Jump to content

Recommended Posts

Posted

 

Chandrababu: ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్న నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది: ఏపీ సీఎం చంద్రబాబు 

06-07-2024 Sat 22:15 | Andhra
Chandrababu tweets about Chief ministers meeting
 

  

హైదరాబాదులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇవాళ హైదరాబాదులో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. చాన్నాళ్లుగా పెండింగ్ లో  ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది" అని చంద్రబాబు వివరించారు. ఈ సమావేశం తాలూకు ఫొటోలను కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు.
20240706fr668974b30fed5.jpg

 

 

Posted

Maa psyco gadu unnadu enduku… gelavagane buildings ani rasi ichi muskoni moolana kurchunadu mogudu chachina munda mopi la…

 

Posted

Anagani Sathya Prasad: చంద్రబాబు చొరవ, రేవంత్ రెడ్డి సానుకూల స్పందన ఫలితమే నేటి సమావేశం: ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ 

06-07-2024 Sat 22:08 | Andhra
AP minister Anagani Sathya Prasad press meet
 

 

  • హైదరాబాదులో నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
  • హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రులు
  • సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సమావేశమై విభజన అంశాలపై చర్చించడం తెలిసిందే. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఉభయ రాష్ట్రాల మంత్రులు మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడిన అనంతరం, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వివరాలు తెలిపారు. 

"ఇవాళ తెలుగుజాతి అంతా హర్షించే ఒక మంచి రోజు. ఎందుకంటే... తెలంగాణను పురోగామి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, వారి సహచర మంత్రులు... ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులుగా మేం ఈ సమావేశానికి హాజరై రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేసే నిర్ణయాల దిశగా కీలక ముందడుగు వేశాం. 

తెలుగు వారు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు గారు. విభజన అంశాల పరిష్కారం కోసం ఆయన చొరవ తీసుకుని ఓ లేఖ పంపడం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లేఖపై వారి క్యాబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ఫలితమే నేటి సమావేశం. 

ఈ సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించాం. మంత్రులందరి సలహాలు, అధికారుల నుంచి సూచనలు స్వీకరించాం... ఆయా సలహాలు, సూచనలపైనా చర్చించాం. నిధులు, విధులు, కేటాయింపులు... ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం ప్రారంభమై, రాష్ట్రం ఏర్పాటైందన్న సంగతి అందరికీ తెలుసు. అదే సమయంలో ఆంధ్రపదేశ్ అభివృద్ధి, సెంటిమెంట్ ను పరిగణనలోకి తీసుకుని... ఎవరి మనోభావాలు దెబ్బతినని రీతిలో, అందరి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని, ఉభయ రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో నేటి చర్చల సరళి సాగింది. 

పెండింగ్ అంశాల పరిష్కారం చర్చల ద్వారానే సాకారమవుతుందన్న నమ్మకంతోనే అధికారుల కమిటీ వేయడం గానీ, మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం గానీ జరిగింది. పునర్ వ్యవస్థీకరణ చట్టం గురించే కాకుండా, రాబోయే రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేలా తరచుగా కలుద్దామని ఉభయ ముఖ్యమంత్రులు కూడా నిర్ణయం తీసుకున్నారు. 

భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు... తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే వారి ప్రణాళికతో మేం కూడా సమన్వయం చేసుకుని ముందుకు పోతాం. అందుకోసం రెండు రాష్ట్రాల నుంచి మంత్రులతో ఒక సబ్ కమిటీ వేసుకున్నాం. 

ఏపీలో 8వ తరగతి పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి దొరికే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ నుంచే డ్రగ్స్ వస్తున్నాయని తెలంగాణ సీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి... రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు అడిషనల్ డీజీ అధికారుల నేతృత్వంలో డ్రగ్స్ వ్యతిరేక కార్యాచరణ కొనసాగుతుంది. ఈ ప్రణాళికలకు ఒక టైమ్ ప్లాన్ ఏర్పాటు చేసుకున్నాం. 

మొత్తమ్మీద... పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకు సరైన పరిష్కారం దిశగా అధికారుల, మంత్రుల కమిటీలు పనిచేస్తాయి. ఈ అంశాలపై మేం మరోసారి సమీక్షించిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తాం" అని అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
Posted

Revanth Reddy: పెండింగ్ అంశాలపై చర్చించాం... రేవంత్ రెడ్డి, ఈ భేటీ ద్వారా నమ్మకం కలిగింది... చంద్రబాబు 

06-07-2024 Sat 21:41 | Telangana
Revanth Reddy tweets about meeting with Chandrababu
 

 

  • సమావేశం అనంతరం తమ తమ నివాసాలకు చేరుకున్న ముఖ్యమంత్రులు
  • మంత్రులతో కలిసి చంద్రబాబు సహా ఏపీ ప్రతినిధులతో సమావేశమయ్యామన్న రేవంత్ 
  • ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై చర్చించామని చంద్రబాబు ట్వీట్
  • మంచి వాతావరణంలో సమావేశం జరిగిందన్న మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రుల సమావేశం దాదాపు రెండు గంటలు కొనసాగింది. ఆ తర్వాత చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు జూబ్లీహిల్స్‌లోని తమ తమ నివాసాలకు చేరుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు, ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంశాలపై పరిష్కారం కోసం చర్చించినట్లు పేర్కొన్నారు.

ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం కలిగిందన్న చంద్రబాబు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపామని చంద్రబాబు ట్వీట్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయని, ఇరురాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందని పేర్కొన్నారు.

మంచి వాతావరణంలో సమావేశం జరిగింది: శ్రీధర్ బాబు

మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విభజన అంశాలపై అధికారుల కమిటీని వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మరోసారి కూర్చొని చర్చిస్తారని తెలిపారు. ఏడు మండలాలు, విద్యుత్ బకాయిలు... ఇలా ప్రతి అంశంపై అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే కేంద్రం వద్దకు వెళతామన్నారు.
Posted

 

Mallu Bhatti Vikramarka: ముఖ్యమంత్రుల సమావేశంలో మేం తీసుకున్న నిర్ణయాలు ఇవే: భట్టి విక్రమార్క 

06-07-2024 Sat 21:36 | Both States
Bhatti Vikramarka reveals what decisions has taken in Chief Ministers meeting today
 

 

  • హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
  • హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
  • సమావేశం అనంతరం ఉభయ రాష్ట్రాల మంత్రుల ప్రెస్ మీట్
పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారం కోసం నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాదులో సమావేశమయ్యారు. ప్రజాభవన్ లో ఒక గంట 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సీఎంల సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ, ఏపీ మంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. 

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నుంచి నేను, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ నుంచి సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్ గారు అందరం ఈ సమావేశానికి హాజరయ్యామని వెల్లడించారు. 

"ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి, ఇరు రాష్ట్రాలకు చెందిన అపరిష్కృత అంశాలపై త్వరితగతిన చర్చించుకుని ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో ఈ సమావేశాన్ని నేడు ఏర్పాటు చేయడం జరిగింది. 

విభజన చట్టంలోని పెండింగ్ అంశాలకు ఈ సమావేశంలోనే పరిష్కారం లభిస్తుందని మేం ఆశించలేదు. కాకపోతే, వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి విధానపరమైన వ్యవస్థలు ఏర్పాటుకు రెండు రాష్ట్రాల సీఎంలు సహా ప్రతినిధుల బృందాలు కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాం. 

ముందుగా, రెండు రాష్ట్రాల ఉన్నతస్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల సీఎస్ స్థాయి అధికారులు, రాష్ట్రానికి ముగ్గురు ఉన్నతాధికారుల చొప్పున సభ్యులు ఉంటారు. ఈ కమిటీ మరో రెండు వారాల్లో సమావేశమై వారి స్థాయిలో పరిష్కారం లభించే అంశాలపై చర్చిస్తుంది. 

ఈ ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కాని అంశాలు ఏవైనా ఉంటే... రెండు రాష్ట్రాల మంత్రులతో కూడిన ఒక కమిటీ వేయాలని నిర్ణయించాం. అపరిష్కృత అంశాలపై ఈ మంత్రుల కమిటీ సమావేశమై చర్చిస్తుంది. మంత్రుల కమిటీలో పరిష్కారమైన అంశాలను ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించడం జరుగుతుంది. 

ఒకవేళ మంత్రుల కమిటీ ద్వారా కూడా ఏవైనా అంశాలకు పరిష్కారం లభించకపోతే, మళ్లీ ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం మూడు దశల్లో సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ సిద్ధం చేశాం. ఈనాటి సమావేశంలో ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం ఇదే. 

ఇక, ఇదే సమావేశంలో మరో అతి ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్ చేపడుతోంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. సైబర్ నేరాలతోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

అందుకే... యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడి కార్యాచరణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఒక సమన్వయ కమిటీ ద్వారా సమర్థవంతంగా పనిచేయగలిగితే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. ఈ మేరకు నేటి సమావేశంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇవీ ఈనాటి సమావేశానికి చెందిన ముఖ్యమైన అంశాలు" అని భట్టి విక్రమార్క వివరించారు. 

 

 

Posted

Revanth Reddy: హైదరాబాద్ లోని స్థిరాస్తులు ఇవ్వడానికి తెలంగాణ నో.. ఢిల్లీలోని ఏపీ భవన్ తరహా నిర్మాణానికి స్థలం ఇస్తామన్న రేవంత్! 

06-07-2024 Sat 20:42 | Both States
Revanth Reddy not ready to give Hyderabad Assets to AP
 

 

  • హైదరాబాద్‌లో భూమి కోసం అర్జీ పెట్టుకోవాలని ఏపీకి సూచించిన తెలంగాణ
  • ఐదు గ్రామాలను ఇవ్వాలని కోరిన తెలంగాణ... ఏపీ సానుకూల స్పందన?
  • విద్యుత్ బకాయిలపై ఇరు రాష్ట్రాల చర్చ
తెలంగాణ, హైదరాబాద్‌లోని కొన్ని భవనాలను తమకు ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని స్థిరాస్తులను ఏపీకి ఇచ్చేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని అంటున్నారు. అవసరమైతే ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో హైదరాబాద్‌లో భవనం కట్టుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పారు. భూమి కోసం ఏపీ అర్జీ పెట్టుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

ఈ రోజు సాయంకాలం హైదరాబాదులోని ప్రజాభవన్ లో జరిగిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం ముగిసింది. అయితే సమావేశంలో తెలంగాణ పలు డిమాండ్లను ఏపీ ముందు ఉంచినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమకు రూ.24 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఏపీ కోరగా... తెలంగాణ నిరాకరించిందని అంటున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని ఆస్తులను ఇచ్చేందుకు నిరాకరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు గ్రామాలు... ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నంలను తమకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ విజ్ఞప్తికి చంద్రబాబు నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో పదిహేను ప్రాజెక్టులు నిర్మించగా... ఇందుకు సంబంధించిన అప్పులపై, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులు, చెల్లింపులపై చర్చించారని సమాచారం. ఉద్యోగుల విభజన అంశాలపై కూడా చర్చించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...