Jump to content

Lafangi Emnaa kirikiri chesada dalai??


Recommended Posts

Posted

KCR: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా 

15-07-2024 Mon 17:43 | Telangana
CJI adjourned KCR petition
 

 

  • విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణాలపై నరసింహారెడ్డి కమిషన్‌ను వేసిన ప్రభుత్వం
  • కమిషన్ ఏర్పాటు, తనకు నోటీసులు రావడంపై కేసీఆర్ న్యాయపోరాటం
  • విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను రేపు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మొదట కేసీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. కోర్టు పనివేళలు ముగిసిన సమయానికి కేసు విచారణకు రావడంతో రేపు ఉదయానికి వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలపై కమిషన్ వేసింది. విచారణ రావాలంటూ కమిషన్... కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన న్యాయపోరాటం ప్రారంభించారు. తనకు నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడంపై ఆయన కోర్టుకెక్కారు.

చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు వెళ్లారు.
  • psycopk changed the title to Lafangi Emnaa kirikiri chesada dalai??
Posted

KCR: సుప్రీంకోర్టులో కేసీఆర్ కు ఎదురుదెబ్బ 

16-07-2024 Tue 14:32 | Telangana
Backlash to KCR in Supreme Court
 

 

  • విద్యుత్ ఒప్పందాలపై వేసిన కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్
  • కమిషన్ విచారణ కొనసాగించాలన్న సుప్రీంకోర్టు
  • కమిషన్ ఛైర్మన్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసిహారెడ్డి ఛైర్మన్ గా కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. 

కేసీఆర్ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం కేసీఆర్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కమిషన్ విచారణ కొనసాగించాలని తెలిపింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనిని జ్యుడీషియల్ ఎంక్వైరీ అనకుండా... ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని తెలిపింది.

మరోవైపు, కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, కమిషన్ ఛైర్మన్ ను మారుస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ జడ్జిలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, కొత్త ఛైర్మన్ పేరును తెలిపేందుకు సమయం కావాలని... సోమవారం కొత్త ఛైర్మన్ పేరును తెలియజేస్తామని కోర్టుకు తెలిపింది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...