Jump to content

Its not KTR or Chillar harish... Its KA paul that comes to hyd peoples rescue


Recommended Posts

Posted

KA Paul: కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్... హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

23-10-2024 Wed 22:05 | Telangana
KA Paul petition in Telangana High Court

 

  • నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని కేఏ పాల్ పిటిషన్
  • నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాకు ఆదేశం
  • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, హైడ్రాకు ఆదేశాలు

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా నగరంలో కూల్చివేతలు చేపడుతోందంటూ, ఈ కూల్చివేతలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయం చూసుకునే వరకు బాధితులకు సమయం ఇవ్వాలని తేల్చి చెప్పింది.

పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. మూసీ బాధితులకు ఇళ్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. అయితే, మూసీ బాధితులకు ఇళ్ళు కేటాయించిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నట్లు అడిషనల్ అడ్వోకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Posted

even BJP didnt come forward in this case//

Etela Rajender: చైతన్యపురిలో ఈటల రాజేందర్ ర్యాలీ... మొరపెట్టుకున్న మూసీ నిర్వాసితులు

23-10-2024 Wed 19:41 | Telangana
Etala Rajendar rally in Chaithanapuri

 

  • పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులను సమస్యలు అడిగి తెలుసుకున్న ఈటల
  • మీ పోరాటం వల్లే మా ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయని ఈటలతో చెప్పిన బాధితులు
  • ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తి లేదన్న బాధితులు

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని మూసీ నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూసీ పరీవాహక ప్రాంతంలోని వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులతో కలిసి ర్యాలీ కూడా తీశారు.

ఈ సందర్భంగా పలువురు బాధితులు ఈటలకు తమ బాధను మొరపెట్టుకున్నారు. మీరు చేసిన పోరాటం వల్లే మా ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయన్నారు. అయినప్పటికీ తమకు ఇళ్లు పోతాయేమోననే ఆందోళన ఉందని వాపోయారు. మూసీ సుందరీకరణ కంటే తమ ఇళ్లు తమకు ముఖ్యమని ఈటలతో చెప్పారు. 

ప్రభుత్వ బృందం సియోల్ వెళ్లి తెల్లటి నీళ్లు చూపిస్తోందని, ఇక్కడ కూడా అలా చేస్తే మూసీ పరీవాహక ప్రాంతం నుంచి తాము వెళ్లిపోవడానికి సిద్ధమని వారు ఈటలతో అన్నారు. ప్రభుత్వం పెట్టే టెన్షన్‌కు తమ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని వాపోయారు. కోట్లాది రూపాయలు ఇచ్చినా... తమ ప్రాణాలు పోయినా ఇళ్లలో నుంచి కదిలేది లేదన్నారు.
Posted

meanwhile mana budda lafangi super super busy with this case..

KTR: సమంత, నాగచైతన్య నావల్లే విడిపోయారంటూ సురేఖ అసహ్యంగా మాట్లాడారు: కోర్టులో కేటీఆర్ సుదీర్ఘ వాంగ్మూలం

23-10-2024 Wed 17:38 | Telangana
Nampally Court records KTR statement in Konda Surekha issue

 

  • ఫోన్ ట్యాపింగ్ చేశానని, డ్రగ్స్ తీసుకున్నానంటూ ఆరోపించారన్న కేటీఆర్
  • ఆమె చేసిన వ్యాఖ్యలు చెప్పాలంటే ఇబ్బందికరంగా ఉన్నాయన్న కేటీఆర్
  • బాధ్యత గల పదవిలో ఉండి తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్న కేటీఆర్

మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని, వివరంగా ఆమె అన్న మాటలు చెప్పమంటే చెబుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సమంత, నాగచైతన్య తన వల్లే విడిపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేశారని వెల్లడించారు. కొండా సురేఖపై పరువునష్టం దావాకు సంబంధించి ఈరోజు కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

మంత్రి కొండా సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఫిర్యాదులో అన్ని విషయాలు ఉన్నాయని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దానినే ప్రామాణికంగా తీసుకోమంటారా? లేక మళ్లీ స్టేట్‌మెంట్ ఇస్తారా? అని కోర్టు ప్రశ్నించింది.

కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయన్నారు. వివరంగా చెప్పడానికి సిద్ధమే అన్నారు. ఈ సందర్భంగా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కొన్నింటిని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేశానని, తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేసినట్లు చెప్పారు. ఇతరులు డ్రగ్స్ తీసుకునేలా తాను ప్రేరేపించినట్లు చెప్పారన్నారు. తన వల్లే కొన్ని పెళ్లిళ్లు బ్రేక్ అయినట్లుగా కూడా వ్యాఖ్యలు చేశారన్నారు.

ఆమె చేసిన వ్యాఖ్యలు చదవాలంటేనే ఇబ్బందికరంగా ఉందని కేటీఆర్ కోర్టుకు తెలిపారు. ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. నోటితో అన్నీ చెప్పలేని విధంగా ఉన్నాయన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్నారు.

సాక్షులు దాసోజు శ్ర‌వ‌ణ్, బాల్క సుమ‌న్, స‌త్య‌వ‌తి రాథోడ్ తనకు పద్దెనిమిదేళ్లుగా తెలుసునని... కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌ను టీవీలో చూసి వాళ్లు తనకు ఫోన్ చేసి చెప్పారని కోర్టుకు తెలిపారు. సురేఖ వ్యాఖ్య‌ల‌తో తన ప‌రువు, ప్ర‌తిష్ట దెబ్బ‌తిన్నాయన్నారు. తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి న‌ష్టం చేయాల‌ని ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. కోర్టు అరగంట పాటు కేటీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అనంతరం కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
Posted
1 hour ago, psycopk said:

Tg boys sound ledu enti??

Revanth mee odi sishudu ye kada…

 

Posted

Pual annaki stopped third world wars  so ido lekka .. Musi River encroachers and its mafia should vote for KA Paul now..

  • Haha 1
Posted
1 hour ago, Joker_007 said:

Pual annaki stopped third world wars  so ido lekka .. Musi River encroachers and its mafia should vote for KA Paul now..

images?q=tbn:ANd9GcQo9RfBIMavOsxUkF_lg2A

Posted

Revanth gadu next time Kodangal lo geluste chudham.. Congress gallani vurikinchi kodataru next time.. Chudham enni years vuntaro power lo. Worst scum is Congress

Posted
19 hours ago, psycopk said:

even BJP didnt come forward in this case//

Etela Rajender: చైతన్యపురిలో ఈటల రాజేందర్ ర్యాలీ... మొరపెట్టుకున్న మూసీ నిర్వాసితులు

23-10-2024 Wed 19:41 | Telangana
Etala Rajendar rally in Chaithanapuri

 

  • పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులను సమస్యలు అడిగి తెలుసుకున్న ఈటల
  • మీ పోరాటం వల్లే మా ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయని ఈటలతో చెప్పిన బాధితులు
  • ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తి లేదన్న బాధితులు

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని మూసీ నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూసీ పరీవాహక ప్రాంతంలోని వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులతో కలిసి ర్యాలీ కూడా తీశారు.

ఈ సందర్భంగా పలువురు బాధితులు ఈటలకు తమ బాధను మొరపెట్టుకున్నారు. మీరు చేసిన పోరాటం వల్లే మా ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయన్నారు. అయినప్పటికీ తమకు ఇళ్లు పోతాయేమోననే ఆందోళన ఉందని వాపోయారు. మూసీ సుందరీకరణ కంటే తమ ఇళ్లు తమకు ముఖ్యమని ఈటలతో చెప్పారు. 

ప్రభుత్వ బృందం సియోల్ వెళ్లి తెల్లటి నీళ్లు చూపిస్తోందని, ఇక్కడ కూడా అలా చేస్తే మూసీ పరీవాహక ప్రాంతం నుంచి తాము వెళ్లిపోవడానికి సిద్ధమని వారు ఈటలతో అన్నారు. ప్రభుత్వం పెట్టే టెన్షన్‌కు తమ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని వాపోయారు. కోట్లాది రూపాయలు ఇచ్చినా... తమ ప్రాణాలు పోయినా ఇళ్లలో నుంచి కదిలేది లేదన్నారు.

First of all randa ganni support chesi gelipinchina mundalani mingaali ade so called telugu tammullu. Ippudu asusual gaa accountability lekunda side ayithunnaru gaa, nakkas for reason raa thammullu.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...