Jump to content

Recommended Posts

Posted

 

Chandrababu-రోప్ వేలో శ్రీశైలం ఆలయం వద్దకు సీఎం చంద్రబాబు... మల్లన్న దర్శనం 

09-11-2024 Sat 16:12 | Andhra
CM Chandrababu offers prayers at Srisailam temple
 

 

  • విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ లో చేరుకున్న చంద్రబాబు
  • శ్రీశైలం ఆలయంలో చంద్రబాబుకు పూర్ణకుంభ స్వాగతం
  • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ లో ప్రయాణించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సీప్లేన్ డెమో లాంచ్ చేసిన చంద్రబాబు... ఆ సీప్లేన్ లోనే శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ్నించి రోప్ వే ద్వారా శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికాయి. చంద్రబాబు ఇక్కడి భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు చంద్రబాబుకు వేదాశీర్వచనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు సీఎంకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు పంచెకట్టులో ప్రత్యేకంగా కనిపించారు.
20241109fr672f3c4e30fe7.jpg20241109fr672f3c698edd0.jpg

 

 

Posted
Just now, Anta Assamey said:

Will try in my visit if it is open for public....torch.gif

I think it is now…

Posted

Kandula Durgesh: నేడు ఒక అద్భుతం ఆవిష్కృతమైంది: మంత్రి కందుల దుర్గేశ్ 

09-11-2024 Sat 15:29 | Andhra
Kandula Durgesh speech at Seaplane launching event in Hyderabad
 

 

  • విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ సర్వీస్
  • విజయవాడలో డెమో లాంచ్ చేసిన చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు
  • ఇదొక వినూత్న కార్యక్రమం అంటూ టూరిజం మంత్రి దుర్గేశ్ వ్యాఖ్యలు
ఏపీ టూరిజం చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం నమోదైంది. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ సర్వీస్ ను ప్రారంభించారు. ఈ డెమో కార్యక్రమంలో ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవాళ ఇక అద్భుతాన్ని ఆవిష్కరించిన సందర్భం అని అభివర్ణించారు. 

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే, నిరంతరం అనేక సంస్కరణలు చేపడుతూ... సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏకకాలంలో ముందుకు తీసుకెళుతున్న సీఎం చంద్రబాబు కీర్తికిరీటంలో ఈ సీప్లేన్ ఒక కలికితురాయి అని పేర్కొన్నారు. 

"మనం జలయానం చేశాం, ఆకాశ యానం చేశాం... ఇవాళ మనం జలంతో పాటు, ఆకాశంలోనూ ప్రయాణించే వినూత్న కార్యక్రమం ప్రారంభించుకున్నాం. జలమార్గం ద్వారా ఆకాశమార్గంలోకి ప్రయాణించడం అనే ఈ సీ ప్లేన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం కేంద్ర విమానయాన శాఖకు, ఏపీ టూరిజం శాఖకు గర్వకారణం. 

ఏపీకి 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉంది. కృష్ణా, గోదావరి, పెన్నా వంటి జీవనదులు మనకున్నాయి. దాంతో పాటు అటవీప్రాంతం, ప్రకృతి రమణీయత ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ గడచిన ఐదేళ్లలో ఏపీ పర్యాటక రంగాన్ని సమూలంగా నాశనం చేసిన ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూశాం. 

ఇవాళ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో, ఆయనకు సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో... ఏపీ టూరిజంను మళ్లీ పట్టాలెక్కించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా సహకారం అందిస్తున్నారు. ఈ సీ ప్లేన్ కార్యక్రమాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం" అని వివరించారు.
Posted

 

Chandrababu: శ్రీశైలం పర్యటన ముగించుకుని తిరిగి సీ ప్లేన్ లో విజయవాడ చేరుకున్న సీఎం చంద్రబాబు 

09-11-2024 Sat 19:10 | Andhra
CM Chandrababu returns to Vijayawda in Seaplane from Srisailam
 

 

  • ఏపీ టూరిజం అభివృద్ధికి చర్యలు
  • విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలు
  • నేడు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ లో ప్రయాణించిన సీఎం
ఏపీ టూరిజంను కొత్త పుంతలు తొక్కించడంలో భాగంగా, నేడు సీ ప్లేన్ డెమో లాంచ్ చేశారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ లో ప్రయాణించారు. చంద్రబాబు శ్రీశైలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

శ్రీశైలం పర్యటన ముగిసిన అనంతరం చంద్రబాబు... తిరిగి అదే సీ ప్లేన్ లో ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు. సీ ప్లేన్ ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నదిపై ల్యాండైంది. 

కాగా, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ టూరిజం పాలసీని ప్రకటిస్తామని వెల్లడించారు. సీ ప్లేన్ సర్వీసులకు భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. ల్యాండింగ్, టేకాఫ్ కూడా నేలపై కంటే నీటిలోనే బాగుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకానికి అనువైన ప్రదేశాలు ఎన్నో ఉన్నప్పటికీ మార్కెటింగ్ చేసుకోవడంలో మనం విఫలమయ్యామని తెలిపారు. 

అందమైన ప్రకృతి ఉండే ప్రదేశాల కోసం చాలామంది ఫారెన్ వెళుతున్నారని, ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఆదాయం పెరుగుతుందని అన్నారు. 

కాగా, విజయవాడలో సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి జనార్ధన్ రెడ్డి, పౌరవిమానయాన శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. 

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...