ntr2ntr Posted October 28, 2024 Report Posted October 28, 2024 గోదావరిపై ఓవైపు బోటు విహారం.. మరోవైపు అక్కడే ఇష్టమైన ఆహారం తింటూ ఆస్వాదిస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! ఈ అనుభూతిని ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్’ ద్వారా పొందొచ్చు. రాజమహేంద్రవరంలో ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్’ 170 మంది కూర్చునేలా ఏర్పాట్లు ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్ రాజమహేంద్రవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గోదావరిపై ఓవైపు బోటు విహారం.. మరోవైపు అక్కడే ఇష్టమైన ఆహారం తింటూ ఆస్వాదిస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! ఈ అనుభూతిని ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్’ ద్వారా పొందొచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరిలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలోని బ్రిడ్జిలంక వద్ద ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. దీన్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ఆదివారం ప్రారంభించారు. స్థానిక పద్మావతి ఘాట్ సమీపంలోని టూరిజం కంట్రోల్ రూమ్ నుంచి బోటులో పయనించి.. గోదావరి మధ్యలోని ఇసుక తిప్పలను ఆనుకుని నీటిలో తేలియాడుతున్న ఈ రెస్టారెంట్ వద్దకు చేరుకోవాలి. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇది ఉంటుంది. ఇక్కడ వెజ్, నాన్వెజ్ రకాలు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్లో 170 మంది వరకు కూర్చునేలా సిట్టింగ్ సామర్థ్యం ఉంది. సిల్వర్ స్పూన్, ఆహ్వానం కిచెన్ ప్రాంచైజీస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ అండ్ మెయింట్నెన్స్ విధానంలో ఈ రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. దీని కోసం టూరిజం శాఖకు ఏడాదికి రూ.6.5 లక్షల ఆదాయం ఇవ్వనున్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి దుర్గేశ్ రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే సీఎం సంకల్పంలో భాగంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు. త్వరలో హేవలాక్ బ్రిడ్జి సమీపంలో కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి నదీ తీరాన్ని అందంగా తీర్చిదిద్దుతామన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.