Jump to content

Recommended Posts

Posted

Narendra Modi: మోదీకి ఘనస్వాగతం పలికిన చంద్రబాబు, పవన్... రోడ్ షో ప్రారంభం... ఫొటోలు, వీడియో ఇవిగో 

08-01-2025 Wed 17:08 | Andhra
Modi and Chandrababu road show begins in Vizag
 

 

  • విశాఖలో మోదీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం
  • సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు రోడ్ షో
  • రూ. 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. 

అనంతరం సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు రోడ్ షో ప్రారంభమయింది. ఈ రోడ్ షోలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొంటున్నారు. రోడ్డుకు ఇరువైపుల నిల్చున్న ప్రజలకు ప్రధాని అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈనాటి కార్యక్రమం సందర్భంగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రైల్వేజోన్, ఇండస్ట్రియల్ హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ లకు శంకుస్థాపన చేయనున్నారు.
20250108fr677e6236c1372.jpg20250108fr677e6242b5cb4.jpg20250108fr677e62532c017.jpg20250108fr677e6264a090d.jpg
  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    23

  • pichhipullayya

    3

  • lollilolli2020

    1

  • Polavaram

    1

Popular Days

Posted

Narendra Modi: కాసేపట్లో విశాఖకు ప్రధాని మోదీ... బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్న చంద్రబాబు 

08-01-2025 Wed 16:03 | Andhra
Modi will arrive Visakha shortly
 

 

  • విశాఖలో మోదీ పర్యటన
  • రోడ్ షో, సభకు హాజరుకానున్న ప్రధాని
  • రూ.2 లక్షల కోట్ల విలువైన పనులకు వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం విశాఖలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఆయన విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు మోదీ విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయంలో ప్రధానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నమే విశాఖ చేరుకోగా... చంద్రబాబు కూడా కొద్ది సేపటి క్రితమే బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్నారు.

సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు ప్రధాని రోడ్ షో ఉంటుంది. ప్రధానితో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే ఈ రోడ్ షో... సిరిపురం సెంటర్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ వరకు నిర్వహించనున్నారు. రోడ్ షో అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. 

ఈ సభ సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు జరగనుంది. 6.50 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజి మైదానం నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు బయల్దేరతారు. రాత్రి 7.15 గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్ పయనమవుతారు. విశాఖలో మోదీ పర్యటన 3 గంటల పాటు సాగనుంది. 

విశాఖ సభ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పనుల విలువ సుమారు రూ.2 లక్షల కోట్లు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన పరిపాలనా భవనం, ఇండస్ట్రియల్ హబ్, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూడిమడకలో ఏర్పాటయ్యే గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ తదితర ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేయనున్నారు. 

దేశంలోని పలు జాతీయ రహదారులు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీ నగర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు రైల్వే లైన్లు, గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు.
Posted

Modi Road Show: విశాఖ రోడ్లపై పూలవర్షం కురుస్తుండగా... సభా వేదిక చేరుకున్న మోదీ, చంద్రబాబు, పవన్ 

08-01-2025 Wed 17:42 | Andhra
Modi road show arrives AU Engineering College in Visakha
 

  

విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ త్రయం ఎక్కిన ప్రత్యేక వాహనం నిదానంగా ముందుకు సాగుతుండగా... ప్రజలు పూలవర్షం కురిపించారు. 

సిరిపురం సెంటర్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజి వరకు రోడ్డుకు ఇరువైపులా జనం పోటెత్తారు. ఎన్నికల వేళ ఇదే త్రయం విజయవాడలో నిర్వహించిన భారీ రోడ్ షోను తలదన్నేలా నేడు విశాఖలో రోడ్ షో జరిగింది. 

ఎన్డీయే కూటమి గెలిచాక ప్రధాని మోదీ తొలిసారి ఏపీ వచ్చిన నేపథ్యంలో... ప్రధాని పర్యటనను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అడుగడుగునా విజయోత్సాహం ప్రతిబింబించేలా భారీ ఏర్పాట్లతో రోడ్ షో ఏర్పాటు చేసింది. 

కాగా, మోదీ, చంద్రబాబు, పవన్ వాహనం నేరుగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలోకి ప్రవేశించింది. సభకు విచ్చేసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముగ్గురు నేతలు ముందుకు సాగారు. ఇక, ఈ సభ ద్వారా మోదీ ఏపీకి సంబంధించిన అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
Posted

bodi gadu enduku ochchindu anta malla ituka cement gift ga ivvadanika ani 

Posted

bob gari mokan chusi ayina edo oka chinna package jebu lo petti po vayya bodi brahmi-bramhi.gif

 

20250108fr677e6264a090d.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...