Jump to content

Recommended Posts

Posted

Gottipati Ravi Kumar: జగన్ జల్సాలకు రూ. 19,871 కోట్ల ప్రజా ధనం వృథా చేశారు: మంత్రి గొట్టిపాటి రవి 

29-01-2025 Wed 16:55 | Andhra
Gottipati fires on Jagan
 

 

  • జగన్ కుటుంబం 8 లక్షల కోట్లు దోచుకుందన్న గొట్టిపాటి
  • జగన్ తిన్న ఎగ్ పఫ్ ల ఖర్చే రూ. 3 కోట్లు అని విమర్శ
  • రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొందని వెల్లడి
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ రెడ్డి కుటుంబం రూ. 8 లక్షల కోట్లు దోచుకుందని అన్నారు. జగన్ జల్సాలు, దుబారాలకు రూ, 19,871 కోట్ల ప్రజా ధనం వృథా చేశారని దుయ్యబట్టారు. జగన్ తిన్న ఎగ్ పఫ్ ల ఖర్చే అక్షరాలా రూ. 3 కోట్లు అని చెప్పారు. ప్రచార పిచ్చితో ఒక పత్రికకు రూ. 1,600 కోట్లు కట్టబెట్టారని విమర్శించారు. 

ధాన్యం బకాయిలు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 22 వేల కోట్ల బకాయిలను తమ కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొందని చెప్పారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు తమ ప్రభుత్వం ఏడాదికి రూ. 71 వేల కోట్ల అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.
Posted

 

Chandrababu: పెద్దిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు 

29-01-2025 Wed 16:17 | Andhra
CM Chandrababu orders to enquiry on Peddireddy family alleged land encroachment
 

 

  • మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భారీగా భూ అక్రమణ
  • పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు
  • చంద్రబాబు ఆదేశాలతో విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోద బాయితో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపిన అనంతరం నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. 

కాగా, సీఎం చంద్రబాబుకు ఈ వ్యవహారంలో ప్రాథమిక నివేదిక అందినట్టు తెలుస్తోంది. అటవీప్రాంతంలోని 75 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా భావిస్తున్నారు. 

 

 

 

Posted

Land Grabbing: ఇవాళ బయటికొచ్చిన పెద్దిరెడ్డి భూభాగోతం కొంతే... ఇంకా చాలా ఉంది: మంత్రి డీవీబీ స్వామి 

29-01-2025 Wed 15:58 | Andhra
DVB Swamy reacts on Peddireddy alleged land grabbing
 

 

  • మంగళంపేట అటవీప్రాంతంలో భూఆక్రమణల వ్యవహారం
  • మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు
  • గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలకు అడ్డే లేకుండాపోయిందన్న స్వామి
  • అందరి భాగోతాలు త్వరలో బయటికొస్తాయని వెల్లడి
వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మంగళంపేట అటవీప్రాంతంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణకు పాల్పడిందన్న సమాచారంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందించారు. 

గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల భూ అక్రమాలకు అడ్డే లేకుండా పోయిందని విమర్శించారు. ఇవాళ బయటికొచ్చిన పెద్దిరెడ్డి భూ దోపిడీ కొంతేనని... బయటికి రావాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. అందరి భాగోతాలు త్వరలో బయటికి వస్తాయని మంత్రి డీవీబీ స్వామి స్పష్టం చేశారు. 

ఇక, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే పింఛను పెంపు, ఉచిత సిలిండర్ పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని తెలిపారు.
Posted

Pawan Kalyan: పెద్దిరెడ్డి కుటుంబం అటవీభూముల ఆక్రమణ... సమగ్ర నివేదిక కోరిన పవన్ కల్యాణ్ 

29-01-2025 Wed 14:52 | Andhra
Pawan Kalyan orders on Peddireddy family alleged land grabbing
 

 

  • మంగళంపేట అటవీప్రాంతంలో భారీ ఎస్టేట్
  • ఎస్టేట్ కు వెళ్లేందుకు అడవిలో రోడ్డు
  • పెద్దిరెడ్డి కుటుంబంపై భూ అవకతవకల ఆరోపణలు
  • తీవ్రంగా పరిగణిస్తున్న ఏపీ సర్కారు
  • అటవీశాఖ మంత్రిగా రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్
చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భారీ ఆక్రమణలకు పాల్పడినట్టు, ఒక ఎస్టేట్... అందులో లగ్జరీ గెస్ట్ హౌస్ నిర్మించుకుని... ఎస్టేట్ కు వెళ్లేందుకు అటవీ ప్రాంతంలో రోడ్డు వేసుకున్నారని సమాచారం వెలువడడం తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. 

అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముందు, వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక అందించాలని పీసీసీఎఫ్ ను ఆదేశించారు. అటవీభూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్దేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు? అక్కడున్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారు? అనే అంశాలపై విచారణ చేపట్టాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? ఒకవేళ రికార్డులు తారుమారు చేస్తే అందుకు బాధ్యులెవరు? తద్వారా లబ్ధి పొందింది ఎవరు? అనే అంశాలను నివేదికలో పొందుపరచాలని తెలిపారు.
Posted
9 minutes ago, psycopk said:

 

peddi reddy antaa veesy kadhu mayaaaa, jagan anna nee lekka cheyaruu ee pedi reddy kutumbham, inkaaa cbn ni lekka sestharaaa

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...