Jump to content

Recommended Posts

Posted

కలకలం రేపిన ఏపీఎండీసీ దస్త్రాలు దహనం.. పెద్దిరెడ్డి అనుచరులపై అనుమానం

విజయవాడ శివారు పెదపులిపాక కరకట్ట వద్ద ఫైల్స్‌ దహనం ఘటన కలకలం రేపింది.

 

03filews-1a.jpg

అమరావతి: విజయవాడ శివారు పెదపులిపాక కరకట్ట వద్ద ఫైల్స్‌ దహనం ఘటన కలకలం రేపింది. అవి మైనింగ్‌శాఖకు చెందిన దస్త్రాలుగా అనుమానిస్తున్నారు. కృష్ణా నది ఇసుక తిన్నెల వద్ద కారు ఆపి ఫైల్స్‌ తగలబెడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అక్కడి వెళ్లి ప్రశ్నించడంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. ఈ సమాచారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు తెలియడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దగ్ధమైన ఫైళ్లు గనులశాఖకు చెందినవిగా గుర్తించారు. ఏపీ ఎండీసీ దస్త్రాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దహనం చేయాలని చూశారని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వాటిని కాల్చిపారేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. పలు దస్త్రాలు, హార్డ్‌ డిస్కులు కాలిపోయాయని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తెలిపారు. అధికారులు విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

Posted

కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి చిత్రాలు

కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి చిత్రాలు

కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది.

 

బుధవారం రాత్రి ఘటన
పీసీబీ, గనులు, ఏపీఎండీసీలకు చెందినవిగా అనుమానం

ap030724main5a.jpg

పెదపులిపాక వద్ద తగలబడుతున్న దస్త్రాలు

పెనమలూరు, న్యూస్‌టుడే: కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్యనియంత్రణ మండలికి చెందిన హార్డ్‌డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు చెందిన దస్త్రాలు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ap030724main5b.jpg

సగం కాలిన ఓ దస్త్రంపై మాజీ మంత్రి పెద్డిరెడ్డి చిత్రం

ఇన్నోవాలో వచ్చి.. బస్తాలు దించి..

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏపీ16 ఈఎఫ్‌ 2596 నంబరు గల ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్ట పైకి వచ్చారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్‌ ఉంది. వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్‌ కాలనీ వద్ద కారు నిలిపి, అందులో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న ఓ తెదేపా కార్యకర్త దీన్ని గమనించారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్‌ సమీర్‌శర్మ చిత్రాలు ఉండడంతో ఆయన వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, తెదేపా నేతలకు సమాచారం అందించారు. దీంతో పెదపులిపాక తెదేపా నేతలు, కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకొన్నారు. ఇది గమనించిన ఇన్నోవాలోని వ్యక్తులు యనమలకుదురు వైపు పరారయ్యారు. యనమలకుదురులో తెదేపా నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ వచ్చి కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. సమీర్‌శర్మ సూచనతో దస్త్రాలు తీసుకొచ్చి తగలబెట్టినట్టు ఇన్నోవా డ్రైవర్‌ నాగరాజు తెలిపారు.

Posted

Pedditeddy endi…minimum jaggadinhand vundali kada

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...