psycopk Posted September 2, 2024 Author Report Posted September 2, 2024 Drone: విజయవాడలో వరద బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం... వీడియో ఇదిగో! 02-09-2024 Mon 20:29 | Andhra విజయవాడలో ఉప్పొంగిన బుడమేరు సింగ్ నగర్, తదితర ప్రాంతాలు నీట మునక రెండ్రోజులు గడుస్తున్నా తగ్గని వరద డ్రోన్ ద్వారా ఆహారం అందించే విధానాన్ని పరిశీలించిన చంద్రబాబు విజయవాడలో బుడమేరు ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడం తెలిసిందే. రెండ్రోజులు గడుస్తున్నా వరద తగ్గుముఖం పట్టకపోవడంతో, అజిత్ సింగ్ నగర్, తదితర కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఏపీ ప్రభుత్వం డ్రోన్ల సాయంతో ఆహారం అందిస్తోంది. ఇవాళ డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు సరఫరా చేసే విధానాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు వివరించిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం ఆమోదంతో, అధికారులు ఈ సాయంత్రం అజిత్ సింగ్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ పై ఉన్న ప్రజలకు డ్రోన్ ద్వారా ఆహారం అందించారు. ఫుడ్ ప్యాకెట్ సహా డ్రోన్ నిమిషం వ్యవధిలోపే అపార్ట మెంట్ పైకి చేరుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సోషల్ మీడియాలో పంచుకుంది. Quote
psycopk Posted September 2, 2024 Author Report Posted September 2, 2024 Jagan: పీకల్లోతు నీళ్లుంటే ఎవరైనా ఎలా ఇస్తారు?... జగన్ తో చెప్పిన యువతి... వీడియో వైరల్ 02-09-2024 Mon 20:52 | Andhra విజయవాడలో పర్యటించిన జగన్ సింగ్ నగర్ లో వరద బాధితులకు పరామర్శ సాయం అందలేదా? అంటూ వాకబు చేసిన వైసీపీ అధినేత మెడ వరకు నీళ్లున్నప్పటికీ, కొంతమందికి ఇచ్చారని వెల్లడించిన ఓ యువతి వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సాయం అందలేదని ధ్వజమెత్తారు. కాగా, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో, ఓ యువతి నిర్మొహమాటంగా సమాధానం చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..."మీకు ప్రభుత్వ సాయం అందిందా... ఇంకా అందలేదా?" అని జగన్ ఓ మహిళను అడగ్గా... పక్కనే ఉన్న యువతి స్పందిస్తూ... "నీళ్లు మెడ వరకు ఉన్నాయి... పాపం, వాళ్లయినా ఎలా ఇస్తారు? అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు" అని స్పష్టం చేసింది. ఈ వీడియోను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. Quote
psycopk Posted September 2, 2024 Author Report Posted September 2, 2024 KTR: చంద్రబాబు ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది... రేవంత్ ప్రభుత్వం చేసింది జీరో: కేటీఆర్ 02-09-2024 Mon 21:22 | Telangana తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపాటు ఏపీ సర్కారు 6 హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో సహాయ చర్యలు చేపడుతోందన్న కేటీఆర్ తెలంగాణలో ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో? అని ఎద్దేవా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చర్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. అదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పొరుగున ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 6 హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతోందని, కానీ ఇక్కడ తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో? అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం కాపాడింది 'బిగ్ జీరో' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపాటు వరదల నేపథ్యంలో సహాయక చర్యలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరదలో ఖమ్మంలో రాణి గారు, వారి ముగ్గురు పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. మధిర నుంచి వారి బంధువులు గజఈతగాళ్లని రప్పించి వారే ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే... ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలకు తెగించి తొమ్మిది మంది ప్రాణాలను కాపాడారన్నారు. ధైర్యం చెప్పి రక్షించాల్సిన మంత్రులు, చివరికి దేవుడే దిక్కు అని చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరద బాధితులకు రూ.25 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రజా సమస్యలు ఎత్తిచూపినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వరదలతో సతమతమవుతున్న ప్రజలు సాయం కోరితే లాఠీఛార్జ్ చేస్తారా? సిగ్గు తెచ్చుకోండి... సీఎంగారూ! అని మండిపడ్డారు. Quote
jalsa01 Posted September 2, 2024 Report Posted September 2, 2024 2 hours ago, psycopk said: Veedu elane undali matladali malli Malli... Next tym ki 11 Kuda raavu troll Cheste jagrathapadataadu Quote
Captain_nd_Coke Posted September 2, 2024 Report Posted September 2, 2024 11 hours ago, jalsa01 said: CBN should confine to office and let DM handle it vayya.. He should let officials deal with it and monitor closely IMO CM position is much more powerful to deal these things directly.. 1 visit per day to boost morale of public is more than enough.. This is why govt officials don't like him kinda micro management in IT terms Folks from vizag feel other way from hudhud days…. He being on the ground was proved to be effective in the past… him being there and doing what he does best in these times, is totally welcoming and need of the hour imo… at least that’s the way I see it Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.