Jump to content

Recommended Posts

Posted

YS Sharmila: జగన్ ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి: చంద్రబాబుకు షర్మిల లేఖ

25-11-2024 Mon 17:41 | Andhra
YS Sharmila letter to Chandrababu

 

  • అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న షర్మిల
  • అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెను భారమన్న షర్మిల
  • అర్ధరాత్రి అనుమతులు ఇవ్వడంపై దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్

అదానీ కంపెనీలకు జగన్ అనుమతులు ఇవ్వడం మీద దర్యాఫ్తు జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. అదానీతో మాజీ సీఎం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు  చేయాలని ఆ లేఖలో కోరారు. అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెను భారం అన్నారు.

గత ప్రభుత్వం హయాంలో అర్ధరాత్రి అనుమతులు ఇవ్వడం ఎందుకో దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ డీల్ కారణంగా పాతికేళ్లపాటు ప్రజలపై లక్షన్నర కోట్ల రూపాయల భారం పడుతోందన్నారు. అదానీతో జరిగిన ఒప్పందాలను రద్దు చేసి, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సూచించారు.

నాడు జరిగిన ఒప్పందాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గంగవరం పోర్టును అదానీ కంపెనీకి అప్పగించడంపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
Posted

PV Ramesh: జగన్ హయాంలో విద్యుత్ రంగం నాశనమయింది.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: రిటైర్ట్ ఐఏఎస్ అధికారి రమేశ్

25-11-2024 Mon 15:32 | Andhra
Retd IAS PV Ramesh on Jagan power purchase deals

 

  • 2019లో 23 పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలను రద్దు చేశారన్న రమేశ్
  • 2023లో ఒక సంస్థకు చెందిన 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారని వెల్లడి
  • ఈ ఒప్పందం విద్యుత్ సంస్థల సామర్థ్యాన్ని దెబ్బతీసిందని వ్యాఖ్య

ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీలో విద్యుత్ రంగం కకావికలమయిందని రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ...  2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం 23 పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలను రద్దు చేసిందని ఆయన అన్నారు. వాటి ఉత్పత్తి సామర్థ్యం 2,132 మెగావాట్లు అని తెలిపారు. అదే ప్రభుత్వం 2021 డిసెంబర్ లో సెకి ద్వారా ఒక సంస్థకు చెందిన 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. 

ఈ రెండు సందర్భాల్లో తమ బాస్ అయిన ముఖ్యనేతకు భారీ లబ్ధి చేకూర్చడంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలకపాత్రను పోషించారని పీవీ రమేశ్ తెలిపారు. ఈ ఒప్పందం విద్యుత్ సంస్థల సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పారు. ఈ ఒప్పందం కారణంగా వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్ ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. ఈ ఒప్పందంపై సమగ్ర విచారణ జరపాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Posted

Gone Prakash Rao: జగన్ పని అయిపోయినట్టే.. మోదీ కూడా కాపాడలేరు: గోనె ప్రకాశ్ రావు

25-11-2024 Mon 16:17 | Andhra
Jagan chapter is closed says Gone Prakash Rao

 

  • అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్ ఇరుక్కున్నారన్న గోనె ప్రకాశ్ రావు
  • అదానీ, జగన్ ఇద్దరూ అరెస్ట్ అవుతారని వ్యాఖ్య
  • న్యూయార్క్ టైమ్స్ లో కూడా కథనం వచ్చిందన్న గోనె

సౌర విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా అదానీ ముడుపుల వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా ఇరుక్కున్నారని సీనియర్ రాజకీయ నేత గోనె ప్రకాశ్ రావు అన్నారు. ఆ కేసు నుంచి జగన్ బయటపడే అవకాశమే లేదని చెప్పారు. లంచం కేసులో అదానీ, జగన్ ఇద్దరూ అరెస్ట్ అవుతారని అభిప్రాయపడ్డారు. వీరిద్దరి అరెస్ట్ ను ప్రధాని మోదీ కూడా ఆపలేరని చెప్పారు. 

న్యూయార్క్ టైమ్స్ లో దీనికి సంబంధించిన కథనం వచ్చిందని... ఆ పత్రికలో కథనం వస్తే కథ ముగిసినట్టేనని అన్నారు. వీరిద్దరినీ తమకు అప్పజెప్పాలని అమెరికా కోరుతుందని... మోదీ కూడా దీన్ని ఆపలేరని చెప్పారు. అయితే దీనికి మూడు నెలలు పడుతుందా? లేదా ఆరు నెలలు పడుతుందా? అనేది చెప్పలేమని అన్నారు.

ఏపీలో సోలార్ పవర్ కొనుగోళ్ల కోసం అదానీ లంచాలు ఇచ్చారంటూ అమెరికా కోర్టులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. జగన్ కు రూ. 1,750 కోట్ల ముడుపులు అందాయనే విషయాన్ని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై మాట్లాడుతూ గోనె ప్రకాశ్ రావు పైవ్యాఖ్యలు చేశారు. 
Posted

Harish Rao: అదానీ రూ.100 కోట్లు తిరస్కరించిన రేవంత్ రెడ్డి... స్పందించిన హరీశ్ రావు

25-11-2024 Mon 18:52 | Telangana
Harish Rao responds on Revanth Reddy rejecting adani funds

 

  • దావోస్‌లో రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేసిన హరీశ్ రావు
  • అదానీకి డిస్కంలను అప్పగించి ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శ
  • రాహుల్ గాంధీ అవినీతిపరుడు అంటున్న అదానీతోనే రేవంత్ దోస్తీ చేస్తున్నాడన్న హరీశ్ రావు

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు.

స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సరే, మరి అదానీ అవినీతి మీద రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్నారని, ఆ సమయంలోనే మీరు దావోస్‌లో అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్న సంగతేమిటి? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి? నిలదీశారు. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనతో అదానీ వస్తే, తాము మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ అవినీతిపరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ (తెలంగాణ కాంగ్రెస్) రెడ్ కార్పెట్ పరిచిందని విమర్శించారు.

ఢిల్లీలో అదానీకి వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేస్తుంటే... అదే అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడని, ఇప్పుడు అదానీ అవినీతి బయటికి రాగానే మాట మార్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల‌న్నింటినీ ర‌ద్దు చేయాల‌ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...