southyx Posted July 3, 2024 Report Posted July 3, 2024 Free Sand: అందరికీ ఉచిత ఇసుక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 8 నుంచి అమలు సీఎం చంద్రబాబు ఆదేశాలు మరో ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం తొలుత నిల్వకేంద్రాల్లోని ఇసుక అందజేసేందుకు ఏర్పాట్లు ఈనాడు - అమరావతి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ‘ముఖ్య’నేతలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని రూ.వేల కోట్లు దోచుకున్నారు. వైకాపా దోపిడీని, ప్రజల అవస్థలను గుర్తించిన కూటమి నేతలు.. తాము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారం చేపట్టిన వెంటనే కీలక ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వరకు ఉన్న గుత్తేదారులు రాష్ట్రంలో వివిధ నిల్వ కేంద్రాల్లో ఇసుక నిల్వచేశారు. ఇప్పుడు తొలుత మూడు నెలలపాటు దీనిని ఉచితంగా అందజేయనున్నారు. అలాగే బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. వీటి తవ్వకాలకు, నిల్వ కేంద్రాలకు తరలించేందుకు అయిన ఖర్చును మాత్రమే తీసుకోనున్నారు. ఆ ఖర్చు ఎంత అనేది ఆయా జిల్లాల్లో కలెక్టర్లు నిర్ణయిస్తారు. సెప్టెంబరు వరకు ఇదే విధంగా ఇసుక అందజేయనున్నారు. చంద్రబాబు కీలక ఆదేశాలు ఉచిత ఇసుక విధానం అమలుపై చంద్రబాబు కీలక ఆదేశాలిచ్చారు. ఆయన తొలుత మంగళవారం సచివాలయంలో గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ కార్యదర్శి యువరాజ్, సంచాలకుడు ప్రవీణ్కుమార్లతో సమావేశం నిర్వహించి, ఉచిత ఇసుక విధానం అమలుకు మరిన్ని వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు సమగ్ర సమాచారంతో బుధవారం సీఎం వద్ద జరిగిన సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 8 నుంచే ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటుచేసి పర్యవేక్షించడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎలా ఇసుక అందజేయాలి.. తదితరాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. బుధవారం సీఎం వద్ద జరిగిన సమావేశం అనంతరం.. ఆ శాఖ సంచాలకుడు ప్రవీణ్కుమార్.. అన్ని జిల్లాల గనులశాఖ డీడీలు, ఏడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఉన్న నిల్వ కేంద్రాలను వెంటనే పరిశీలించి, ఎంత ఇసుక ఉందో లెక్కలు వేసి, గురువారం సాయంత్రానికి నివేదిక పంపాలని కోరారు. అన్ని నిల్వ కేంద్రాల్లోనూ కలిపి తొలుత 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు భావించినప్పటికీ.. తాజాగా ఎంత ఉందనేది లెక్క తేల్చనున్నారు. అలాగే వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల పరిధిలో 70-75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక పూడిక రూపంలో ఉన్నట్లు గుర్తించారు. దీనిని వెలికితీసి ఈ మూడు నెలలు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోవడంపై ఆలోచనలు చేస్తున్నారు. అలాగే ప్రస్తుత గుత్తేదారులైన జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థల ప్రతినిధులతో ప్రవీణ్కుమార్ గురువారం సమావేశం నిర్వహించనున్నారు. ఐదేళ్లలో కనీవినీ ఎరగని దోపిడీ జగన్ ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడీ కనీవినీ ఎరుగనది. గత ప్రభుత్వం తొలుత టన్ను ఇసుక రూ.375, తర్వాత రూ.475 చొప్పున విక్రయించింది. ఊరూపేరులేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టి, వాటిపేరిట ‘ముఖ్య’నేతలే నేరుగా ఇసుక వ్యాపారంచేసి రూ.వేల కోట్లు పోగేసుకున్నారు. ట్రాక్టర్ ఇసుక కావాలంటే రూ.10 వేలు, లారీ లోడు కావాలంటే రూ.25-30 వేలు వెచ్చించాల్సినంతలా ధరలు పెంచేశారు. దీంతో గత ఐదేళ్లూ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. నదుల్లో తవ్వకాలకు అనుమతులు లేకపోయినా, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకుండా ఇసుక అక్రమ తవ్వకాలు సాగించారు. దీనికి అప్పటి గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి సంపూర్ణ సహకారం అందించారు. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా గనులశాఖ అధికారులను వాటి జోలికి వెళ్లనివ్వకుండా వెంకటరెడ్డి హుకుం జారీచేశారు. నేరుగా సీఎం కార్యాలయం నుంచే పర్యవేక్షణ ఉండటంతో అన్ని శాఖల అధికారులూ మిన్నకుండిపోయారు. మూడు నెలలకు కోటి టన్నుల ఇసుక: మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలో అందరికీ ఉచిత ఇసుక అందజేయనున్నామని, త్వరలో దీనిని అమలు చేసేలా శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి ఒక్కరికీ, ప్రతి రోజూ ఉచిత ఇసుక అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఆయన బుధవారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘సెప్టెంబరు వరకు కోటి టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నాం. వర్షాకాలం కావడంతో నదుల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదు. ఇందుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అందుకే నిల్వ కేంద్రాల్లో ఎంత ఇసుక ఉందనేది లెక్కిస్తున్నాం. దీనితోపాటు బ్యారేజీలు, జలాశయాల పరిధిలోని పూడిక రూపంలో ఉన్న ఇసుకను, బోట్స్మెన్ సొసైటీల ద్వారా ఉచితంగా ఇవ్వనున్నాం. అయితే వాటి లోడింగ్ ఖర్చు, నిల్వకేంద్రాలకు తరలించడానికి అయిన వ్యయం లెక్కించి తీసుకుంటారు. అనధికార నిల్వకేంద్రాలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించాం. ఇసుక అక్రమాల్లో భాగస్వాములైన అందరిపైనా చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక పరిశీలన బట్టి.. జేపీ సంస్థ ప్రభుత్వానికి రూ.700 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. అయినాసరే గత డైరెక్టర్ ఆ సంస్థకు ఎలా నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చారు? బ్యాంక్ గ్యారంటీల విడుదలకు ఎలా ఆదేశాలిచ్చారన్నదానిపై సమగ్ర విచారణ జరిపిస్తాం. గత ప్రభుత్వంలో అసలు ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో గనులశాఖ అధికారులు ఉన్నారు’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. Quote
southyx Posted July 3, 2024 Author Report Posted July 3, 2024 Free Sand: ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఇకపై టన్ను ఇసుకపై రూ.287 మిగులు సీనరేజ్ కింద రూ.88 మాత్రమే వసూలు ఆ మొత్తమూ స్థానిక సంస్థల ఖాతాలకే ఈనాడు, అమరావతి: ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను రూ.475 చొప్పున విక్రయించారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు, రవాణా ఖర్చు రూ.100 తీసేయగా, మిగిలిన రూ.375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై రూ.375 కాకుండా.. కేవలం రూ.88 వసూలు చేస్తారు. ఆ మొత్తమూ స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో.. సీనరేజ్ ఛార్జి కింద తీసుకునే రూ.66(టన్నుకు) నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద రూ.19.80 చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా రూ.1.32 గనులశాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్కు చేరుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు రూ.287 భారం తగ్గుతుంది. ఈనెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు రూ.88తోపాటు, ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి, తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్లో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ రేట్ను కలెక్టర్లు ఖరారు చేస్తారు. బోట్స్మెన్ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను రూ.625కి విక్రయించారు. ఇందులో బోట్స్మెన్ సొసైటీకి.. టన్నుకు రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్స్మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు రూ.200, సీనరేజ్ రూ.88 కలిపి రూ.288కే ఇకపై ప్రజలకు విక్రయించనున్నారు. సెప్టెంబరు వరకు ఆన్లైన్ పర్మిట్లు వంటివి లేకుండా ఇసుక విక్రయించనున్నారు. అక్టోబరు నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్లైన్ పర్మిట్లు జారీచేసి, ఆన్లైన్ చెల్లింపులు తీసుకురానున్నారు. ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్ గనులశాఖ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓ రూట్కు అనుమతి తీసుకొని, మరో మార్గంలో వెళితే చర్యలు తీసుకుంటారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.