Jump to content

Recommended Posts

Posted

 

Pawan Kalyan: ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎంలకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్ 

19-01-2025 Sun 17:56 | Andhra
Pawan Kalyan thanked CM Chandrababu for allocating land to NDRF and NIDM
 

 

  • ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న పవన్
  • ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని వెల్లడి
  • మూగ జీవాల ప్రాణాలు కూడా కాపాడారని ప్రశంసలు
కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని, ముఖ్యంగా, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు మర్చిపోలేమని అన్నారు.  

ఎన్డీఆర్ఎఫ్ 18 వేలకు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించిందని, మూగ జీవుల ప్రాణాలను కూడా రక్షించిందని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాజెక్టులకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. 

విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు. 

 

 

 

Posted

Nara Lokesh: గన్నవరం ఎయిర్ పోర్టులో అమిత్ షాకు వీడ్కోలు పలికిన నారా లోకేశ్ 

19-01-2025 Sun 16:43 | Andhra
Nara Lokesh gives send off to Amit Shah in Gannavaram airport
 

 

  • ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
  • ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  • ఎన్డీఆర్ఎఫ్ నూతన ప్రాంగణం ప్రారంభోత్సవంలో పాల్గొన్న లోకేశ్
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో నిర్వహించిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 

ముందుగా నూతన ఎన్ఐడీఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ నూతన ప్రాంగణాన్ని హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులతో కలిసి నారా లోకేశ్ పరిశీలించారు. సంస్థకు సంబంధించిన విషయాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అనంతరం ఎన్ఐడీఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ఇతర నేతలతో కలిసి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్క నాటారు. విపత్తుల సమయంలో ఎలా ఎదుర్కోవాలో తెలిపే విన్యాసాల రూపంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రదర్శనను వీక్షించారు. 

అనంతరం తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇతర నేతలతో కలిసి మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు దగ్గరుండి నారా లోకేశ్ వీడ్కోలు పలికారు.
20250119fr678cde4a8ebeb.jpg
Posted

Chandrababu: ఎక్కడ ఏ విపత్తు జరిగినా మొదట గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్: సీఎం చంద్రబాబు 

19-01-2025 Sun 16:26 | Andhra
Chandrababu lauds NDRF services
 

 

  • కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి హాజరైన సీఎం చంద్రబాబు
  • ఎన్ఐడీఎం భవనాలకు ప్రారంభోత్సవం 
ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, ఎన్ఐడీఎమ్ సౌత్ క్యాంపస్ భవనాలను అమిత్‌షాతో కలిసి ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీఆర్ఎఫ్ సేవలను కొనియాడారు. 

వరదలు, అగ్ని ప్రమాదాలు, అడవుల దహనం, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ రక్షణ చర్యలతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అన్నారు. 

"దేశంలో లక్షల మంది ప్రాణాలను ఎన్డీఆర్ ఎఫ్ బలగాలు కాపాడుతున్నాయి. మన దేశంలో వచ్చిన విపత్తులతో పాటు 2011లో జపాన్, 2015లో నేపాల్, 2023లో టర్కీలో విపత్తులు వచ్చిన సమయంలో మన ఎన్డీఆర్ఎఫ్ నే సేవలందించింది. 2014లో ఉత్తరాంధ్రలో వచ్చిన హుద్‌హుద్, ఇటీవల బుడమేరు వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ చేసిన సాహసోపేతమైన సేవలను ప్రత్యక్షంగా చూశాను.

ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణం ఏపీలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉంది. 2014లో ఆనాటి రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ చేతుల మీదుగా ఈ ప్రాంగణానికి శంకుస్థాన చేశారు. ఎన్ఐడీఎంకు 2018లో వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కు 50 ఎకరాలు, ఎన్ఐడీఎం ప్రాంగణం నిర్మాణానికి 10 ఎకరాల భూమి ఇచ్చాం. రెండూ పూర్తయి నేడు హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది" అని అన్నారు.
Posted

Chandrababu: అమిత్ షా పనితీరు చూస్తే కొన్నిసార్లు అసూయ కలుగుతుంది: సీఎం చంద్రబాబు 

19-01-2025 Sun 14:28 | Andhra
CM Chandrababu hails Amit Shah in NDRF Foudation Day event
 

 

  • కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు
  • హాజరైన అమిత్ షా, చంద్రబాబు తదితరులు
  • అమిత్ షా అన్ని అంశాల్లో వినూత్నంగా ఆలోచిస్తారన్న చంద్రబాబు
  • కేంద్రం నుంచి మరింత సహకారం కోరుతున్నామని వెల్లడి
కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 

హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. అన్ని అంశాల్లోనూ అమిత్ షా వినూత్నంగా ఆలోచిస్తారని, ఏపీ పునర్ నిర్మాణం విషయంలోనూ కొత్తగా ఆలోచించాలని అమిత్ షా సూచించారని వెల్లడించారు. 

"భారతదేశంలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించేందుకు అమిత్‌షా పట్టుదలతో పని చేస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడటంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారు. నేను చాలామంది హోంమంత్రులను చూశాను కానీ... ఇలాంటి సమర్థవంతమైన మంత్రిని మొదటిసారి చూస్తున్నా. అవసరమైన సాంకేతికత వినియోగించుకోవడం, నియామకాలు చేపట్టడమొక్కటే కాకుండా విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో సూచిస్తున్నారు. దేశంలో ఏ మూలాన ఆపదలో ఉన్నా వారి ప్రాణాలు కాపాడాలన్న సంకల్పంతో అమితాషా ఉన్నారు. దేశంలో ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగినా సమర్థవంతంగా పని చేసి చక్కదిద్దుతున్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. సమర్ధతతో పని చేస్తున్న అమిత్ షా పనితీరును చూస్తే కొన్నికొన్నిసార్లు నాకు అసూయ కలుగుతుంది. మనిషిలా కాకుండా మిషన్‌లా పని చేస్తున్నారు. చాలా మంది నేతలు రిబ్బన్‌లు కట్ చేసి ప్రసంగించి వెళ్లిపోతారు. కానీ అమిత్‌షా మాత్రం ఏ అంశాన్ని తీసుకున్నా లోతుగా వివరాలు తెలుసుకుంటారు" అని వివరించారు.

ఇక, గత ఎన్నికల్లో 93 శాతం స్ట్రయిక్ రేట్ తో ఏపీలో ఘనవిజయం సాధించామని చంద్రబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు ఉందన్నారు. ఎన్నికల సమయానికే ఏపీ వెంటిలేటర్ పై ఉందని అన్నారు. కేంద్రం ఆక్సిజన్ అందించడంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడిందని, అందుకు కేంద్రం పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. అయితే, ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడినా, ఇంకా పేషెంట్ గానే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

అమరావతి నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చిందని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేంద్రం మార్గదర్శకత్వంలో పోలవరం డయాఫ్రం వాల్ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో 2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక, తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీతో ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారని చంద్రబాబు కొనియాడారు. ఇటీవల విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలని ఆకాంక్షించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. 

ప్రధాని మోదీ కలను సాకారం చేసేందుకు అందరం కృషి చేస్తున్నామని, ఏపీలోనూ విజన్-2047 లక్ష్యంగా ముందుకెళుతున్నామని తెలిపారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు.
Posted
40 minutes ago, Raisins_72 said:

Protest-Politics--CBN-Changed-Colour--15

adheley 😂😂😂

2028 lo baboru against center , blaming center not compelting polavaram antav

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...