Jump to content

Recommended Posts

Posted

Thummala: ఆ రైతులకు మంత్రి తుమ్మల గుడ్‌న్యూస్... ఎల్లుండి వారి ఖాతాల్లో నగదు జమ

16-07-2024 Tue 19:25 | Telangana
Tummala Nageswara Rao good news to farmers

 

  • ఈ నెల 18న రూ.1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్న మంత్రి
  • 30 లక్షల మంది రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమని వెల్లడి
  • గోల్డ్ లోన్ తీసుకున్న రైతులకు పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామన్న మంత్రి

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు శుభవార్త చెప్పారు. ఎల్లుండి రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని తెలిపారు. ఈ నెల 18న రూ.1 లక్ష వరకు ఉన్న వారికి రుణమాఫీ చేస్తామన్నారు. రైతుల ఖాతాల్లో ఈ నెల 18న రూ.6 వేల కోట్లకు పైగా జమ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా 30 లక్షల మంది రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమన్నారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నట్లే పాత పద్ధతిలో రుణమాఫీ చేయబోతున్నామన్నారు. గతం కంటే భిన్నంగా రుణమాఫీ చేయబోవడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు రైతు వడ్డీలకే అది సరిపోయిందని విమర్శించారు. కుటుంబ నిర్ధారణ చేయాలంటే రేషన్ కార్డు డేటా అవసరమన్నారు. 

60 లక్షల మంది ఖాతాదారుల్లో 6 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని, రేషన్ కార్డులు లేని కుటుంబాల దగ్గరకు అధికారులు వెళ్లి నిర్ధారణ చేస్తారన్నారు. 39 లక్షల కుటుంబాలు ఇప్పటి వరకు పంట రుణాలను తీసుకున్నట్లు చెప్పారు. బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాఫ్ లోన్లు తీసుకున్న రైతులకు పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామన్నారు.
Posted

Revanth Reddy: రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

16-07-2024 Tue 17:58 | Telangana
Revanth Reddy clarity on loan waiver

 

  • పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందన్న రేవంత్
  • కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన అని వెల్లడి
  • ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్న సీఎం

తెలంగాణలో పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే నిబంధన అందరినీ గందరగోళానికి గురి చేసింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రూ. 2 లక్షల రుణమాఫీ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామని తెలిపారు. ఈ నెల 18లోపు రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రుణమాఫీ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...