psycopk Posted August 9, 2024 Report Posted August 9, 2024 YSRCP: ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి నేడు బెంగళూరుకు మాజీ సీఎం జగన్! 09-08-2024 Fri 07:02 | Andhra మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి పర్యటన ముగిసిన తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. వైఎస్ జగన్ ఎందుకు బెంగళూరు వెళ్తున్నారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే మూడు నాలుగు రోజులపాటు అక్కడే బస చేయవచ్చునని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పదేపదే బెంగళూరు వెళ్లడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదివరకు రెండు సార్లు జగన్ బెంగళూరు వెళ్లి రావడం గమనార్హం. ఇదిలావుంచితే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కొందర్నిని బెంగళూరులో క్యాంపునకు తరలించిన విషయం తెలిసిందే. Quote
psycopk Posted August 9, 2024 Author Report Posted August 9, 2024 https://www.instagram.com/reel/C-cDTBlpoZe/?igsh=MWVva3FydzNtamU1dw== Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.