Jump to content

New year ki motha mogiya nunna KTR


Recommended Posts

Posted

KTR: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట 

20-12-2024 Fri 17:28 | Telangana
KTR gets relief in TG High Court

 

  • ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ కు రిలీఫ్
  • 10 రోజుల వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం
  • ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ కు ఆదేశాలు
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది.

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 
Posted

Revanth Reddy: కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ. 600 కోట్లు: రేవంత్ రెడ్డి 

20-12-2024 Fri 17:17 | Telangana
KTR agreement value is Rs 600 Cr says Revanth Reddy

 

  • ఈ-కార్ రేసింగ్ ప్రతినిధులు తనను కలిశారన్న రేవంత్
  • రూ. 600 కోట్ల డబ్బులు రావాల్సి ఉందని చెప్పారన్న సీఎం
  • తానను జాగ్రత్త పడటం వల్ల రూ. 450 కోట్లు మిగిలాయని వ్యాఖ్య
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పై శాసనసభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టంచారు. స్పీకర్ పోడియంలోకి కూడా దూసుకుపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పై చర్చించాలని ఇంతకాలం కేటీఆర్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. 

ఈ-కార్ రేసింగ్ ప్రతినిధులు తనను కలిశారని... రూ. 600 కోట్ల పెండింగ్ నిధులు రావాల్సి ఉందని... వాటిని ఇవ్వాలని అడిగారని రేవంత్ చెప్పారు. మీరు ఓకే అంటే మరోసారి రేసింగ్ నిర్వహిస్తామని చెప్పారని తెలిపారు. ఎఫ్ఈవో ప్రతినిధులు తనను కలిసిన తర్వాతే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. 

కార్ రేస్ నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం రూ. 600 కోట్ల విలువైనదని రేవంత్ అన్నారు. పెండింగ్ డబ్బుల కోసం నిర్వాహకులు తన వద్దకు వచ్చినప్పుడే ఆ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తాను జాగ్రత్త పడటం వల్ల రూ. 450 కోట్లు మిగిలాయని అన్నారు. ఈ విషయంపై ఏసీబీ విచారణ జరుగుతోందని అన్నారు. కేటీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోందని... అందువల్ల తాను ఎక్కువ మాట్లాడడంలేదని చెప్పారు.
Posted

950 కోట్లు ఉందంట BRS పార్టీ ఫండు... The richest regional party in the country.

దాన్లో నుంచి తీసి ఇచ్చేస్తాడు KTR.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...