ్‌లతో సహా వివరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పక్కన మంత్రి నిమ్మల రామానాయుడు  


అహంభావం ఫలితమిది

పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) చెప్పినా వినకుండా జగన్‌ ప్రభుత్వం కక్షతో పాత గుత్తేదారును తొలగించి, కొత్త గుత్తేదారుకు ప్రాజెక్టును అప్పగించింది. ఆ క్రమంలో ఏడాదిన్నరపాటు ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. ఈలోపు వరదలొచ్చి డయాఫ్రంవాల్‌ కొట్టుకుపోయింది. ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌లు దెబ్బతిన్నాయి. గైడ్‌బండ్‌ కుంగిపోయింది. కేవలం జగన్‌ అహంభావం ఫలితమిది. 


దిక్కుతోచని స్థితిలో ప్రాజెక్టు

ర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ కట్టాల్సినచోట రూ.436 కోట్లతో నిర్మించిన డయాఫ్రంవాల్‌.. ఎగువ కాఫర్‌డ్యామ్‌ గ్యాప్‌లను ఏడాదిన్నరపాటు వదిలేయడం వల్ల 2020లో వచ్చిన వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలో తేల్చలేని పరిస్థితి. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు సీపేజీ, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గైడ్‌బండ్‌ కుంగిపోయింది.


ఎనిమిదేళ్లు వృథా 

యాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది కట్టాలా అన్నది తేల్చడానికే నిపుణుల కమిటీకి సంవత్సరం పట్టేలా ఉంది. ఆ తర్వాత దాని నిర్మాణానికి మరో నాలుగేళ్లు పడుతుంది. దెబ్బతిన్న కాఫర్‌ డ్యామ్‌లు, గైడ్‌బండ్‌లకూ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. ఇప్పటికే నాలుగేళ్లుగా ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం మూలన పెట్టింది. వీటన్నిటినీ పరిష్కరించి, పూర్తి చేయడానికి కనీసం నాలుగేళ్లు కావాలి. మొత్తంగా ఎనిమిదేళ్లు వృథా.


అదే అతి పెద్ద సవాల్‌

రూ.55,656 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనాలకు కేంద్రం ఇంకా ఆమోదమే తెలపలేదు. ఇక ఈ ఖర్చులన్నీ ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడమే అతి పెద్ద సవాల్‌. రాష్ట్రానికి జీవనాడిగా మారాల్సిన పోలవరం ప్రాజెక్టుకు ఒక వ్యక్తి అహంభావం మరణశాసనం లిఖించింది.  


రూ.68 వేల కోట్ల భారం/ ఆదాయ నష్టం

- ముఖ్యమంత్రి చంద్రబాబు

కొత్త డయాఫ్రంవాల్‌ కట్టడానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుంది. దాంతో పాటు కాఫర్‌డ్యామ్‌లు, గైడ్‌బండ్‌లకు మరమ్మతులు వంటి వాటికి మొత్తంగా రూ.4,900 కోట్లు ఖర్చవుతుంది. విద్యుత్‌ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోవడంతో రూ.3,000 కోట్ల నష్టం జరిగింది. 2019 నాటికి సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656 కోట్లు. ద్రవ్యోల్బణంతో 38 శాతం పెరిగితే మరో రూ.15,000 కోట్ల భారం. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో నీరు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోయింది రూ.45,000 కోట్లు. మొత్తంగా జగన్‌ ప్రభుత్వ మూర్ఖత్వం, అహంభావం వల్ల జరిగిన నష్టం, పడిన భారం సుమారు రూ.68 వేల కోట్లు. 


నష్టం అంతా ఇంతా కాదు

‘పోలవరం ప్రాజెక్టులో జగన్‌ చేసిన విధ్వంసం ఫలితం వేల కోట్ల నష్టం. ఇంకా పక్కా లెక్కలు తేలాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించకపోవడం వల్ల రూ.45 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజ్, మరమ్మతు పనులకు అదనంగా రూ.4,900 కోట్లు ఖర్చవుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం వల్ల పెరిగిన ధరలతో 38 శాతం మేర అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్తు ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల రూ.3,000 కోట్ల నష్టం. ఇప్పుడు ప్రాజెక్టు పరిస్థితి చూస్తోంటే బాధ, ఆవేదన కలుగుతోంది. వైకాపా ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజల్లో కూలంకషంగా చర్చ జరగాలి. నీటిపారుదల ప్రాజెక్టుల విధ్వంసంపై ఒక వెబ్‌సైట్‌ ప్రారంభిస్తాం. అవాస్తవాలన్నిటికీ చెక్‌ పెట్టేలా నిజాలన్నీ ప్రజల ముందుంచుతాం.

కేంద్రం, పోలవరం అథారిటీ చెప్పినా జగన్‌ వినలేదు

జగన్‌ చేతకానితనం, అహంభావం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో కూడా ఆయన పరిశీలించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే.. రివర్స్‌ టెండర్లంటూ నిర్మాణ సంస్థను మార్చేశారు. కేంద్రం, పోలవరం అథారిటీ ఎంత చెప్పినా వినలేదు. విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.. మాట వినాలని కోరారు. ప్రాజెక్టు నష్టపోతుందన్నారు. అప్పటి గుత్తేదారు పని తీరు సంతృప్తిగానే ఉంది, మార్చాల్సిన అవసరం లేదని పోలవరం అథారిటీ చెప్పింది. గుత్తేదారును మారిస్తే పనులు ఆలస్యమవుతాయని కూడా హెచ్చరించింది. ఒకే పని రెండు ఏజెన్సీలు చేస్తే నాణ్యత దెబ్బతింటుందని, ఎవరినీ బాధ్యులను చేయలేమని జల్‌శక్తిశాఖ కార్యదర్శికి కూడా లేఖ రాశారు. ఎవరెన్ని చెప్పినా, ఎంత విన్నవించినా జగన్‌ వినలేదు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. జగన్‌ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ తనకే తెలుసు అన్నట్లుగా వ్యవహరించారు. 

మేం చేసింది 72%.. వాళ్లు చేసింది 3.84%

పోలవరం ప్రాజెక్టులో తెదేపా హయాంలో 72 శాతం పనులు పూర్తయితే ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే చేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో గిన్నిస్‌ రికార్డులు దక్కితే వైకాపా ప్రభుత్వానికి చీవాట్లు వచ్చాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.3,385.58 కోట్లను కూడా జగన్‌ ప్రభుత్వం దారి మళ్లించింది. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.11,762 కోట్ల విలువైన పనులు చేస్తే జగన్‌ హయాంలో కేవలం రూ.4,167 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. తెదేపా హయాంలో కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే రూ.4,908 కోట్లు అదనంగా వెచ్చించి పనులు చేసింది. తెదేపా హయాంలో అవినీతి జరగలేదని కేంద్ర జల్‌శక్తి శాఖ పార్లమెంటులోనే సమాధానం ఇచ్చింది. పిచ్చికుక్క అని ముద్ర వేసి కుక్కను చంపినట్లు.. మంచి ప్రాజెక్టుపై అవినీతి నెపం వేసి, విధ్వంసం చేశారు.

నిర్వాసితులను నిలువునా ముంచిన జగన్‌ 

జగన్‌ పోలవరం నిర్వాసితులను కూడా మోసం చేశారు. ఎకరానికి రూ.19 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లలో ఒక్కరికీ ఇవ్వలేదు. గతంలో భూమి ఇచ్చిన వారికి అదనంగా ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తామని ఇవ్వలేదు. ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వకపోగా లబ్ధిదారుల జాబితాలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. పునరావాసం కింద కొత్తగా ఒక్క ఇల్లూ నిర్మించలేదు. తెదేపా నిర్మించిన కాలనీల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేదు. నిర్వాసితులు నాడు తెదేపా హయాంలో తీసుకున్న చర్యలతో సంతోషంగా ఉన్నారు. నిర్వాసితుల్లో తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసిన మండలాల వారు మళ్లీ తెలంగాణ వెళ్లిపోతామనే పరిస్థితిని జగన్‌ తీసుకొచ్చారు. నిర్వాసితుల కోసం తెదేపా రూ.4,114 కోట్లు ఖర్చు చేస్తే జగన్‌ హయాంలో కేవలం రూ.1,687 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

అర్హతలేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది

అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. కొందరు మమ్మల్ని తిట్టొచ్చు. విమర్శలు చేయొచ్చు. కాఫర్‌ డ్యామ్‌కు, డయాఫ్రం వాల్‌కు తేడా తెలియకుండా ప్రాజెక్టు వద్దకు వెళ్లి వెతుక్కునేవాళ్లు మాపై విమర్శలు చేశారు. కాఫర్‌ డ్యాంలు శాశ్వతం కాదు. నీటిని మళ్లించడానికే నిర్మించాం. వాటి కాలపరిమితి కూడా నాలుగేళ్లే. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పక్క రాష్ట్రాలకూ నీళ్లివ్వచ్చు. తెలంగాణకు కూడా సాగర్‌ కాల్వ ద్వారా నీళ్లు మళ్లించొచ్చు. నల్లమల అడవిలో టన్నెల్‌ తవ్వి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమకు నీళ్లు అందించవచ్చు.

మన సమస్యలు కేంద్రం ముందు పెడదాం

ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ప్రజలు గెలిచారు. చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇక రాష్ట్రాన్ని నిలబెట్టడంలో అందరూ భాగం కావాలి. మేం బాధ్యత తీసుకుంటాం. వైకాపా విధ్వంసంపై ఏడు శ్వేతపత్రాలు ఇస్తాం. 25 రోజుల్లోనే శ్వేతపత్రాలు ఇస్తాం. మన సమస్యలన్నీ కేంద్రం ముందు పెడదాం. కేంద్ర బడ్జెట్‌ కన్నా ముందే మనకేం కావాలో వాళ్లకు చెప్పాలి. నిధులు తెచ్చుకోవాలి. ప్రాజెక్టులు తెచ్చుకోవాలి. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లోనూ ఈ అంశాలు చర్చిద్దాం. అధికారులు, ఉద్యోగులు కూడా అదే అసహనంతో ఉన్నారు. ప్రజల కన్నా ఉద్యోగులే తెదేపాకు ఎక్కువ ఓట్లు వేశారు. మొత్తం మీద 57 శాతం ఓట్లు వేస్తే ఒక ఉద్యోగులే 63 శాతం ఓట్లు వేశారు. అధికారులు, ఉద్యోగులం అందరం కలిసి పని చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. క్రమశిక్షణతో పని చేద్దాం’ అని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.


వైకాపా ప్రభుత్వ అసమర్థతతోనే నష్టం

నీతి ఆయోగ్‌ నియమించిన హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల కమిటీ కూడా జగన్‌ ప్రభుత్వ తప్పిదాలనే ఎత్తిచూపింది. ప్రభుత్వ అసమర్థ ప్రణాళిక వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు లీకవుతున్నాయి. డయాఫ్రం వాల్‌ ధ్వంసమయింది. అది బాగు చేయాలా? కొత్తది నిర్మించాలా అన్నది తేలాల్సి ఉంది. పోలవరం అనేది చాలా సున్నితమైన అంశం. జాగ్రత్తగా చేయకపోతే రెండు గోదావరి జిల్లాలు కొట్టుకుపోతాయి. సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను పూడ్చకపోవడం వల్లే 2020 వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని ఐఐఐటీ కమిటీ తేల్చిచెప్పింది. డయాఫ్రం వాల్‌ను అప్పట్లో రూ.436 కోట్లతో నిర్మించాం. ఇప్పుడు కొత్తది నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. నిర్మాణానికి కూడా మూడు, నాలుగు సీజన్లు పడుతుందంటున్నారు. జగన్‌ మూర్ఖత్వంతో చేసిన పనికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. డయాఫ్రం వాల్, ఎగువ దిగువ కాఫర్‌ డ్యాంలు, గైడ్‌బండ్‌ ఈ మూడు నష్టాలు కూడా జగన్‌ నిర్వాకం వల్లే జరిగాయి. దీంతో ప్రాజెక్టుతోపాటు విద్యుత్కేంద్రం నిర్మాణమూ ఆలస్యమవుతోంది. ప్రస్తుత సవాళ్లు అధిగమించకుండా పనులు ముందుకు సాగవు. ఇక్కడి ఇంజినీర్లు రిస్కు తీసుకోవాలన్నా భయపడుతున్నారు. కేంద్ర జలసంఘమూ చేతులెత్తేసింది. ప్రాజెక్టులో పైకి తెలిసిన డ్యామేజి కన్నా తెలియని డ్యామేజి చాలా ఉంది. 2020లోనే డయాఫ్రం వాల్‌ ధ్వంసమయినా కనీసం ఆ విషయాన్ని గుర్తించలేదు. అక్కడ సమస్య ఉన్నా 2022లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని 2023 నాటికి పూర్తి చేస్తామని చెబుతూ వచ్చారు.

Posted

శ్వేతపత్రం లోని ముఖ్యమైన పాయింట్లు...

1. ఖర్చు :
టీడీపీ హయాంలో - 11,762.47 కోట్లు.
వైసీపీ హయాంలో -   4, 187 కోట్లు.

2. ప్రోగ్రెస్ :
టీడీపీ హయాంలో - 72%
వైసీపీ హయాంలో -  3.84%

3. కేంద్ర నిధుల దారి మళ్లింపులు :
టీడీపీ హయాంలో -  ఒక్క రూపాయీ లేదు.
వైసీపీ హయాంలో -  ₹3385.58 కోట్లు.

4. ప్రశంసలు :
టీడీపీ హయాంలో - కేంద్ర మంత్రులు, గిన్నిస్ రికార్డులు.
వైసీపీ హయాంలో -  నిపుణులు, పీపీఏ, ఐఐటీ హైదరాబాద్ వారితో చీవాట్లు.

5. ఎత్తు :
టీడీపీ హయాంలో -  45.72 మీ
వైసీపీ హయాంలో -  41.15 మీ

6. అంచనా :
టీడీపీ హయాంలో - ₹55,548 కోట్లకు ఆమోదం.
వైసీపీ హయాంలో -  నిధులు అడగలేని దైన్యం.

7. పరిస్థితి :
టీడీపీ హయాంలో - నాడు పర్యాటక ప్రాంతం
వైసీపీ హయాంలో -  నేడు నిషేధిత ప్రాంతం.

8. పునరావాసం :
టీడీపీ హయాంలో - కాలనీల నిర్మాణం, ముంపు బాధితులకు అండ, ₹4144 కోట్ల ఖర్చు.
వైసీపీ హయాంలో -  ₹1687 కోట్ల ఖర్చు.

9. నిర్వాసితులు :
టీడీపీ హయాంలో - ప్రభుత్వ చర్యలతో సంతోషం.
వైసీపీ హయాంలో -  ప్రభుత్వం పై నమ్మకం లేక తెలంగాణలో కలపాలని ఆందోళన.

Posted
5 minutes ago, southyx said:

శ్వేతపత్రం లోని ముఖ్యమైన పాయింట్లు...

1. ఖర్చు :
టీడీపీ హయాంలో - 11,762.47 కోట్లు.
వైసీపీ హయాంలో -   4, 187 కోట్లు.

2. ప్రోగ్రెస్ :
టీడీపీ హయాంలో - 72%
వైసీపీ హయాంలో -  3.84%

3. కేంద్ర నిధుల దారి మళ్లింపులు :
టీడీపీ హయాంలో -  ఒక్క రూపాయీ లేదు.
వైసీపీ హయాంలో -  ₹3385.58 కోట్లు.

4. ప్రశంసలు :
టీడీపీ హయాంలో - కేంద్ర మంత్రులు, గిన్నిస్ రికార్డులు.
వైసీపీ హయాంలో -  నిపుణులు, పీపీఏ, ఐఐటీ హైదరాబాద్ వారితో చీవాట్లు.

5. ఎత్తు :
టీడీపీ హయాంలో -  45.72 మీ
వైసీపీ హయాంలో -  41.15 మీ

6. అంచనా :
టీడీపీ హయాంలో - ₹55,548 కోట్లకు ఆమోదం.
వైసీపీ హయాంలో -  నిధులు అడగలేని దైన్యం.

7. పరిస్థితి :
టీడీపీ హయాంలో - నాడు పర్యాటక ప్రాంతం
వైసీపీ హయాంలో -  నేడు నిషేధిత ప్రాంతం.

8. పునరావాసం :
టీడీపీ హయాంలో - కాలనీల నిర్మాణం, ముంపు బాధితులకు అండ, ₹4144 కోట్ల ఖర్చు.
వైసీపీ హయాంలో -  ₹1687 కోట్ల ఖర్చు.

9. నిర్వాసితులు :
టీడీపీ హయాంలో - ప్రభుత్వ చర్యలతో సంతోషం.
వైసీపీ హయాంలో -  ప్రభుత్వం పై నమ్మకం లేక తెలంగాణలో కలపాలని ఆందోళన.

Jagan gadu motham thinesadu reverse tendering ani, liquor lo enni vela kotlu thinado worst fellow gadu 

Posted

CM Chandrababu: రివర్స్‌ టెండర్లలో ఆదా వట్టిదే

‘‘జగన్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్‌ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్‌ పనులు ఏవీ చేయలేదు.

 

అదనపు పనులతో రూ.2,268 కోట్ల అదనపు భారం 
2019 వరదల్లో డయాఫ్రం వాల్‌కు ఏమీ కాలేదు
2020 వరదల్లోనే విధ్వంసం 
2023 వరకు నష్టంపై అధ్యయనమే లేదు 
పోలవరంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం 
2028 జూన్‌కు తొలిదశ పూర్తి

ap280624main5a_1.jpg

ఈనాడు, అమరావతి: ‘‘జగన్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్‌ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్‌ పనులు ఏవీ చేయలేదు. గుత్తేదారును మార్చడం వల్ల రివర్స్‌ టెండర్లతో నిధులు ఆదా చేశామని చెబుతున్నా తర్వాత అదే గుత్తేదారుకు అదనపు పనులు ఇవ్వడంతో రూ.2,268 కోట్ల అదనపు భారం పడింది. సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాం ఖాళీలను పూడ్చకపోవడంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ప్రధాన డ్యాం ప్రాంతం అగాధాలతో నిండిపోయింది. ప్రాజెక్టు విధ్వంసమైంది’’ అని పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం ఇచ్చిన శ్వేతపత్రం పేర్కొంది. ‘‘2019 గోదావరి వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతినలేదు. 2020 భారీ వరదల్లోనే ఈ విధ్వంసం జరిగింది. కానీ 2023 జనవరి వరకూ దీనిపై అధ్యయనమే జరగలేదు’’ అని ఆ పత్రం వివరించింది. గుత్తేదారును మార్చకపోతే 2020 ఖరీఫ్‌ నాటికే తొలిదశ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవని పేర్కొంది. ‘‘ప్రస్తుతం తొలిదశలో +41.15 మీటర్ల స్థాయికి నీటిని నిలబెట్టి కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు 2028 జూన్‌ నాటికి అందించగలమని అంచనా వేస్తున్నాం’’ అని ప్రకటించింది. ఆ శ్వేతపత్రంలోని ఇతర అంశాలు ఇలా ఉన్నాయి.

  • జగన్‌ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు సివిల్‌ పనుల పురోగతి 3.84 శాతమే. ఎడమ, కుడి కాలువల్లో కొన్ని పెండింగు బిల్లుల చెల్లింపులు తప్ప ఏ పనీ జరగలేదు. పిల్ల కాలువల పనులూ ఇంకా ప్రారంభం కాలేదు. డీపీఆర్‌ కూడా ఖరారు కాలేదు.
  • నిధుల కేటాయింపులు, ఖర్చు అంతంతమాత్రమే. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలతో ముంపు వివాదాలు పరిష్కారం కాలేదు. 2017-18 ధరలకు అనుగుణంగా రెండో డీపీఆర్‌ ఆమోదంలోనూ పురోగతి లేదు.

గుత్తేదారు మార్పుపై పోలవరం అథారిటీ ఆగ్రహం

జగన్‌ ప్రభుత్వం పోలవరంలో గుత్తేదారు ఏజెన్సీని మార్చాలని తీసుకున్న నిర్ణయంపై పోలవరం అథారిటీ 2019 ఆగస్టు 13న నిర్వహించిన సమావేశం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాలు ఇలా ఉన్నాయి.

  • పోలవరం హెడ్‌ వర్క్స్‌ గుత్తేదారును నిర్ణయించడానికి ఏపీ ప్రభుత్వానికి 2009 నుంచి 2013 వరకు సమయం పట్టింది. మళ్లీ గుత్తేదారును మారిస్తే అదే సమస్య రావచ్చు. పనులు వేగం అందుకోవడానికి పది నెలల సమయం పడుతుంది. అది మొత్తం ప్రాజెక్టు ఆలస్యానికి దారి తీయవచ్చు. గుత్తేదారును మార్చడం వల్ల రెండేళ్ల పాటు గుత్తేదారుకు లోపభూయిష్ట బాధ్యత, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత విధించడం సాధ్యం కాదు. ఇది ఊహించని సంక్లిష్టతలను సృష్టిస్తుంది. నిర్మాణవ్యయంలో పొదుపు సాధించినా.. ప్రాజెక్టు ఆలస్యమై ఆ ప్రయోజనాలూ ఆలస్యం కావడం వల్ల జరిగే నష్టం మరింత ఎక్కువ. గుత్తేదారులతో ఒప్పందం ముందస్తుగా రద్దు వల్ల వారికి అందించాల్సిన పరిహారం కోసం అదనపు ఖర్చు అవుతుంది.
  • ప్రాజెక్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టెండర్లు రద్దు చేసి రివర్స్‌ టెండర్లు నిర్వహించాలనే ఆలోచన మానుకోవాలని పోలవరం అథారిటీ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. అయినా జగన్‌ ప్రభుత్వం గుత్తేదారును మార్చివేసింది. మేఘా సంస్థకు పనులు అప్పజెప్పింది.
  • రివర్స్‌ టెండర్ల పేరుతో రూ.628.47 కోట్లు ఆదా చేసినట్లు తేల్చినా- ఆ తర్వాత ఈ పనుల అమలు సమయంలో కొన్ని స్పెసిఫికేషన్ల మార్పు, ఇతర పనులతో సహా మరికొన్ని అదనపు అంశాలు గుర్తించి రెండు తాజా టెండర్లు పిలిచారు. ఆ రెండు టెండర్ల పనులూ మేఘా సంస్థకే ఇచ్చారు. దీనివల్ల రివర్స్‌ ద్వారా ఆదా చేశామని చెప్పిన రూ.628.47 కోట్ల స్థానంలో రూ.2,268.68 కోట్ల అదనపు భారం పడింది.
  • ఈ ప్రాజెక్టు జాప్యం కావడానికి కారణాలపై ఐఐటీ హైదరాబాద్‌ నివేదిక ఇచ్చింది. నీతి ఆయోగ్‌ ఆదేశాలతో ఈ నివేదిక సిద్ధమయింది. గుత్తేదారును మార్చడం, తగినంత పనులు చేయకపోవడం, వ్యూహాత్మక ప్రణాళిక, సమన్వయ లోపం, తరచు డిజైన్లు మార్చడం కారణాలుగా ఆ కమిటీ తేల్చింది. 2020లో 22 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో ప్రధాన డ్యాం వద్ద మూడు ప్రదేశాల్లోను, దిగువ కాఫర్‌ డ్యాంలోను విధ్వంసం సృష్టించిందని కమిటీ పేర్కొంటూ ఎగువ కాఫర్‌ డ్యాంలలో గ్యాప్‌లను సకాలంలో మూసివేయకపోవడం వల్లే ఇలా అయిందని తేల్చింది.
  • పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్‌ చేసిన నిధులన్నీ మళ్లీ అదే ప్రాజెక్టుపై వెచ్చించలేదు. అలా రూ.3,385.58 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయకుండా దారి మళ్లించారు. 2024 మే 31 నాటికి కేంద్రం నుంచి రూ.2,697 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి.
  • 2019లో 15 లక్షల క్యూసెక్కుల వరద దాటదని అంచనా వేశారు. పోలవరం అథారిటీ నిర్ణయం ప్రకారం ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు ఆ వరద లోపు మూసివేయవద్దని నిర్ణయించారు. అలా వదిలేస్తే వరద ఎంత వేగంతో వస్తుందో కూడా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాలు, వరద సూచనల ఆధారంగా ఆ సీజన్‌ వరకు ఎగువ కాఫర్‌ డ్యాం ఖాళీలు పూడ్చకూడదని నిర్ణయించారు. 2019 వరదల సీజన్‌లో 13.95 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డయాఫ్రం వాల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
  • 2020 జూన్‌ నాటికి ఎగువ కాఫర్‌ డ్యాం ఖాళీలు మూసివేయలేదు. 2020 వరద సీజన్‌లో 22 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతిని, ఇతర విధ్వంసాలు చోటుచేసుకున్నాయి.
  • తర్వాత నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ డయాఫ్రం వాల్‌ పరిస్థితిపై అధ్యయనం చేసింది. ఎక్కడెక్కడ ఎంతమేర విధ్వంసం జరిగిందో గుర్తించింది. దిగువ కాఫర్‌ డ్యాం కట్‌ ఆఫ్‌ కూడా ధ్వంసమయిందని తేల్చింది. 2020 వరదల్లో ధ్వంసమైతే 2023 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ అధ్యయనం చేసింది. డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న ప్రాంతాన్నే సరిచేయాలని, మిగిలిన భాగం సురక్షితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
  • డయాఫ్రం వాల్‌ మరమ్మతుల తర్వాత ఆ కట్టడం పనితీరుపై హామీ ఇవ్వడానికి గుత్తేదారు ఏజెన్సీలు మేఘా, బావర్‌ కంపెనీలు అంగీకరించలేదు. బావర్‌ ఇండియా లిమిటెడ్‌ నది పొడవునా కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించడం మంచిదని సూచించింది. మేఘా కంపెనీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రజలసంఘం నిర్ణయం తీసుకోవాలి.
  • 2020 జులై నుంచి 2024 జూన్‌ వరకు డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం పనులన్నీ స్తంభించిపోయాయి. మరోవైపు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలలో అదనపు సీపేజి ఉన్నట్లు గుర్తించినా, ఇప్పటివరకు నియంత్రించలేదు.
  • ప్రధాన డ్యాం గ్యాప్‌ 1లో చేసిన పనుల నాణ్యతపైనా అనుమానాలు ఉన్నాయి. ఆ పనులు చేపట్టేందుకు అదనపు ట్రీట్‌మెంట్‌ చర్యలు అవసరమని తేల్చారు. డిజైన్‌ ట్రీట్‌మెంట్‌ చర్యలు ఖరారు చేయకపోవడంతో ఆ పనులూ ముందుకు సాగలేదు. స్పిల్‌ వే కు ఎగువన నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది. దాన్నీ ఇంకా సరిదిద్దాలి.
  • గుత్తేదారును మార్చకుండా ప్రాజెక్టు ప్రణాళిక సక్రమంగా అమలు చేస్తే 2020 ఖరీఫ్‌లో నీటి విడుదలకు వీలుగా ప్రాజెక్టు పూర్తయ్యేది. ఆ తర్వాత ప్రాజెక్టును అసమర్థ ప్రణాళికతో 2023 జూన్‌ వరకు పొడిగించారు.
  • పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అఫ్రి ఇండియా లిమిటెడ్, అంతర్జాతీయ నిపుణుల సేవలు తీసుకోవాలని పోలవరం అథారిటీ నిర్ణయించింది. అఫ్రి ఇండియా లిమిటెడ్‌ డిజైన్లు ప్రతిపాదిస్తే పోలవరం అథారిటీ నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్ల సమన్వయంతో ఆమోదించాలి. పోలవరంలో మిగిలిన అన్ని పనులూ నాలుగేళ్లలో పూర్తిచేసే అవకాశం ఉంది. +41.15 మీటర్ల స్థాయికి పునరావాస పనులను 2026 నాటికి పూర్తిచేసే అవకాశం ఉంది.
  • +41.15 మీటర్ల స్థాయికి 115.43 టీఎంసీల నీటిని నింపి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని సరఫరా చేసేందుకు అన్ని పనులనూ 2028 జూన్‌ నాటికి పూర్తిచేసే అవకాశం ఉంది. +45.72 మీటర్ల స్థాయికి నీటిని నింపి ఆ స్థాయి పునరావాసం పనులు దశలవారీగా చేస్తాం. ప్రాజెక్టు తొలిదశలోని మిగిలిన పనులు పూర్తిచేసేందుకు అయ్యే వ్యయం రూ.12,157 కోట్లు.

పేలవమైన ప్రణాళికతో భారీ నష్టం

  • ఎగువ కాఫర్‌ డ్యాంలోని ఖాళీలను తగిన సమయంలో పూర్తిచేయలేదు. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయితే ముంపులో చిక్కుకునే గ్రామాలకు పునరావాసం కల్పించలేదు. స్పిల్‌ వేకు అప్రోచ్‌ ఛానల్, కుడి, ఎడమ హెడ్‌ రెగ్యులేటర్లకు అప్రోచ్‌ ఛానల్‌ పురోగతి పేలవం. ఫలితంగా ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్, కట్‌ ఆఫ్‌ వాల్‌కు తీవ్ర నష్టం. దిగువ కాఫర్‌ డ్యాం దెబ్బతింది. ప్రధాన ఆనకట్ట నిర్మించాల్సిన చోట అగాధాలు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులు అధిగమించేందుకు అవసరమైన చర్యలూ ఖరారు కాలేదు. ఫలితంగా ప్రధాన ఆనకట్టల పని ఏదీ ప్రారంభం కాలేదు.
  • కీలకమైన పని సమయంలో అకస్మాత్తుగా గుత్తేదారును మార్చారు. కేంద్రప్రభుత్వం, కేంద్ర జల్‌శక్తి, పోలవరం అథారిటీ సూచనలను విస్మరించారు. కొత్త ఏజెన్సీ సిబ్బంది, యంత్రాల సమీకరణలో జాప్యం చేయడంతో ఈ తీవ్ర నష్టాలన్నీ సంభవించాయి.

అప్పుడు పురోగతి... జగన్‌ పాలనలో తిరోగమనం

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో మంచి పురోగతితో స్వర్ణయుగమైతే, 2019-24 మధ్య జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరోగమనంలో నడిచింది. దానికి ఈ లెక్కలే నిదర్శనం. పనులు జరగకపోగా ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అనిశ్చితిలో పడింది. రెండు ప్రభుత్వాల హయాంలో పనులు జరిగిన తీరు...

ap280624main5b_1.jpg

ap280624main5c_1.jpg

Posted

Iyyani Known facts.. Pani start cheyyandi ra babu.. PPT's manandi... we are bored of it.. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...