Jump to content

Recommended Posts

Posted

Posani Krishna Murali: 67 ఏళ్ల పోసానిని వేధించేందుకే ఆ జైలుకు, ఈ జైలుకు తిప్పుతున్నారు: అంబటి రాంబాబు

04-03-2025 Tue 18:15 | Andhra
Ambati Rambabu talks about Posani issue

 

  • పోసానిపై ఏపీలో పలు స్టేషన్లలో కేసులు
  • నేడు గుంటూరు నుంచి ఆదోనికి తరలింపు
  • దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామన్న అంబటి
  • ఒకే అంశంపై 16 కేసులు పెట్టడమేంటని నిలదీత
  • పోసాని ఏమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? అంటూ ఆగ్రహం

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోనీ పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు జైలు నుంచి తరలిస్తుండడం పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. మూడ్రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పోసానికి 67 ఏళ్ల వయసు అని, ఆయన ఈ వయసులో ఆ జైలుకు, ఈ జైలుకు తిప్పడం వేధించడమేనని విమర్శించారు. 

"పోసానిని రైల్వే కోడూరు నుంచి నరసరావుపేట తీసుకువచ్చారు. నరసరావుపేట నుంచి గుంటూరు సబ్ జైలుకు తరలించారు. మళ్లీ ఇవాళ ఆదోని అంటున్నారు... అదొక 400 కిలోమీటర్లు ఉంటుంది. 67 ఏళ్ల పోసాని పట్ల ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గం. 

గత రాత్రే ఆయనను తీసుకువచ్చారు... ఇప్పుడు మళ్లీ తీసుకెళుతున్నారు. అది కూడా పోలీస్ జీప్ లో తీసుకెళుతున్నారు... పోలీస్ జీప్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వేధింపులకు గురిచేసేందుకు ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. 

పోసానిపై ఒకే అంశం మీద 16 కేసులు పెట్టారని తెలుస్తోంది... ఈ విషయాన్ని పరిశీలిస్తాం. పోలీస్ వ్యవస్థ, నారా లోకేశ్ కలిసి ఉద్దేశపూర్వకంగా పాల్పడుతున్న కుట్ర ఇది. 

ఆయనేమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? మీడియాలో మాట్లాడినందుకు 16 కేసులు పెట్టారు. ఓ రెండు మూడు నెలలు ఆయనను ఇలా కేసుల పేరిట తిప్పాలన్న దురుద్దేశంతో కుట్రపూరితంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాకపోతే ఇంకేమిటి? వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్లందరినీ భయపెట్టాలనుకుంటున్నారు. దీనిపై మేం న్యాయపోరాటం చేస్తాం" అంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Posted

Posani Krishna Murali: కేసులు కొట్టేయండి... ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్

04-03-2025 Tue 22:49 | Andhra
Posnai approaches AP High Court

 

  • పోసానిపై ఏపీలో వరుస కేసులు
  • ఉక్కిరిబిక్కిరి అవుతున్న సినీ నటుడు
  • హైకోర్టును ఆశ్రయించిన వైనం

వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని అర్థించారు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, ఆయా కేసుల్లో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరారు. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు... చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు... ఇలా వివిధ ఆరోపణలతో పోసానిపై ఏపీలో దాదాపు 16 వరకు కేసులు నమోదయ్యాయి. 

తొలుత ఆయనను రాయచోటి పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేయగా, ఆ తర్వాత నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ గుంటూరు జైల్లో ఉన్న ఆయనను ఆదోనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయను గుంటూరు నుంచి ఆదోనికి తరలించినట్టు తెలుస్తోంది.
Posted

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు

03-03-2025 Mon 17:35 | Andhra
Vallabhaneni Vamsi remand extended

 

  • ఈనెల 17 వరకు వంశీ రిమాండ్ పొడిగింపు
  • సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ జరిపిన కోర్టు
  • రేపు తీర్పును వెలువరించే అవకాశం

సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు మరోసారి పొడిగించింది. ఈనెల 17 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంశీపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ ను కోర్టు విచారించింది. కేసు విచారణ సందర్భంగా వంశీని కోర్టు వర్చువల్ గా విచారించింది. దీనిపై కోర్టు రేపు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. 

దీంతో పాటు బ్యారక్ మార్చాలంటూ వంశీ వేసిన పిటిషన్ ను కూడా కోర్టు విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Posted

Posani Krishna Murali: పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కర్నూలు కోర్టు

05-03-2025 Wed 08:15 | Entertainment
Actor Posani remanded for 14 days by Kurnool court

 

  • చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని
  • రాష్ట్రవ్యాప్తంగా 17 కేసుల నమోదు
  • ఆదోనిలో నమోదైన కేసులో ఈ నెల 18 వరకు రిమాండ్
  • కర్నూలు జిల్లా కోర్టుకు తరలింపు

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఇలాంటి కేసులోనే అరెస్టై గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని తమకు అప్పగించాలంటూ ఆదోని పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతినివ్వడంతో పోసానిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ఎదుట పోసానిని ప్రవేశపెట్టారు. 

ఇరు పక్షాల వాదనల అనంతరం పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు, నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. 
Posted
16 hours ago, psycopk said:

 రాంబాబు

04-03-2025 Tue 18:15 | Andhra
Ambati Rambabu talks about Posani issue

 

  •  

Aaditho paatu eedni kuda pattakapondi

Posted
1 minute ago, allbakara said:

Aaditho paatu eedni kuda pattakapondi

Sukanya sowjanya untey he will come 

Posted

Next time video call chesta antuna madhav

 

Gorantla Madhav: పోలీసు విచారణ అనంతరం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన గోరంట్ల మాధవ్ 

06-03-2025 Thu 16:10 | Andhra
Gorantla Madhav fires on Chandrababu after police questioning
 

 

  • ఇందిర హయాంనాటి ఎమర్జెన్సీని చంద్రబాబు గుర్తు చేస్తున్నారన్న మాధవ్
  • తప్పుడు కేసులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని వ్యాఖ్య
  • పోలీసులు మరో నోటీసు ఇచ్చారని వెల్లడి
పోక్సో కేసులోని అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేశారనే కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. కాసేపటి క్రితం ఆయన విచారణ మూగిసింది. ఆయనకు పోలీసులు మరో నోటీసును ఇచ్చారు. విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాధవ్ మండిపడ్డారు. కేసులు పెడుతూ తమ అధినేత జగన్ ను ఆపాలని చూస్తే... సూర్యుడిని ఆపాలని చూసినట్టేనని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంనాటి ఎమర్జెన్సీని చంద్రబాబు గుర్తు చేస్తున్నారని అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు, బెదిరింపులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని చెప్పారు. తనకు పోలీసులు మరో నోటీసు ఇచ్చారని... విచారణకు సహకరిస్తానని పోలీసులకు చెప్పానని తెలిపారు. 

 

 

 

Posted

 

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్... బెయిల్ ఇవ్వొద్దన్న పీపీ 

06-03-2025 Thu 16:02 | Andhra
Court adjourns hearing in Vallabhaneni Vamsi bail petition
 

 

  • బెయిల్ పిటిషన్ ను విచారించిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు
  • వంశీ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్న పీపీ
  • అనారోగ్యంతో ఉన్న వంశీకి బెయిల్ ఇవ్వాలని కోరిన ఆయన తరపు న్యాయవాదులు
కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈరోజు విచారించింది. వంశీకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. పోలీస్ కస్టడీలో విచారించిన సమయంలో కీలక సమాచారం తెలిసిందని చెప్పారు. వంశీ ఆదేశాలతోనే సత్యవర్ధన్ ను కలిశామని ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితులు అంగీకరించారని తెలిపారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని కోరారు. వంశీ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని... అందుకే 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశామని తెలిపారు. 

వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ... సత్యవర్ధన్ కిడ్నాప్ తో వంశీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వంశీపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని అన్నారు. వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని... ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. 

 

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...