Jump to content

Recommended Posts

Posted

Microsoft Outage: క్రౌడ్‌ స్ట్రైక్‌.. ప్రపంచం ఊగిపోయినా.. చైనాలో బెరుకు లేదు.. ఎందుకు?

విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచ దేశాలను కుదిపేసినా.. చైనాపై ప్రభావం చూపించలేదు. ఎందుకు?

210724microsoft1a.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండ్రోజుల క్రితం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ (Microsoft Windows)లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచాన్ని కుదిపేసింది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సేవలు, బ్యాంకుల, వివిధ వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ కనిపించడంతో సిస్టమ్‌లు షట్‌డౌన్‌ / రీస్టార్ట్‌ అయ్యాయి. కానీ, పొరుగు దేశం చైనాపై ఈ ప్రభావం పెద్దగా కనిపించలేదు. అక్కడి విమాన సర్వీసులు, బ్యాంకులు ఎప్పటిలాగే కొనసాగాయి. ఎందుకలా?

క్రౌడ్‌ స్ట్రైక్‌ (CrowdStrike) అప్‌డేట్‌ చేయడంతోనే సాంకేతిక సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రౌడ్‌ స్ట్రైక్‌ అనేది అమెరికాకు ఓ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు దిగ్గజ ఐటీ సంస్థలకు అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీని అందిస్తుంటుంది. కానీ, చైనాలో మాత్రం చాలా తక్కువ కంపెనీలే క్రౌడ్‌ స్ట్రైక్‌ను వినియోగిస్తున్నాయి. అది కూడా చైనా వేదికగా పని చేస్తున్న కొన్ని అమెరికా సంస్థలు మాత్రమే దీనిని వాడుతున్నాయి. దీంతో ఈ సమస్య చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు.

మరో ప్రధాన కారణం ఏమంటే.. చైనాలోని మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీసులను స్థానిక భాగస్వామి అయిన 21 వయానెట్‌ నిర్వహిస్తోంది. చైనా నిబంధనల ప్రకారం.. గ్లోబల్‌ క్లౌడ్‌ సర్వీసులను అక్కడి స్థానిక సంస్థలే నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సేవలను 21వయానెట్‌కు అప్పగించింది.అందువల్ల మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాలు మిగతా దేశాలతో పోలిస్తే చైనాలో భిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా ఇతర దేశాల్లో సైబర్‌ ముప్పుగానీ, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వాటి ప్రభావం దేశంపై పడకుండా చైనా సొంతంగా పటిష్ఠ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. ఈ కారణం వల్లేనే సాంకేతిక సమస్యతో ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అయినా చైనాలో దానిప్రభావం నామమాత్రంగానే ఉంది.

పర్సనల్ కంప్యూటర్లలోనూ సమస్య లేదు ఎందుకు?

విండోస్‌లో తలెత్తిన క్రౌడ్‌ స్ట్రైక్‌ సమస్య ప్రపంచ వ్యాప్తంగా 8.5 మిలియన్ల కంప్యూటర్లపై పడినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. వందలాది మంది ఇంజినీర్లను, నిపుణులను వినియోగదారుల దగ్గరికి వెళ్లి సేవలు పునరుద్ధరించేలా కృషి చేసినట్లు తెలిపింది. ఈ మేరకు తన అధికారిక బ్లాగ్‌లో రాసుకొచ్చింది. అయితే, విమాన సర్వీసులతోపాటు.. వివిధ వ్యాపారాలను స్తంభింపజేసిన ఈ సమస్య.. పర్సనల్‌ కంప్యూటర్లలో మాత్రం కనిపించలేదు. దానికి గల కారణాలను సాంకేతిక నిపుణులు వివరించారు. క్రౌడ్‌ స్ట్రైక్‌ సెక్యూరిటీని ప్రముఖ ఐటీ సంస్థలు, సైబర్‌ దాడుల ముప్పు నుంచి పొంచి ఉండే కీలక సంస్థలే ఉపయోగిస్తాయి. పర్సనల్‌ కంప్యూటర్లలో క్రౌడ్‌ స్ట్రైక్‌ ఉపయోగించేవాళ్లు చాలా తక్కువ. అందుకే పీసీలపై దీని ప్రభావం కనిపించలేదని నిపుణులు వెల్లడించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...