Jump to content

Recommended Posts

Posted

YS Sharmila: అందుకు వైఎస్ జగన్‌కి ఆస్కార్ ఇవ్వాలి.. దమ్ముంటే ఆయ‌న‌ సవాల్‌ను స్వీకరించాలి.. ష‌ర్మిల ఆస‌క్తిక‌ర ట్వీట్‌! 

29-11-2024 Fri 13:06 | Andhra
 
YS Sharmila Slams YS Jagan Once Again

 

  • మ‌రోసారి సెకీ ఒప్పందం విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా జ‌గ‌న్‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు
  • అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎంకు ఆస్కార్ ఇవ్వాల‌ని ఎద్దేవా
  • అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేద‌ని బైబిల్ మీద ప్రమాణం చేయాలంటూ స‌వాల్‌
మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మ‌రోసారి 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. 

“2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, తమరు రూ 2.49 పైసలకు కొన్నందుకు శాలువాలు కప్పాలా ? అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా? అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ? 

ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదు ? రూ.2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు ? ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ రూ.1.70 పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా ? ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా ? దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.

నిజమే.. అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర. అదానీ కలవడం ఒక చరిత్ర. రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్ర. ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్ర. గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర. ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర.  ప్రపంచం మొత్తం ఇప్పుడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర. భూగోళం అవినీతి పరుల జాబితాలో మీపేరు చేరడం మీకు పెద్ద చరిత్ర.

అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ లో నాపేరు ఎక్కడుందని బుకాయించే జగన్... ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా.. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా..? ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు. అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు ఎఫ్‌బీఐ, ఎస్ఈసీ స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయి. సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ.1750 కోట్లు ఏపీ చీఫ్ మినిస్టర్‌కి ఇచ్చారని తమ దర్యాప్తు లో కుండబద్దలు కొట్టాయి. ముడుములు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని ఓ వంద పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాయి. వివిధ సోర్స్ ల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సమీకరించాం అని రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నాయి.

గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్‌ చేసుకుందని, రూ.35వేల కోట్ల భారం వేసిందని చెప్పే మీరు..అధికారంలోకి వచ్చాక  గాడిదలు కాశారా ? టెండర్లు రద్దుతో ఎందుకు సరిపెట్టారు ? ఎందుకు విచారణ జరిపించలేదు ? లాంగ్ స్టాండ్ ఒప్పందాలతో నష్టమని తెలిసి అదానీకి 25 ఏళ్లు రాష్ట్రానికి తాకట్టు పెట్టినప్పుడే మీకెంత ముట్టాయో అర్ధమవుతోంది. గంగవరం పోర్టును అడ్డికి పావుసేరు లెక్కన రూ.640 కోట్లకే అమ్మినప్పుడే మీ ముడుపుల బంధం ఏపాటితో తెలిసిపోయింది. రాష్టాన్ని బ్లాంక్ చెక్కులా  అదానీకి కట్టబెట్టినప్పుడే మీ వాటాల సంగతి తేలిపోయింది. 

నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి ఈ సవాల్‌ను స్వీకరించాలి” అని షర్మిల ట్వీట్ చేశారు.
Posted

Balineni Srinivasa Reddy: నువ్వు తప్పు చేసి, ప్రజలు తప్పు చేశారంటున్నావ్.. 11 సీట్లు వచ్చినా మార్పు రాలేదు: జగన్ పై బాలినేని ఫైర్ 

29-11-2024 Fri 12:16 | Andhra
 
After getting 11 seats also Jagan not changed says Balineni Srinivas

 

  •  రేవంత్ పార్టీకి వెళ్లిన 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదన్న బాలినేని
  • నన్ను వైసీపీ నుంచి తీసేసి ఉంటే ఇప్పుడు మంత్రిగా ఉండేవాడినని వ్యాఖ్య
  • జగన్ పాలనలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారన్న బాలినేని
వైసీపీ అధినేత జగన్ తీరుపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పార్టీ ఇచ్చారని.. ఆ పార్టీకి వెళ్లినవారికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని చెప్పారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తన గన్ మెన్లను సరెండర్ చేసి, 'నాకు అది చేయలేదు ఇది చేయలేదు' అని చెప్పినా తనను వైసీపీ నుంచి తీసేయలేదని... తీసేసి ఉంటే వేరే పార్టీ తరపున పోటీ చేసి ఈరోజు మంత్రి అయ్యుండేవాడినని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో మాట్లాడానని... ఆయన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా మంత్రిని కూడా చేస్తానని చెప్పారని వెల్లడించారు.

జగన్ కేసులు, బెయిల్ గురించి ఆయన మాట్లాడుతూ... తప్పు చేసి ఉంటే శిక్ష కచ్చితంగా అనుభవిస్తారని బాలినేని చెప్పారు. ప్రజలకు జగన్ కొన్ని పథకాలు ఇచ్చారని... ఆ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాతో జగన్ ఉన్నారని... అదే సమయంలో కార్యకర్తలను విస్మరించారని, వారిని పక్కన పెట్టేశారని... వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. అందుకే వైనాట్ 175, వైనాట్ కుప్పం నుంచి... చివరకు 11 సీట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ లో రియలైజేషన్ రాలేదని... కార్యకర్తలను బాగా చూసుకుంటాననే ఒక్క మాట కూడా ఆయన నుంచి రాలేదని విమర్శించారు. 

ప్రజలు తప్పు చేశారనే విధంగా జగన్ మాట్లాడుతున్నారని... ప్రజలు ఎందుకు తప్పు చేస్తారని బాలినేని ప్రశ్నించారు. నువ్వు తప్పు చేస్తే... ప్రజలు కూడా తప్పు చేస్తారని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో నాలుగు సార్లు, ఐదు సార్లు సీఎంగా ఉన్నవారు ఉన్నారని... వాళ్లెందుకు అన్ని సార్లు సీఎం అయ్యారని ప్రశ్నించారు. నువ్వు మంచి చేస్తే ఎందుకు ఓడిపోతావని వ్యాఖ్యానించారు. 

విజయమ్మ, షర్మిలతో పాటు ఇతరులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తున్న అంశంపై జగన్ మాట్లాడుతూ... మా వాళ్లను అరెస్ట్ చేస్తారా? మళ్లీ నేనే సీఎం అవుతాను... మీ అందరి సంగతి చూస్తానంటూ పోలీసులను, అధికారులను బెదిరిస్తున్నారని... జగన్ మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు బాలినేని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆయనను ప్రజలు నమ్మాలి కదా? అని అన్నారు. జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని... ఓటు ఎవరికి వేశారని సర్వేలు చేసేవారు అడిగినా ప్రజలు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. వైసీపీకి ఓటు వేయలేదని చెపితే తమను ఏం చేస్తారో అని భయపడే పరిస్థితి ఉండేదని అన్నారు. 

అందరూ తనవల్లే గెలిచారని జగన్ చెప్పుకునేవారని... ఇప్పుడు అందరూ ఓడిపోయారని, వాళ్లంతా జగన్ వల్లే ఓడిపోయినట్టే కదా? అని బాలినేని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జగన్ ఒప్పుకోవాలి కదా? అని అన్నారు. ఈ విషయాన్ని ఒప్పుకోకుండా ప్రజలు తప్పు చేశారని అంటున్నారని ఎద్దేవా చేశారు.
Posted

Anagani Sathya Prasad: జగన్ కు ఈ అవార్డులన్నీ ఇవ్వొచ్చు: మంత్రి అనగాని సత్యప్రసాద్ 

29-11-2024 Fri 18:51 | Andhra
 
Minister Anagani Satya Prasad satires on Jagan over Adani issue

 

  • జగన్-అదానీ అంశంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందన
  • జగన్ నిజాన్ని ఒప్పుకోకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శలు
  • అవార్డుల జాబితాతో ప్రకటన విడుదల చేసిన మంత్రి 
జగన్ రెడ్డి... అదానీ విద్యుత్ కుంభకోణం కేసులో మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. 

అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర ప్రజల నెత్తిన రెండు లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ రెడ్డి... నిజాన్ని ఒప్పుకోకుండా... తానేదో తక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నానని, అందుకు తనకు బిరుదులు, అవార్డులు కూడా ఇవ్వొచ్చంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 

"జగన్ రెడ్డికి నిజంగానే అవార్డులు, బిరుదులు ఇవ్వొచ్చు. తన అవినీతి సామ్రాజాన్ని అంతర్జాతీయ స్తాయికి తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో  అవినీతి పరుడిగా పేరు సంపాదించినందుకు ‘ఇంటర్నేషనల్ క్రిమినల్’ అనే అవార్డు ఇవ్వొచ్చు.  ప్రజా రాజధాని అమరావతి పై హామీని తుంగలో తొక్కినందుకు, హామీలు ఇచ్చి ప్రజలను మోసిగించినందుకు ‘నమ్మక ద్రోహి’ అనే అవార్డు కచ్చితంగా ఇవ్వాల్సిందే. 

ఆర్ధిక నేరగాడిగా జైలు శిక్ష అనుభవించి  దేశంలోనే అందరి కన్నా ఎక్కువ కాలం బెయిల్ పైన బయట ఉన్న వ్యక్తిగా ‘ బెయిల్ పక్షి’ అనే బిరుదు ఇవ్వాల్సిందే. పదే పదే అబద్ధాలు చెబుతూ... చెయ్యని, చేయలేని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డికి ‘పిట్టల దొర’ టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. 

సిగ్గు లజ్జా ఉన్న ఏ వ్యక్తి కూడా చేయని విధంగా సొంత చెల్లెళ్లనే రోడ్ల మీదకు ఈడ్చి వారి పరువు తీసే లాగా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టించి, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడినందుకు ‘ఆంధ్ర భ్రష్ట రత్న’ అవార్డు ఇవ్వొచ్చు. తన ఐదేళ్ల పాలనలో హత్యలు, దాడులతో హడలెత్తించినందుకు  ‘నరరూప రాక్షసుడు’ బిరుదు సరిగ్గా సరిపోతుంది" అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. 

ఈ మేరకు ఆయన నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...