Jump to content

Nista daridrudu gets permission for london tour


Recommended Posts

Posted

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ 

28-08-2024 Wed 07:22 | Both States
cbi court aproved to jagan uk trip
 

 

  • సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ కు ఊరట 
  • సెప్టెంబర్ 3 నుండి 25వరకూ జగన్ యూకే పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
  • పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని చెప్పిన న్యాయస్థానం
అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ నుండి 25వ తేదీ వరకూ యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు గానూ అనుమతి కోరుతూ వైఎస్ జగన్ ..15 రోజుల క్రితం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై విచారణ సందర్బంలో జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ అభ్యంతరం తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే సీబీఐ కోర్టు .. జగన్ కు షరతులతో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదే క్రమంలో జగన్ కు ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాస్ పోర్టు జారీకి కూడా సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
Posted

Nda no longer needs jaffa

Rajya Sabha: కీలక పరిణామం.. రాజ్యసభలో మెజారిటీ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ 

28-08-2024 Wed 07:06 | National
NDA crosses majority mark in Rajya Sabha
 

 

  • ఇటీవల 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో దక్కిన మెజారిటీ మార్క్
  • ప్రస్తుత మెజారిటీ మార్క్ 119 కాగా 121గా ఉన్న ఎన్డీయే బలం
  • బిల్లులు ఆమోదింపజేసుకునేందుకు మార్గం సుగమం
పెద్దల సభ అయిన రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటింది. ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో అధికార కూటమి మెజారిటీ మార్క్‌ను విజయవంతంగా దాటింది.

రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా ప్రస్తుతం 8 స్థానాలు ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థానాల్లో జమ్మూకశ్మీర్‌లో 4, మరో నాలుగు నామినేటెడ్ స్థానాలుగా ఉన్నాయి. ఇటీవల కొత్త సభ్యుల ఎన్నిక తర్వాత.. ఖాళీగా ఉన్న 8 స్థానాలను మినహాయిస్తే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 237గా ఉంది. ఇక మెజారిటీ సంఖ్య 119గా ఉంది. కొత్త సభ్యుల ఎన్నికతో ఎన్డీఏ ఈ ఫిగర్‌ను విజయవంతంగా దాటింది. ప్రస్తుతం ఎన్డీయే సభ్యుల సంఖ్య 121గా ఉంది. దీంతో పార్లమెంటు ఎగువ సభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం అయింది. కీలక చట్టాలు చేసే బలాన్ని అందిపుచ్చుకుంది.

ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కొత్తగా 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా గెలిపించుకోవడంతో సభలో బీజేపీ సంఖ్యా బలం 96కి పెరిగింది. ఎన్డీయే బలం 121, ప్రతిపక్షాల సభ్యుల సంఖ్య 85కి చేరుకుంది.
Posted
16 minutes ago, jpismahatma said:

Poni le va. Gelicharu kadha. Let him live bro.

No, we need crying 24/7 that is our duty. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...