Jump to content

Recommended Posts

Posted

Krishna water: కృష్ణా జలాల విషయంలో ట్రైబ్యునల్ కీలక నిర్ణయం

16-01-2025 Thu 21:14 | Both States
Brijesh Tribunal decesion on Krishna water

 

  • విభజన చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం వాదనలు వింటామన్న బ్రిజేష్ ట్రైబ్యునల్
  • 811 టీఎంసీలలో రెండు రాష్ట్రాల వాటాను తేల్చడం ముఖ్యమని వెల్లడి
  • ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామన్న బ్రిజేష్ ట్రైబ్యునల్

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు టర్మ్ ఆఫ్ రెఫరెన్స్‌పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై తొలుత వాదనలు వింటామని తెలిపింది.

811 టీఎంసీలలో రెండు రాష్ట్రాల వాటాను తేల్చడం ముఖ్యమని ట్రైబ్యునల్ పేర్కొంది. మూడో సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాలకు కేటాయింపులపై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని తెలిపింది. ఆ తర్వాత 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
Posted

decision edi aaina..

trs- cbn ki state takatu petina revant.. raitula notlo matti kotadu.. mem adikaram loki ragane denini review cheyistam..

ycp- hyd lo astulu kapadukotaniki.. AP bhavishyatu takatu petina cbn.. mem adikaram loki vachaka... aa water anta ycp companies and leaders lands ki vache la pranalika rasukoni vastam..

  • Upvote 1
Posted

Endi anna two states divide ayina nee kasi poleda tra pina always eve postula 

 

nuvu aha panini malina eenadunpaper chaduvdu bandh Cheyu 

india lo unnavallu vabbè unnaru 

Posted
34 minutes ago, fasak_vachadu said:

Endi anna two states divide ayina nee kasi poleda tra pina always eve postula 

 

nuvu aha panini malina eenadunpaper chaduvdu bandh Cheyu 

india lo unnavallu vabbè unnaru 

bookmark chesi petuko... ee thread ni... trs vallu enta ded gallo neku oka clarity vastadi

Posted

Uttam Kumar Reddy: తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీల నీటిని వాడుకునేలా బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి 

17-01-2025 Fri 22:15 | Telangana
Uttam Kumar Reddy blames BRS over Krishna water issue
 

 

  • బీఆర్ఎస్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపణ
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కృష్ణా జలాల్లో 70 శాతం వాటా వాదనను లేవనెత్తామన్న మంత్రి
  • రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణపై బీఆర్ఎస్ మాట్లాడలేదని విమర్శ
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నీటి వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పాపం బీఆర్ఎస్‌దే అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణకు తీరని ద్రోహం చేసిందన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసుకున్న చీకటి ఒప్పందంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తాత్కాలిక కేటాయింపులపై ప్రతి సంవత్సరం సంతకాలు చేసిందే వాళ్లు అని ఆరోపించారు. కానీ కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా రావాలనే వాదనను లేవనెత్తింది తమ కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయంలో బీఆర్ఎస్ గొప్పతనమేమీ లేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ద్వారా త్వరగా నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలించిందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని కూడా అదనంగా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ అనుమతులు జారీ చేసిన సమయంలో బీఆర్ఎస్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...