Jump to content

Aa asta daridrudiki ee nista daridrudu vattasu… psyco vedavalara


Recommended Posts

Posted

Vangalapudi Anitha: ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి?: హోంమంత్రి అనిత 

04-07-2024 Thu 18:40 | Andhra
Home Minister Vangalapudi Anitha slams Jagan
 

 

  • నేడు నెల్లూరు జైల్లో పిన్నెల్లిని కలిసి పరామర్శించిన వైసీపీ అధినేత జగన్
  • పిన్నెల్లిని కలవడానికి జగన్ రూ.25 లక్షలు పెట్టి హెలికాప్టర్లో వచ్చారన్న అనిత
  • మానవతా దృక్పథంతో జగన్ కు ములాఖాత్ అనుమతి ఇచ్చామని వెల్లడి
నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. 

అమరావతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈవీఎం పగులగొట్టిన పిన్నెల్లిని కలిసేందుకు జగన్ ఇవాళ రూ.25 లక్షలు ఖర్చు చేశారని వెల్లడించారు. జైల్లో  ఉన్న పిన్నెల్లి కోసం జగన్ హెలికాప్టర్ లో నెల్లూరు వెళ్లారని వివరించారు. అయితే, పిన్నెల్లి ములాఖాత్ లు అయిపోయినప్పటికీ, మానవతా దృక్పథంతో జగన్ కు అనుమతి ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. ములాఖాత్ లు అయిపోయాయని తెలిసి కూడా జగన్ ఉద్రిక్తతలు రగిల్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. 

"ఈవీఎం బద్దలు కొట్టడం, హత్యాయత్నం వంటి అంశాల్లో పిన్నెల్లి పక్కా ఆధారాలతో దొరికిపోయారు. ఆయన అరెస్ట్ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ ఖైదీని కలవాలని నిర్ణయించుకున్నారు... అది ఆయన ఇష్టం. డబ్బుంది కాబట్టి పాతిక లక్షలు ఖర్చుపెట్టుకుని నెల్లూరు వెళ్లారు. పిన్నెల్లికి ములాఖాత్ లు అయిపోయినప్పటికీ, మేం మానవతా దృక్పథంతో ఆలోచించి అనుమతి ఇచ్చాం. 

నాడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు మూడో ములాఖాత్ ఇచ్చేవారు కాదు. కానీ ఇవాళ తనకు అనుమతి లేదని తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అక్కడ గలాటా సృష్టించడానికే అనుకోవాలా? 

మేం ఇవాళ రూల్స్ పట్టించుకోకుండా మానవతా కోణంలో అనుమతి మంజూరు చేశాం. కానీ జగన్ జైలు నుంచి బయటికి వచ్చి, అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారు. సీసీ టీవీ ఫుటేజి చూసినవారెవరైనా అక్రమ అరెస్ట్ అంటారా? అతడ్ని అరెస్ట్ చేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. 

మేం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే, వాటిని దాడులు అని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి మీరు ఐదేళ్ల కిందట పాలన మొదలుపెట్టినప్పటి నుంచి చేసిన వాటిని ఏమనాలి? ప్రజావేదిక కూల్చివేత నుంచి మీరు చేసినవి ఏమిటి... దాడులు కాదా...? నా మీదే 23 కేసులు పెట్టారు. మేం కక్ష తీర్చుకోవాలనుకుంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఇవాళ వచ్చి ప్రతీకార దాడులు అంటూ రెచ్చగొడుతున్నారా?" అంటూ అనిత ధ్వజమెత్తారు.
Posted

Jagan: ఆ మనిషి మంచివాడు కాబట్టే ప్రజలు నాలుగుసార్లు గెలిపించారు: పిన్నెల్లికి జగన్ సపోర్ట్ 

04-07-2024 Thu 14:37 | Andhra
Jagan visits Nellore Central Jail and talked to Pinnelli
 

 

  • నేడు నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన జగన్
  • ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదని వెల్లడి
  • ప్రజలకు మంచి చేసి వైసీపీ ఓడిపోయిందని ఆక్రోశం
  • చంద్రబాబు మోసపూరిత హామీలకు ప్రజలు ప్రభావితులయ్యారన్న వైసీపీ అధినేత
  • పిన్నెల్లిని అన్యాయంగా కేసుల్లో బిగించారని విమర్శలు
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా జైలులో నిర్బంధించారని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. 

టీడీపీకి, చంద్రబాబుకు ఓటేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేది వీళ్లే... మళ్లీ  తమపైనే దాడులు చేస్తున్నారంటూ కేసులు పెట్టేదీ వీళ్లే అని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు.

గత ఐదేళ్లలో జరిగిన వైసీపీ పాలనలో తాము కులం, మతం, ప్రాంతం చూడలేదని, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా... అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్కరికీ మంచి చేశామని వెల్లడించారు. కానీ, టీడీపీ వాళ్లు ఎన్నికల్లో వాళ్లకు ఓటేయలేదని ఇవాళ రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తున్నారని, ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా పండుతాయని పేర్కొన్నారు. ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు కూడా తొందర్లోనే ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. 

"ప్రజలు తనకు ఎందుకు ఓటు వేశారో చంద్రబాబు ఆలోచించుకోవాలి. ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదు. ప్రజలకు మంచి చేసి వైసీపీ ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలకు ప్రజలు ప్రభావితులయ్యారు. 10 శాతం మంది అటువైపు మళ్లడంతో చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. రైతు భరోసా, తల్లికి వందనం పథకాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. 

18 ఏళ్లు పైబడిన ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నెలకు రూ.1500 ఎప్పట్నించి ఇస్తావంటూ ఈ మహిళలంతా చంద్రబాబును అడుగుతున్నారు. ముందు ఈ హామీలు నిలబెట్టుకోవడంపై చంద్రబాబు శ్రద్ధ చూపించాలి. ఇవేవీ చెయ్యకుండా కేవలం భయాందోళనలు సృష్టించాలి, దొంగ కేసులు పెట్టి ఇరికించాలి, ఆస్తులు ధ్వంసం చేయాలి, వైసీపీ మద్దతదారులను ఇబ్బందిపెట్టాలన్న దుర్మార్గపు ఆలోచనతో అడుగులు వేయడం హేయమైన రాజకీయం. 

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. అన్యాయమైన రీతిలో ఆయనపై కేసులు బిగించారు. గ్రామంలో ఉన్న ఎస్సీలు ఓటు వేసే పరిస్థితి లేకపోవడంతో, మా ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేకపోయింది. సున్నితమైన ఏరియాలో ఉన్న ఆ బూత్ లో కేవలం ఒక హోంగార్డును సెక్యూరిటీగా పెట్టారు. ఆ బూత్ లో అన్యాయం జరుగుతుండడంతో ఎమ్మెల్యే లోపలికి వెళ్లి ఈవీఎం పగులగొట్టాడు. వైసీపీకే ఓట్లు పడుతుంటే ఎమ్మెల్యే వెళ్లి ఈవీఎంను పగులగొట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడికి వెళ్లినప్పుడు జరుగుతున్న అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎంను పగులగొట్టాడు! 

ఈవీఎంను పగులగొట్టిన కేసులో తనకు బెయిల్ వచ్చింది. ఇవాళ తను లోపల ఉంది ఈవీఎంను పగులగొట్టిన కేసులో కాదు... ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి హత్యాయత్నం చేశాడంటూ నమోదైన కేసులో జైల్లో ఉన్నాడు. అక్కడ రిగ్గింగ్ చేస్తున్నది వాళ్లయితే, అడ్డుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే హత్నాయత్నం చేస్తాడా? ఇలా చెప్పడానికైనా ఓ హద్దు ఉండాలి. ఈవీఎం ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఈ హత్యాయత్నం కేసు పెట్టారు. 

నిజంగానే హత్యాయత్నం జరిగి ఉంటే మే 17 నుంచి 20వ తేదీ వరకు విచారణ జరిపిన సిట్ తన నివేదికలో ఆ విషయం పేర్కొని ఉండేది కదా! అతడ్ని వేధించడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఆ మనిషి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ మనిషి స్థిరంగా గెలుస్తూ వస్తున్నాడంటే ఆ మనిషి మంచివాడు కాబట్టే కదా. ఆ మనిషి మంచివాడు కాబట్టే  ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి ఇలా తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంతవరకు ధర్మం?" అని జగన్ ప్రశ్నించారు.
Posted

Sajjala Ramakrishna Reddy: సజ్జలపై సీఐడీకి ఫిర్యాదు చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని 

25-06-2024 Tue 16:04 | Andhra
Mines owner complains against Sajjala to CID
 

 

  • సజ్జల కనుసన్నల్లో ఆయన అనుచరులు తమ గనులను దోచేశారన్న బద్రీనాథ్
  • వేల కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ
  • ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని వెల్లడి 
ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులపై నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సీఐడీని ఆశ్రయించారు. సజ్జల కనుసన్నల్లో ఆయన అనుచరులు శ్రీకాంత్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి గనులు దోచేశారని... అదూరు శ్రీచరణ్, కృష్ణయ్యలను అడ్డంపెట్టుకుని అక్రమాలకు తెరలేపారని బద్రీనాథ్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. 

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జోగుపల్లిలో తమకు 240 ఎకరాల భూమి ఉండగా, అందులో 8 గనులు ఉన్నాయని బద్రీనాథ్ వెల్లడించారు. 

అయితే, గత రెండేళ్లుగా తమ గనుల నుంచి అక్రమంగా 800 కోట్ల టన్నుల వరకు క్వార్జ్ ఖనిజాన్ని దోచేశారని, దాని విలువ వేల కోట్లు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి దోచుకున్నారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని బద్రీనాథ్ ఆరోపించారు.
Posted

veedu idhe attitude and game plan tho pothe .. next term ye biscuit ye .. reality lo ki raavaali .. 

Posted
4 minutes ago, perugu_vada said:

veedu idhe attitude and game plan tho pothe .. next term ye biscuit ye .. reality lo ki raavaali .. 

vadu life lo radu.... his life is over.. mark my words... 

Posted

Ye reasoning tho justify chesukuntaru dude asalu?

Ee YCP batch entha Neechamayina panulu chesina question cheyyakudada?

asalu vellaki law undada?

what is this stupidity?

Posted
13 minutes ago, Pirate_of_hearts said:

Title chusi CBN and PK gurinchi anukunna 🤣

hm... paytms ki dabbulu ivatam start chesara apude... 

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...